అన్వేషించండి

Kuppam Politics : వైఎస్ఆర్‌సీపీ టార్గెట్ కుప్పం - చంద్రబాబును బలహీనం చేసే మిషన్‌లో దాడులు వ్యూహం ఫలించిందా ?

కుప్పం చుట్టూ వైఎస్ఆర్‌సీపీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. చంద్రబాబు సంప్రదాయ రాజకీయాల్ని.. దాడులు.. కేసులతో ఓడించేందుకు ప్రయత్నిస్తోంది. మరి ముందడుగు వేసిందా ?

Kuppam Politics :  మాజీ సీఎం, టీడీపీ  అధినేత చంద్రబాబు కుప్పం  మూడురోజుల పర్యటన ఉద్రికత్తల మధ్య ముగిసింది. వైసీపీ శ్రేణుల నిరసనలు, ధర్నాలతో సొంత నియోజకవర్గంలో చంద్రబాబు సాగించిన పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. అన్నా క్యాంటీన్‌ ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబుని మట్టుబెట్టడం  జగన్‌ కి పెద్ద విషయం కాదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకుముందు మాజీ సిఎం చేత కన్నీరు పెట్టించిన వైసీపీ నేతలు ఇప్పుడు రోడ్డు మీద కూర్చోనేలా చేశారన్న విమర్శలు వినిపించాయి. కుప్పంలో మూడురోజుల పర్యటన టిడిపి-వైసీపీ నేతల బలాబలాలకు వేదికగా మారడంతో రకరకాల ప్రచారాలు సోషల్‌ మీడియాలో హడావుడి చేశాయి.

చంద్రబాబు టూర్‌లో ముందస్తు వ్యూహం ప్రకారం గలాటా !

వయసులో పెద్దవారు, 40 ఇయర్స్‌ పొలిటికల్‌ ఇండస్ట్రీ, మాజీ సిఎం అని లేకుండా చంద్రబాబుని ఈ రకంగా జగన్‌ అవమానించడాన్ని ఆ పార్టీ అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే బాబు విసిరిన డైలాగ్‌ ని  సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఉత్తరకొరియాలో కిమ్‌ మాదిరి మనకు ఇక్కడ జిమ్‌ ఉన్నాడని చంద్రబాబు చివరి రోజు పర్యటనలో విమర్శించారు. ఈ నేరస్తుల పాలన ఎన్నో రోజులు ఉండదని హెచ్చరిస్తూ ఖబడ్దార్‌ జగన్‌ రెడ్డి అని ఆవేశపడ్డారు. ఇలా చంద్రబాబు మూడురోజుల పర్యటనంతా హాట్‌ హాట్‌ గా సాగడంతో బాబు గారి ఆవేశం..ఆవేదనని ..ఆక్రోశాన్ని చూడంటంటూ వైసీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో రివర్స్‌ ఎటాక్‌ కి దిగాయి. ఇటు ఏపీ సిఎం ఈ వ్యవహారాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. విశాఖలో ప్లాస్టిక్‌ తో పార్లే తయారు చేసిన వస్తువులను ఆసక్తికరంగా తిలకించడమే కాకుండా కళ్లజోడుని పెట్టుకొని సరదాగా తిరిగారు. ఇక సభా వేదికపై కూడా ఆ కళ్ల జోడుని పెట్టుకొని అందరి చేత నవ్వించారు.  

అన్నా క్యాంటీన్ ధ్వంసంతో  వైఎస్ఆర్‌సీపీపై నెగెటివ్ ప్రచారం

అన్నా క్యాంటిన్ ఏర్పటు చేసి చంద్రబాబు చేత ప్రారంభించేందుకు సిద్దం చేస్తే..అన్నా క్యాటిన్ ను కూల్ఛీ వేసి అడ్డుకొనేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపై రాళ్ళ దాడికి దిగారు.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే అడ్డుకున్నం, దాడి చేశాం  ఇక మీరేంత అన్న సంకేతాన్ని మిగతా నాయకులకు ఇచ్చేందుకే తెగబడ్డారని టీడీపీ పార్టీలో చర్చ నడుస్తుంది.. జడ్ ప్లస్ బద్రతా క్యాటగిరి లో ఉన్న   చంద్రబాబు పై దాడి చేసేం... ఇక మేము తలచుకుంటే మీరెంత‌ అన్న సంకేతం ఇవ్వడంలో వైసీపీ సక్సెస్ అయిందని భావిస్తున్నారు.  టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులలో‌ మనోదైర్యం నింపేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగవలసిన పరిస్థితి ఏర్పడింది...వైసీపీ నాయకులు ద్వంసం చేసిన అన్న క్యాంటిన్ కు కూత వేటు దూరంలో పోలీస్టేషన్ ఉన్న వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడటాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పపట్టారు.గంటల‌ వ్యవదిలో‌ అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేయించి ప్రారంభించడమే కాకుండా స్వయంగా తానే  వడ్డనలో  పాల్గొని క్యాడర్ కు నేనున్నాను అని దైర్యం నింపారు...దాడులకు తాను, తన పార్టీ శ్రేణులు భయపడటం లేదని అధికార పార్టీకి సంకేతం ఇచ్చారు...

చంద్రబాబు సంప్రదాయ రాజకీయాలకు .. తమదైన కౌంటర్ ఇస్తున్న వైఎస్ఆర్‌సీపీ

గతంలో ప్రధాన ప్రతిపక్ష నేతల‌ నియోజకవర్గంలో పెద్దగా అధికాపక్షం ఫోకస్ పెట్టేది కాదు..కానీ ఇప్పుడు ఆ పరిస్తితి మారిపోయింది... మొదటి హార్డిల్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పాన్ని టార్గెట్ చేసింది సీయం జగన్ వర్గం.... ప్రతిపక్ష నాయకుడి‌‌ ఇలాకాలో అతని పార్టీ శ్రేణులను భయబ్రంతులకు లోను చేసి ...కేసులు, బౌతిక దాడుల‌ ద్వారా వారిలోనే అభద్రతా భావం సృష్టించి భయపడి పార్టీ మారడమే లేకపోతే సైలట్‌ అయ్యే విధంగా   ప్రణాళికాలను సిద్దం చేశారని టీడీపీ నాయకులు అంటున్నారు.. టీడీపీ ప్రధన నాయకుడు చంద్రబాబు కు కంచుకోటగా ఉన్న కుప్పంలో క్యాడర్ ను కకలవికలం చేయడమే‌‌ లక్ష్యంగా పెట్టుకొన్నారు అధికాపార్టీ నాయకులు.. 

కుప్పం ప్రజల్లో శాంతిభద్రతలపై ఆందోళన- టీడీపీ క్యాడర్‌లో భయం

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా వరసగా ఏడు సార్లు కుప్పం నుంచి విజయం సాధించారు చంద్రబాబు... ఇక్కడ టీడీపీ క్యాడర్ను బలహీన పరిచేందుకు సామ,ధాన, వేదాలు అయిపోయాయి...అయిన మార్పు రాలేదు... అందుకనే దండోపాయాన్ని ప్రయేగించారు...పార్టీ అద్యక్షుడు చంద్రబాబు పర్యటన రోజు నుంచి ప్లక్సీలు, చించడం,గొడవ పడటం, చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళు వేయడం ద్వారా కొంత సంకేతాన్ని పంపారు...చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే  పార్టీ శ్రేణులకు రక్షణ లేదని తెలియ చెప్పడం...ఆలాంటిా సమయంలో మీకు ఏమి రక్షణ ఉంటుదో ఆలోచించుకోనే పరిస్తితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులలో కలిగించడం...మీకు మరో ఆప్షన్ లేదు పార్టీ మారడమే శరణ్యం అన్న సంకేతం ఇవ్వడం...కుప్పంలో సాంప్రదాయ ಓట్ బ్యాక్ ను కూడా తమ పార్టీ వైపు మలచుకొని చంద్రబాబును ಓడించటమే ఏకైక లక్ష్యంగా వైసీపీ పని చేస్తుంది. చంద్రబాబు పర్యటన ముగిసిన గంటల‌ వ్యవధిలోనే టీడీపీ నాయకులపై నిరాధారమైన కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు... అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు వైసీపీ వ్యూహంను ఏ‌‌విధంగా ఎదుర్కుంటారో చూడాలి..!
 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? ఢిల్లీలో ఖరారైన కాషాయ వ్యూహం.. దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పులు!
ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? ఢిల్లీలో ఖరారైన కాషాయ వ్యూహం.. దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పులు!
TVK Cabinet Ministers List: తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం విజయ్ వద్దే హోంశాఖ.. ఎవరికి ఏం అప్పగించారు ?
తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం విజయ్ వద్దే హోంశాఖ.. ఎవరికి ఏం అప్పగించారు ?
Chandrababu Naidu: ముగ్గురు పుడితే 30 వేలు.. నలుగురు పుడితే 40 వేలు - జనాభా పెంపుపై చంద్రబాబు సంచలన ప్రకటన.. ఏపీలో బిగ్ స్కీమ్!
ముగ్గురు పుడితే 30 వేలు.. నలుగురు పుడితే 40 వేలు - జనాభా పెంపుపై చంద్రబాబు సంచలన ప్రకటన.. ఏపీలో బిగ్ స్కీమ్!
TamilNadu Politics: మళ్లీ తమిళనాట సనాతన మంట పెట్టిన ఉదయనిధి - అందుకుంటున్న బీజేపీ - అరవ రాజకీయం మారుతోందా?
మళ్లీ తమిళనాట సనాతన మంట పెట్టిన ఉదయనిధి - అందుకుంటున్న బీజేపీ - అరవ రాజకీయం మారుతోందా?

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? ఢిల్లీలో ఖరారైన కాషాయ వ్యూహం.. దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పులు!
ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? ఢిల్లీలో ఖరారైన కాషాయ వ్యూహం.. దక్షిణాది రాజకీయాల్లో భారీ మార్పులు!
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
AP Free Electricity Scheme: సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
Embed widget