అన్వేషించండి

PM Modi for Bengal: బెంగాల్‌కు ప్ర‌ధాని మోదీ, మ‌రి మ‌ణిపూర్ సంగ‌తేంటి?

PM Modi Tour: ప్ర‌ధాని మోడీ మార్చి 6న బెంగాల్‌కు వెళ్ల‌నున్నారు. గ‌త కొన్నిరోజులుగా రాష్ట్రంలోని సందేశ్‌ఖాలీలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో బాధిత మహిళలను ప‌రామ‌ర్శించనున్నారు.

PM Modi for Bengal: పార్ల‌మెంటు(Parliament) ఎన్నిక‌ల(Elections) నేప‌థ్యంలో ప్రధాని మోదీ వేస్తున్న ప్ర‌తి అడుగు కూడా.. చాలా కీల‌కంగా మారింది. మార్చి 6న ప్ర‌ధాన మంత్రి ప‌శ్చిమ బెంగాల్‌(WestBengal)కు వెళ్ల‌నున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలోని 24 ఉత్త‌ర ప‌ర‌గ‌ణాల(24 North paraganas) జిల్లాలో ఉన్న‌ సందేశ్‌ఖాలీ(Shandeshkhali) గ్రామంలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో బాధిత మహిళలను (Women) ప‌రామ‌ర్శించనున్నారు. వారికి ధైర్యం చెప్ప‌నున్నారు. అనంత‌రం.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మహిళల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో ప్ర‌ధాని మోదీ పాల్గొంటారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ రాష్ట్రానికి పొరుగునే ఉన్న ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లోనూ రిజ‌ర్వేష‌న్ల ర‌గ‌డ కార‌ణంగా.. బాధితులైన మ‌హిళ‌లు ఉన్నారు. ఇది జ‌రిగి 4 మాసాలు కూడా అవుతోంది. అయినా.. ఇక్క‌డి ప‌రిస్థితులు ఇంకా తెరిపిన ప‌డ‌లేదు. అంతేకాదు.. అస‌లు ఇక్క‌డ ప‌ర్య‌టించాల‌న్న‌.. ప్రధాన విప‌క్షం కాంగ్రెస్ డిమాండ్‌ను కూడా కూడా ప్రధాని ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీ తృణ‌మూల్  కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టించేందుకు.. బాధిత మ‌హిళ‌ల‌ను ఓదార్చేందుకు రెడీ కావ‌డం వివాదాల‌కు కేంద్రంగా మారుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. 

సందేశ్ ఖాలీలో ఏం జ‌రిగింది?

సందేశ్ ఖాలీ(Shandeshkali).. అనేది ప‌శ్చిమ బెంగాల్‌లోని 24 ఉత్త‌ర‌ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామం. ఇక్క‌డ పెను వివాదం రాజుకుంది. అధికార పార్టీ తృణ‌మూల్‌కు చెందిన కీల‌క నేత షాజ‌హాన్ షేక్ అనుచ‌రులు.. త‌మ భూముల‌ను బ‌ల‌వంతంగా క‌బ్జా చేశార‌ని, దీనిని ప్ర‌శ్నించిన త‌మ‌పై.. లైంగిక దాడులు చేశార‌ని, ఒక‌రిద్దరిపై అత్యాచారం కూడా చేశార‌ని.. ఇక్క‌డి మ‌హిళ‌లు ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారం.. గ‌త వారం వెలుగు చూసింది. ఈ విష‌యం రాష్ట్రంలో ప్ర‌చారంలోకి రావ‌డంతో ప్ర‌తిప‌క్ష బీజేపీ దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. వెంట‌నే రాష్ట్ర బీజేపీ చీఫ్‌, పార్ల‌మెంటు స‌భ్యుడు సుకాంత మ‌జుందార్‌.. ఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఇటు తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, అటు బీజేపీనేత‌ల‌కు మ‌ధ్య తీవ్ర దుమారం రేగింది. వీరిని అదుపు చేసే క్ర‌మంలో పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేశారు. దీంతో ఎంపీ మ‌జుందార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది మ‌రో వివాదానికి దారి తీసింది. త‌న‌ను పోలీసులు కొట్టారంటూ.. ఎంపీ పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక‌, బాధితుల‌మ‌ని చెబుతున్న మ‌హిళ‌లు.. మీడియా ముందుకు రావ‌డం, వారికి బీజేపీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో వివాదం రాజుకుంది. దీనిపై మ‌హిళా క‌మిష‌న్ కూడా తీవ్రంగా స్పందించి.. ఏకంగా ఇద్ద‌రు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని సందేశ్ ఖ‌లీ గ్రామానికి పంపించింది. అయితే.. వారిని కూడా తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు.ఇలా.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డంతో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందిస్తూ.. ఇదంతా ఉద్దేశ పూర్వ‌కంగా ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ఆడుతున్న నాట‌కంగా పేర్కొన్నారు. మ‌రోవైపు బాధిత మ‌హిళ‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చిన మ‌హిళా క‌మిష‌న్‌.. వారితో కేసులు పెట్టించింది. దీంతో 18 మంది అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై రేప్‌, హ‌త్యాయ‌త్నం కింద పోలీసులు కేసులుపెట్టారు. ఇక‌, రాష్ట్రంలోకి పార్ల‌మెంటు ఎథిక్స్ క‌మిటీ రావ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు ఎక్కింది. దీనిని విచారించిన కోర్టు ఎథిక్స్ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌పై స్టే విధించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇక్క‌డ ప‌ర్య‌టించి బాధిత మ‌హిళ‌ల‌ను ఓదార్చాల‌ని.. నిర్ణ‌యం తీసుకోవ‌డం రాజ‌కీయ దుమారాన్నిమ‌రింత పెంచ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

'మ‌ణిపూర్ మ‌న‌ దేశంలో లేదా?' 

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో  మెజారిటీ మైతేయ్‌ వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశాన్ని వేగంగా పరిశీలించాలని, దీనిపై 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. అక్క‌డి హైకోర్టు ఇచ్చిన తీర్పు హింస‌కు దారితీసింది. మార్చి 27, 2023న ఇచ్చిన తీర్పు.. త‌ర్వాత‌.. మైనారిటీ కుకీలు భగ్గుమన్నారు. హింస చెలరేగింది. ఈ మారణకాండలో దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అంతేకాదు.. కొంద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారాలు కూడా జ‌రిపారు. ఈ వ్య‌వ‌హారం దేశంలో క‌ల‌క‌లం రేపింది. అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య మాట‌ల మంట‌లు రేపింది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ రెండు, మూడుసార్లు ఇక్కడ ప‌ర్య‌టించి.. బాధితుల‌ను క‌లిశారు. ప్ర‌ధాని మోడీ(PM modi) కూడా ఇక్క‌డ‌కు రావాల‌ని.. జ‌రిగిన దారుణాల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంతేకాదు.. మ‌ణిపూర్ మ‌న దేశంలో లేదా? అంటూ.. కాంగ్రెస్ నేత‌లు.. అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ‌ల్లోనూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయినా.. ప్ర‌ధాని ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ణిపూర్‌లో ప‌ర్య‌టించ‌లేదు. 

టాప్ హెడ్ లైన్స్

New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
Almatti Dam Height Dispute 2026: దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
Telangana Cabinet Expansion Postponed 2026: తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget