అన్వేషించండి

Vijayawada MP Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని పయనం ఎటు? పార్టీలో ఉంటారా? వేరే దారి చూసుకుంటారా?

Vijayawada MP Kesineni Nani: కేశినేని నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. పార్టీలో ఉంటారా లేకుంటే పక్క చూపులు చూస్తారా? ఎప్టటి నుంచో ఆయన వెళ్లిపోతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తారా?.

Telugu Desam Party MP Kesineni Nani: టీడీపీ(TDP) విజయవాడ ఎంపీ(Vijayawada MP) అభ్యర్థిగా తనను తప్పించారని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) నెక్ట్స్ స్టెప్‌ ఏంటన్న చర్చ మొదలైపోయింది. ఎప్పుడూ కేశినేని రాజకీయమే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పార్టీ ఏదైనా ఆయన రూటే సెపరేట్‌. అందుకే జిల్లా పార్టీలో ఆయన మిత్రుల కంటే ప్రత్యర్థులే ఎక్కువ ఉంటారు. 

ప్రజారాజ్యంలో సంచలనం

ప్రజారాజ్యంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు కేశినేని నాని. అక్కడ మూడంటే మూడు నెలలు మాత్రమే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీలోనే మీటింగ్‌ పెట్టి అధినాయకత్వాన్ని తిట్టి పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత 2009లో టీడీపీలో చేరారు. 2014, 2019లో విజయవాడ ఎంపీగా రెండుసార్లు టీడీపీ తరఫున విజయం సాధించారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడటంతోపాటు దూకుడు రాజకీయాలు ప్రత్యర్థులకు ఇబ్బందిగా మారుతుంటాయి. 

హ్యాట్రిక్‌ కొడతానన్న టైంలో షాక్

మూడోసారి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్న టైంలో టీడీపీ కేశినేని నానికి షాక్ ఇచ్చింది. ఆ స్థానంలో వేరే వ్యక్తికి చోటు ఇస్తామని మీరు జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతానికి ఈ విషయంలో అధినేత ఆదేశాలను పాటిస్తానని సోషల్ మీడియాలో ప్రకటించిన నాని ఎంత వరకు సైలెంట్‌గా ఉండగలరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

నోటికి ఫిల్టర్‌ లేక సమస్యలు

పార్టీ పదవిలో ఉన్నప్పుడే నాని నోటికి ఫిల్టర్ పడేది కాదు. ఇప్పుడు అసలు వచ్చే ఎన్నికల్లో మీరు అభ్యర్థివి కావంటే ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పుకోవడం కష్టమే అంటున్నారు నాని సన్నిహితులు. తనకు ఎదురు చెప్పే వాళ్లను అక్కడికక్కడే ఇచ్చే పడేసే రకం నాని. ఒకానొక  సందర్భంలో ఢిల్లీలో చంద్రబాబు ఎదురుగానే తోటి ఎంపీపై దురుసుగా ప్రవర్తించారు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. 

సోదరిడితో విభేదాలు 

సొంత సోదరుడు కేశినేని చిన్నిని పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని తరచూ వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా బొండా ఉమ, దేవినేని ఉమను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించేవారు. పార్టీకి ఇబ్బంది అని తెలిసినా అధినాయకత్వం ఏమీ అనలేని స్థితిలో ఉండేది. 
ట్రావెల్స్ విషయంలో 2017 అప్పటి రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై దాడి కేసులో కూడా నానిదే ప్రధాన పాత్ర. ఈ విషయంలో అప్పటి సీఎం చంద్రాబబు నానితోపాటు విజయవాడ లీడర్లను పిలిచి క్లాస్ పీకారు. తర్వాత కమిషనర్‌ వద్దకు వెళ్లి సారీ చెప్పి వచ్చారు. తర్వాత తన దశాబ్ధాల చరిత్ర ఉన్న ట్రావెల్స్ బిజినెస్‌నెస్‌ క్లోజ్ చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

బీజేపీలోకి వెళ్తారని టాక్

అప్పటి నుంచి నాని ప్రవర్తనలో మార్పు వచ్చిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. సమయం వచ్చినప్పుడుల్లా అధినాయకత్వంతోపాటు, స్థానిక లీడర్లపై చిందులు తొక్కుతుంటారు.  ఒకానొక సమయంలో ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం నడిచింది. అప్పటికే బీజేపీలోకి వెళ్లిన టీడీపీ ఎంపీలతోపాటు ఈయన కూడా వెళ్తున్నారని అంతా అనుకున్నారు. ఏమైందో కానీ మళ్లీ వెనక్కి తగ్గారు. 
తాజాగా రెండు రోజుల క్రితం తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎంపీ స్థానాన్ని బీసీలకు ఇస్తే స్వాగతిస్తానని చెప్పిన ఆయన నీతిపరులకు మాత్రమే సపోర్ట్ చేస్తానన్నారు. లేకుంటే ఎవర్నీ గెలవనివ్వనంటూ మాట్లాడారు. 

వైసీపీతో చాలా క్లోజ్

టీడీపీ ఎంపీ అయినప్పటికీ నాని వైసీపీ లీడర్లకు చాలా క్లోజ్‌. తరచూ వారితో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్లు. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పు ఏంటని ప్రశ్నించే వాళ్లు. తనకు అందరూ మిత్రులేనని రాజకీయాలు వేరు అభివృద్ధి పనులు వేరు అంటూ వెల్లడించే వాళ్లు. 

బంపర్ ఆఫర్ వస్తే ఆగుతారా!

వైసీపీ వాళ్లతో క్లోజ్‌గా ఉండటంతో కేశినేని నాని ఎప్పటికైనా ఆ గూటికి చేరుతారని చాలా మంది అనుకునే వాళ్లు. వెంటనే మళ్లీ చంద్రబాబు కార్యక్రమాల్లో కానీ, టీడీపీ ప్రోగ్రామ్స్‌లో ప్రత్యక్షమై యాక్టివ్‌ రోల్‌ పోషించే వాళ్లు. ఇలా అందర్నీ ఆయన కన్ఫూజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దీనికి పుల్‌స్టాప్ పడే టైం వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నానికి ఛాన్స్ ఇవ్వడం లేదని క్లారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టు కూడా చాలా వ్యంగ్యంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పక్క పార్టీల నుంచి బంపర్ ఆఫర్‌ ఏమైనా వస్తే ఆయన పరిశీలంచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తానికి విజయవాడ రాజకీయాల్లో భవిష్యత్‌లో ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయని ఈ పరిణామంతో అర్థమవుతుంది.  

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని ఔట్‌


    విజయవాడ ఎంపీ స్థానం నుంచి కేశినేని టీడీపీ తప్పించినట్టు సిట్టింగ్ ఎంపీ నాని తెలియజేశారు. తన స్థానంలో కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

 

షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ వల్ల వైసీపీ, టీడీపీల్లో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?


    వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) అధినాయకురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతగా కొత్త భూమికను పోషించబోతున్నారు. పార్టీలో విలీనం తర్వాత ఎక్కడైనా పని చేస్తానని ప్రకటించారు.అది ఏపీ అయినా అండమాన్ అయినా సరే అని స్పష్టం చేశారు. ఆమె చేరిక కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ రాకపోవడంతో ఆమె నీడ తెలంగాణ కాంగ్రెస్ పై పడేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదని అర్థమవుతుంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget