అన్వేషించండి

Elections 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న ముహుర్తం-కాంగ్రెస్ ఈ సారైనా ఊపిరి పీల్చుకుంటుందా?

Five State elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ..ఈసీ సన్నాహాలు దాదాపుగా పూర్తి చేసింది. ఈ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలను మార్చనున్నాయి.

Five States assembly elections:    పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే మాూడు నెలల్లో జరగనున్నాయి. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని అనుకున్న  రాష్ట్రాల్లో కూడా ఓడిపోతోంది. రాను రాను ఆ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఇలాంటి సమయంలో మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ముఖాముఖి, కూటములుగా తలపడే పరిస్థితులు ఉన్నాయి.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, ఈ ఎన్నికలు ఆ పార్టీ ఉనికికి ,ప్రతిపక్ష కూట  ఐక్యతకు అగ్నిపరీక్షగా మారాయి.  
 
పశ్చిమ బెంగాల్ - దీదీ అధికారాన్ని నిలబెట్టుకోగలరా?

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తన సంక్షేమ పథకాలు , బెంగాలీ అస్తిత్వంపై నమ్మకం పెట్టుకోగా, ప్రభుత్వ వ్యతిరేకత,  అవినీతి ఆరోపణలను బీజేపీ తన ప్రధాన అస్త్రాలుగా మార్చుకుంది. ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం టీఎంసీ-బీజేపీ మధ్యే ఉండేలా కనిపిస్తోంది. ముస్లిం ఓట్ల సమీకరణ ఇక్కడ గెలుపోటములను శాసించనుంది. మమతా బెనర్జీ ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కూడా గెలిచి చూపిస్తామన్న ధీమాతో ఉంది. 

ద్రావిడ కోటలో కొత్త శక్తుల సందడి 

తమిళనాడులో అధికార డీఎంకే కూటమి బలంగా ఉన్నప్పటికీ, నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం  రాకతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అన్నా డీఎంకే  తన కోల్పోయిన వైభవాన్ని చాటుకోవాలని చూస్తుంటే, బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్ ఇక్కడ డీఎంకేపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. సీట్ల సర్దుబాటు విషయంలో డీఎంకే ఈసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్‌కు ఇది సవాలుగా మారింది. త్రిముఖ పోరులో డీఎంకేకు లాభం కలుగుతుందన్న అంచనాలు వస్తున్నాయి. 

 కేరళ: ఎల్‌డిఎఫ్ హ్యాట్రిక్ కొడుతుందా?  

సాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది, కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఎల్‌డిఎఫ్ చూస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్  కి ఇది చావో రేవో లాంటి ఎన్నిక. ఒకవేళ ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోతే, జాతీయ స్థాయిలో ఆ పార్టీ నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది. అటు బీజేపీ కూడా క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకుంటూ ఇక్కడ బలపడాలని చూస్తోంది. ప్రియాంకా గాంధీ వాయనాడ్ నుంచి ఎంపీగా ఉండటంతో  గెలుపు సాధించడం ప్రతిష్టాత్మకంగా మారింది. 

 అసోం: బీజేపీ హ్యాట్రిక్ ప్రయత్నం 

అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అభివృద్ధి ,  హిందుత్వ నినాదాలతో బీజేపీ మూడోసారి అధికారంపై కన్నేసింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతోంది. పైగా కీలక నేతలు బీజేపీలో చేరడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ఏఐయుడిఎఫ్ వంటి పార్టీలతో పొత్తులు కుదిరితేనే కాంగ్రెస్ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే బీజేపీకి మార్గం సుగమం అవుతుంది.

 పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతంలో పట్టు కోసం పోరు 

పుదుచ్చేరిలో ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ , బీజేపీ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండేది, కానీ నేతల వలసలు ఆ పార్టీని బలహీనపరిచాయి. ఇక్కడ కూడా డీఎంకే మద్దతుతోనే కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఉంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, ఇక్కడ గెలుపు కేంద్రంలోని అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం.
 
ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కేరళలో అధికారం దక్కించుకోలేకపోతే, ఆ పార్టీ కేవలం కొన్ని చిన్న రాష్ట్రాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు, బెంగాల్ ,  తమిళనాడులో ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, డీఎంకేలు గెలిస్తే, ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గి, మమతా బెనర్జీ , స్టాలిన్ వంటి నేతలు జాతీయ నాయకత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని మార్చనున్నాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Chandrababu: రాజ్యసభకు ఇవాళ నితీష్, రేపు చంద్రబాబేనా? - మోదీ , షా ప్లాన్ చేస్తున్నారా?
రాజ్యసభకు ఇవాళ నితీష్, రేపు చంద్రబాబేనా? - మోదీ , షా ప్లాన్ చేస్తున్నారా?
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Puducherry Elections 2026: పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పార్టీనే గేమ్ ఛేంజర్ - ఓడించేది.. గెలిపించేది విజయే !
పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పార్టీనే గేమ్ ఛేంజర్ - ఓడించేది.. గెలిపించేది విజయే !
Telangana CM Revanth : 99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Embed widget