అన్వేషించండి

వైసీపీ తరఫున పోటీ చేసే ఉద్దేశం లేదు- క్లారిటీ ఇచ్చిన మాజీ ఐపీఎస్‌ లక్ష్మినారాయణ

ఒక కార్యక్రమానికి వెళ్లి అభినందించినంత మాత్రాన ఆ పార్టీలో చేరుతున్నానని ప్రచారం చేయడం సరికాదన్నారు లక్ష్మీనారాయణ.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతున్నారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాము ఏర్పాటు చేసుకుంటున్న పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని ఆహ్వానించడానికే వెళ్లానని చెప్పుకొచ్చారు. ఆ టైంలో అక్కడ ఏర్పాటు చేసిన వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి తనను పిలిచారని వివరించారు. ఆ సమావేశంలో తాను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించనే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. 

ఒక కార్యక్రమానికి వెళ్లి అభినందించినంత మాత్రాన తాను అధికార పార్టీలో చేరుతున్నానని ప్రచారం చేయడం సరికాదన్నారు లక్ష్మీనారాయణ. వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. అలాంటి ఉద్దేశం తనకు లేదని వివరించారు. జరుగుతున్న ప్రచారం, ఊహాగానాల్లో ఏ మాత్రం నిజం లేదని ఖండించారు లక్ష్మీనారాయణ. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే తన పోరుబాటకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. 
 

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణితో కలిసి ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా హాజరైన లక్ష్మీ నారాయణ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని  పొగడుతూ మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. విద్యా, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి కచ్చితంగా ఫలితాలు కూడా బాగుంటాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు చాలా మంచివని అన్నారు. తాను చదువుకున్న పాఠశాల గత కొన్నేళ్లకి, ఇప్పటికీ చాలా మారిందని కొనియాడారు. ఇప్పుడు ఆ స్కూల్లో పిల్లలకు పౌష్ఠికాహారం బాగా అందుతోందని లక్ష్మీ నారాయణ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సుందరంగా ముస్తాబయ్యాయని అన్నారు. 

జగనన్న సురక్ష కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు ఒకరోజు మెడికల్ క్యాంపులు పెడుతుంటాయని, కానీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రోజుల తరబడి క్యాంపులు కొనసాగించడం మంచిగా ఉందని కొనియాడారు. డాక్టర్లు నేరుగా వచ్చి మెడికల్ టెస్టులు చేసి అవసరమైన పరీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూలు పిల్లలకు రాగి జావ అందిస్తుండడం, మద్యాహ్నం భోజనం నాణ్యంగా ఉండేలా చూడటం కూడా అభినందనీయమని అన్నారు. 

సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన పథకాన్ని లక్ష్మీనారాయణ పొగడడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నేళ్ల క్రితం లక్ష్మీ నారాయణ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో వివిధ ఛానెళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా జగన్ వ్యక్తిత్వం, వైఖరి గురించి లక్ష్మీ నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా జగన్‌ను పొగడటంతో ఆయన వైసీపీ నుంచు పోటీ చేయడం ఖాయమనే వార్తలు వెలువడ్డాయి. ఆయన అభిమానులు కూడా ఈ పరిణామంతో విస్తుపోయారు. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget