అన్వేషించండి

YSRCP: వారం రోజుల్లో మూడు పొరపాట్లు? వైసీపీ లెక్క తప్పుతుందా?

YSRCP: వారం రోజుల్లో మూడు వరుస పొరపాట్లు? ఎమోషన్‌తో తీసుకుంటున్న నిర్ణయాలతో వైసీపీ లెక్క తప్పుతుందా? ఆ పార్టీలో అసలేం జరుగుతోంది.

YSRCP: రాజకీయాల్లో ప్రతీ అడుగు ఎంతో లెక్క చూసుకుని వేయాలి అంటారు. వ్యూహ ప్రతివ్యూహాలతో నిండి ఉండే పాలిటిక్స్ లో ఒక్క పొరపాటు మొత్తం రాజకీయ పార్టీ దిశను మార్చేస్తుంది. అలాంటిది జూన్ నెల వచ్చిన మొదటి వారం రోజుల్లోనే ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసిపి వరుసగా మూడు పొరపాట్లు చేసిందంటున్నారు  పొలిటికల్ ఎనలిస్ట్ లు.  అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1) తెనాలి పర్యటన- జగన్ స్పీచ్
తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై లాఠీలతో కొట్టిన దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్లంతా గంజాయి బ్యాచ్ అని మత్తులో కానిస్టేబుల్ ని కొట్టారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే పోలీసులు ఆ విధంగా  దండించాల్సి వచ్చిందని అధికార పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే వాళ్లు దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులనీ దేశంలో చట్టం ఉండగా ఇలా పోలీసులు దాడి చేయడం కరెక్ట్ కాదని  ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయమై ప్రతిపక్షం కూడా గట్టిగానే స్పందించింది. వైసీపీ అధినేత జగన్ హుటాహుటిన తెనాలి వెళ్లి ఆ యువకులని పరామర్శించారు. అయితే అసలు ఆ ఘటనలో నిజానిజాలు ఏంటో తేలకుండా ఎందుకు అంత హడావుడిగా వెళ్లారు అనేది  ఇప్పుడు ఆయన ప్రత్యర్థి పార్టీలు వేస్తున్న ప్రశ్న. పైగా వెంటనే టిడిపి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో డాక్టర్ సుధాకర్ అంశం తెరపైకి వచ్చింది. మాస్క్ అడిగినందుకు ఆయనకు పిచ్చివాడని ముద్ర వేసి చనిపోయేదాకా పరిస్థితి తీసుకొచ్చారంటూ  అప్పటి జగన్ ప్రభుత్వంపై దాడి మొదలైంది.

మరో వైపు తెనాలిలో జగన్ ఇచ్చిన స్పీచ్ కూడా స్పష్టత లేకుండా సాగింది. నిజానికి ఇలాంటి అంశాల్లో ప్రతిపక్షాలు ముందుగా ఒక బృందాన్ని పంపించడమో, నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేయడమో రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తున్న విధానం.  పోలీసులపై చట్టపరమైన చర్యలు , ఆ యువకులపై ఉన్న కేసులు విషయం పక్కన పెడితే ఆ ముగ్గురి విషయమై స్థానికులు చెబుతున్న దాని ప్రకారం  ఎక్కువగా నెగెటివిటీనే సోషల్ మీడియాలో కనిపిస్తోంది. తెనాలి పర్యటన  జగన్‌కు గాని వైసిపి కీ కానీ రాజకీయంగా ఏ విధంగానూ లాభించని అంశం అన్న విశ్లేషణ  ఎక్కువగా వినిపిస్తోంది. ఈ విషయాల్లో వెంటనే పర్యటనకు వచ్చిన జగన్ వేగాన్ని ప్రశంసిస్తూనే ఎంచుకున్న అంశం కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఎక్కువగా వైరల్ అవుతోంది. 

