అన్వేషించండి

వైసీపీ తరఫున పోటీ చేసే ఉద్దేశం లేదు- క్లారిటీ ఇచ్చిన మాజీ ఐపీఎస్‌ లక్ష్మినారాయణ

ఒక కార్యక్రమానికి వెళ్లి అభినందించినంత మాత్రాన ఆ పార్టీలో చేరుతున్నానని ప్రచారం చేయడం సరికాదన్నారు లక్ష్మీనారాయణ.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతున్నారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాము ఏర్పాటు చేసుకుంటున్న పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని ఆహ్వానించడానికే వెళ్లానని చెప్పుకొచ్చారు. ఆ టైంలో అక్కడ ఏర్పాటు చేసిన వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి తనను పిలిచారని వివరించారు. ఆ సమావేశంలో తాను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించనే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. 

ఒక కార్యక్రమానికి వెళ్లి అభినందించినంత మాత్రాన తాను అధికార పార్టీలో చేరుతున్నానని ప్రచారం చేయడం సరికాదన్నారు లక్ష్మీనారాయణ. వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. అలాంటి ఉద్దేశం తనకు లేదని వివరించారు. జరుగుతున్న ప్రచారం, ఊహాగానాల్లో ఏ మాత్రం నిజం లేదని ఖండించారు లక్ష్మీనారాయణ. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే తన పోరుబాటకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. 
 

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణితో కలిసి ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా హాజరైన లక్ష్మీ నారాయణ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని  పొగడుతూ మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. విద్యా, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి కచ్చితంగా ఫలితాలు కూడా బాగుంటాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు చాలా మంచివని అన్నారు. తాను చదువుకున్న పాఠశాల గత కొన్నేళ్లకి, ఇప్పటికీ చాలా మారిందని కొనియాడారు. ఇప్పుడు ఆ స్కూల్లో పిల్లలకు పౌష్ఠికాహారం బాగా అందుతోందని లక్ష్మీ నారాయణ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సుందరంగా ముస్తాబయ్యాయని అన్నారు. 

జగనన్న సురక్ష కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు ఒకరోజు మెడికల్ క్యాంపులు పెడుతుంటాయని, కానీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రోజుల తరబడి క్యాంపులు కొనసాగించడం మంచిగా ఉందని కొనియాడారు. డాక్టర్లు నేరుగా వచ్చి మెడికల్ టెస్టులు చేసి అవసరమైన పరీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూలు పిల్లలకు రాగి జావ అందిస్తుండడం, మద్యాహ్నం భోజనం నాణ్యంగా ఉండేలా చూడటం కూడా అభినందనీయమని అన్నారు. 

సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన పథకాన్ని లక్ష్మీనారాయణ పొగడడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నేళ్ల క్రితం లక్ష్మీ నారాయణ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో వివిధ ఛానెళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా జగన్ వ్యక్తిత్వం, వైఖరి గురించి లక్ష్మీ నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా జగన్‌ను పొగడటంతో ఆయన వైసీపీ నుంచు పోటీ చేయడం ఖాయమనే వార్తలు వెలువడ్డాయి. ఆయన అభిమానులు కూడా ఈ పరిణామంతో విస్తుపోయారు. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
Tamil Nadu Assembly Elections: పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
Telangana Cabinet:తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఐదు రాష్ట్రాల ఎన్నికల బ్రేక్ - మే నెలలోనే రేవంత్ మార్క్ కేబినెట్ సర్జరీ ?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఐదు రాష్ట్రాల ఎన్నికల బ్రేక్ - మే నెలలోనే రేవంత్ మార్క్ కేబినెట్ సర్జరీ ?
Andhra Pradesh Financial Status: అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget