అన్వేషించండి

TDP Support BJP : మునుగోడులో బీజేపీకి టీడీపీ మద్దతు - చంద్రబాబును కలవనున్న రాజగోపాల్ రెడ్డి !

మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీకి టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి.. చంద్రబాబును కలవనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలుచెబుతున్నాయి.


TDP Support BJP :  మునుగోడు ఉపఎన్నికల పోరు హోరాహోరీగా ఉండటంతో  పోటీలోని పక్షాల మద్దతును కూడగట్టుకునేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మునుగోడులో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.  బీజేపీ అబ్యర్థి రాజగోపాల్ రెడ్డి .. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించడంతోనే ఆయనను రాజగోపాల్ రెడ్డి కలుస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  రాజగోపాల్ రెడ్డి చంద్రబాబును కలిసిన తర్వాత బీజేపీకి మద్దతుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

మునుగోడులో పోటీకి దూరంగా టీడీపీ 

మునుగోడులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. వారం రోజుల కిందట తెలంగాణ టీడీపీ నేతలు .. చంద్రబాబును కలిసి మునుగోడులో పోటీ చేయాలన్న విజ్ఞప్తి చేశారు. పలువురు బీసీ నేతలు రెడీగా ఉన్నారన్నారు.  అద సమయంలో టీఆర్ఎస్‌లో టిక్కెట్ దక్కని బూర నర్సయ్య గౌడ్ కూడా పార్టీ తరపున పోటీకి ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని.. అసెంబ్లీ ఎన్నకిల్లా బలపడేందుకు ప్రయత్నిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించాలని భావిస్తున్నారు. 

టీడీపీని బలోపేతం చేయాలనుకుంటున్న చంద్రబాబు

నిజానికి తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు టీడీపీ సిద్ధమయిందని..  ఢిల్లీ నుంచి కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ప్రతిగా ఏపీలో సహకరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ ప్రకారం... ప్రస్తుత పరిణామాలు అనుకూలంగా జరుగుతున్నాయి.  నిజానికి కోమటిరెడ్డి సోదరులు టీడీపీకి వ్యతిరేకం. టీడీపీతో పొత్తు వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెబుతారు. కానీ ఇప్పుడు బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరారు. ఆయన టీడీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్  పెద్దలు కూడా అదే సూచించడంతో ఆయన కూడా చంద్రబాబు మద్దతు అడగాలని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కల్లా టీడీపీని ఎంతో కొంత బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. బ లమైన బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్‌ను టీడీపీలో చేర్చుకున్నారు. ఆయనకు టీ టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. 

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడంతో టీడీపీకి వెసులుబాటు

ఇప్పటి వరకూ తెలంగాణలో టీడీపీని ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేశారు. ఈ కారణంగాఆ పార్టీ ముందుకు సాగడం కష్టమంది. నేతలు పార్టీ వీడిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా  బీఆర్ఎస్‌గా మారిపోయింది. ఈ తరుణంలో టీడీపీ బలపడటానికి అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు.  అందుకే టీడీపీ జోరు పెంచాలనుకుంటోంది. బజేపీతో ముందుకు సాగాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
Andhra Pradesh Local Polls: లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
లోకల్ పోల్సే ఏపీలో కూటమికి అతి పెద్ద సవాల్ - పోటీ వైసీపీతో కాదు.. స్నేహితుల మధ్యే !
BRS Politics: క్లీన్‌చిట్‌తో కవితకు సానుభూతి - కొత్త పార్టీతో సంచలనాలే - బీఆర్ఎస్‌ స్వాగతించలేకపోతోందా?
క్లీన్‌చిట్‌తో కవితకు సానుభూతి - కొత్త పార్టీతో సంచలనాలే - బీఆర్ఎస్‌ స్వాగతించలేకపోతోందా?
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Embed widget