2) వెన్నుపోటు దినం - జగన్ డుమ్మా 

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి  ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని కూటమి గెలిచిన జూన్ 4వ తేదీని  వెన్నుపోటు దినంగా గుర్తించాలంటూ  రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆరోజున కీలక నేతలు అందరూ  వైసీపీ శ్రేణులతో కలిసి  నిరసనలు జరిపారు. బొత్స లాంటి సీనియర్ నేత కూడా నిరసన చేస్తూ ఎండ వేడి తట్టుకోలేక నిరసన కార్యక్రమంలోనే సొమ్మసిల్లారు. 2024 ఎన్నికల తర్వాత  ఏడాది కాలంలో వైసీపీ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఇదే. దానితో కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారు. కానీ విచిత్రంగా ఈ ప్రోగ్రాంకి పిలుపు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి వెన్నుపోటు దినంలో పాల్గొనలేదు. అంతకు ముందు రోజు తెనాలి పర్యటన చేపట్టిన జగన్ జూన్ 4న బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి ముందుగా షాక్ తిన్నది వైసిపి శ్రేణులే. బహిరంగంగా వాళ్ళు చెప్పకపోయినా ఇలా ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో  పార్టీ అధినేత రాష్ట్రంలో ఎక్కడా పాల్గొనకపోవడంపై వారిలో తీవ్ర అసంతృప్తి కలిగిన మాట వాస్తవం.

3) అమరావతి డిబేట్ ఇష్యూ హ్యాండిలింగ్ లో పొరబాట్లు
లేటెస్ట్ కాంట్రవర్సీ రాజధాని అమరావతి "దేవతల రాజధాని కాదు... మరో విధమైన రాజధాని అంటూ" రాయలేని భాషలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు  వ్యాఖ్యానించడం ఆ షోకి యాంకర్ గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్  కొమ్మినేని శ్రీనివాస్‌ దానిని వెంటనే ఆపకపోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు, కేసులకు కారణమైంది. ఇదంతా వైసీపీ అనుబంధ న్యూస్ ఛానల్ గా పేరొందిన సాక్షిలో ప్రసారం కావడంతో టిడిపి శ్రేణులు మంత్రులు నాయకులు  వైసీపీపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరుస కేసులు నమోదు చేయడంతో ఆల్రెడీ కొమ్మినేనిని అరెస్ట్ చేశారు.

మొదటినుంచి మూడు రాజధానుల వ్యవహారంతో అమరావతి రైతులు వర్సెస్ జగనన్నట్టుగా రాజధాని ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నెమ్మదిగా రాజధాని ప్రాంతంలో బలం పెంచుకోవడానికి వైసిపి ప్రయత్నిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి వివాదం కచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం చేసేదే. వైఫై చూసి సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా సమర్ధించుకునే ప్రయత్నం చేశారు అని  అటు ఛానల్ పైన ఇటు ఆ జర్నలిస్టుపైనా విరుచుకుపడుతున్నారు రాజధాని మహిళలు, మహిళా టిడిపి నేతలు.

ఇందులోని రాజకీయ కోణం అందరికీ తెలిసిందే కానీ ఆ వ్యాఖ్యలు ప్రసారం కాగానే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసిపి థింక్ ట్యాంక్ కచ్చితంగా పొరపాటు చేసింది అనేది ఎనలిస్టుల అభిప్రాయం. దీన్ని మరి వైసీపీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఇలా కేవలం వారం రోజుల వ్యవధిలో వైసిపి చేసిన మూడు వ్యూహాత్మక పొరపాట్లు టిడిపికి  ఆ విధంగా మారాయి అన్నది  రాజకీయ పరిణామాలు గమనిస్తున్న వారి అభిప్రాయం. మొత్తం మీద  వైసిపి  జరుగుతున్న పరిణామాలను  ఎమోషన్తో కాకుండా ఎనలైజ్ చేసుకుని ముందుకు వెళితే పార్టీకి లాభిస్తుందని ఎక్కువమంది చెబుతున్న మాట.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Embed widget