అన్వేషించండి

PM Modi for Bengal: బెంగాల్‌కు ప్ర‌ధాని మోదీ, మ‌రి మ‌ణిపూర్ సంగ‌తేంటి?

PM Modi Tour: ప్ర‌ధాని మోడీ మార్చి 6న బెంగాల్‌కు వెళ్ల‌నున్నారు. గ‌త కొన్నిరోజులుగా రాష్ట్రంలోని సందేశ్‌ఖాలీలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో బాధిత మహిళలను ప‌రామ‌ర్శించనున్నారు.

PM Modi for Bengal: పార్ల‌మెంటు(Parliament) ఎన్నిక‌ల(Elections) నేప‌థ్యంలో ప్రధాని మోదీ వేస్తున్న ప్ర‌తి అడుగు కూడా.. చాలా కీల‌కంగా మారింది. మార్చి 6న ప్ర‌ధాన మంత్రి ప‌శ్చిమ బెంగాల్‌(WestBengal)కు వెళ్ల‌నున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలోని 24 ఉత్త‌ర ప‌ర‌గ‌ణాల(24 North paraganas) జిల్లాలో ఉన్న‌ సందేశ్‌ఖాలీ(Shandeshkhali) గ్రామంలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో బాధిత మహిళలను (Women) ప‌రామ‌ర్శించనున్నారు. వారికి ధైర్యం చెప్ప‌నున్నారు. అనంత‌రం.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మహిళల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో ప్ర‌ధాని మోదీ పాల్గొంటారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ రాష్ట్రానికి పొరుగునే ఉన్న ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లోనూ రిజ‌ర్వేష‌న్ల ర‌గ‌డ కార‌ణంగా.. బాధితులైన మ‌హిళ‌లు ఉన్నారు. ఇది జ‌రిగి 4 మాసాలు కూడా అవుతోంది. అయినా.. ఇక్క‌డి ప‌రిస్థితులు ఇంకా తెరిపిన ప‌డ‌లేదు. అంతేకాదు.. అస‌లు ఇక్క‌డ ప‌ర్య‌టించాల‌న్న‌.. ప్రధాన విప‌క్షం కాంగ్రెస్ డిమాండ్‌ను కూడా కూడా ప్రధాని ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీ తృణ‌మూల్  కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టించేందుకు.. బాధిత మ‌హిళ‌ల‌ను ఓదార్చేందుకు రెడీ కావ‌డం వివాదాల‌కు కేంద్రంగా మారుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. 

సందేశ్ ఖాలీలో ఏం జ‌రిగింది?

సందేశ్ ఖాలీ(Shandeshkali).. అనేది ప‌శ్చిమ బెంగాల్‌లోని 24 ఉత్త‌ర‌ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామం. ఇక్క‌డ పెను వివాదం రాజుకుంది. అధికార పార్టీ తృణ‌మూల్‌కు చెందిన కీల‌క నేత షాజ‌హాన్ షేక్ అనుచ‌రులు.. త‌మ భూముల‌ను బ‌ల‌వంతంగా క‌బ్జా చేశార‌ని, దీనిని ప్ర‌శ్నించిన త‌మ‌పై.. లైంగిక దాడులు చేశార‌ని, ఒక‌రిద్దరిపై అత్యాచారం కూడా చేశార‌ని.. ఇక్క‌డి మ‌హిళ‌లు ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారం.. గ‌త వారం వెలుగు చూసింది. ఈ విష‌యం రాష్ట్రంలో ప్ర‌చారంలోకి రావ‌డంతో ప్ర‌తిప‌క్ష బీజేపీ దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. వెంట‌నే రాష్ట్ర బీజేపీ చీఫ్‌, పార్ల‌మెంటు స‌భ్యుడు సుకాంత మ‌జుందార్‌.. ఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఇటు తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, అటు బీజేపీనేత‌ల‌కు మ‌ధ్య తీవ్ర దుమారం రేగింది. వీరిని అదుపు చేసే క్ర‌మంలో పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేశారు. దీంతో ఎంపీ మ‌జుందార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది మ‌రో వివాదానికి దారి తీసింది. త‌న‌ను పోలీసులు కొట్టారంటూ.. ఎంపీ పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక‌, బాధితుల‌మ‌ని చెబుతున్న మ‌హిళ‌లు.. మీడియా ముందుకు రావ‌డం, వారికి బీజేపీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో వివాదం రాజుకుంది. దీనిపై మ‌హిళా క‌మిష‌న్ కూడా తీవ్రంగా స్పందించి.. ఏకంగా ఇద్ద‌రు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని సందేశ్ ఖ‌లీ గ్రామానికి పంపించింది. అయితే.. వారిని కూడా తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు.ఇలా.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డంతో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందిస్తూ.. ఇదంతా ఉద్దేశ పూర్వ‌కంగా ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ఆడుతున్న నాట‌కంగా పేర్కొన్నారు. మ‌రోవైపు బాధిత మ‌హిళ‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చిన మ‌హిళా క‌మిష‌న్‌.. వారితో కేసులు పెట్టించింది. దీంతో 18 మంది అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై రేప్‌, హ‌త్యాయ‌త్నం కింద పోలీసులు కేసులుపెట్టారు. ఇక‌, రాష్ట్రంలోకి పార్ల‌మెంటు ఎథిక్స్ క‌మిటీ రావ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు ఎక్కింది. దీనిని విచారించిన కోర్టు ఎథిక్స్ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌పై స్టే విధించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇక్క‌డ ప‌ర్య‌టించి బాధిత మ‌హిళ‌ల‌ను ఓదార్చాల‌ని.. నిర్ణ‌యం తీసుకోవ‌డం రాజ‌కీయ దుమారాన్నిమ‌రింత పెంచ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

'మ‌ణిపూర్ మ‌న‌ దేశంలో లేదా?' 

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో  మెజారిటీ మైతేయ్‌ వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశాన్ని వేగంగా పరిశీలించాలని, దీనిపై 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. అక్క‌డి హైకోర్టు ఇచ్చిన తీర్పు హింస‌కు దారితీసింది. మార్చి 27, 2023న ఇచ్చిన తీర్పు.. త‌ర్వాత‌.. మైనారిటీ కుకీలు భగ్గుమన్నారు. హింస చెలరేగింది. ఈ మారణకాండలో దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అంతేకాదు.. కొంద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారాలు కూడా జ‌రిపారు. ఈ వ్య‌వ‌హారం దేశంలో క‌ల‌క‌లం రేపింది. అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య మాట‌ల మంట‌లు రేపింది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ రెండు, మూడుసార్లు ఇక్కడ ప‌ర్య‌టించి.. బాధితుల‌ను క‌లిశారు. ప్ర‌ధాని మోడీ(PM modi) కూడా ఇక్క‌డ‌కు రావాల‌ని.. జ‌రిగిన దారుణాల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంతేకాదు.. మ‌ణిపూర్ మ‌న దేశంలో లేదా? అంటూ.. కాంగ్రెస్ నేత‌లు.. అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ‌ల్లోనూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయినా.. ప్ర‌ధాని ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ణిపూర్‌లో ప‌ర్య‌టించ‌లేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Religious politics: ఏపీల్లో హిందూ కార్డుతో కూటమి వ్యూహం - కత్తిమీద సాములా జగన్ రాజకీయం !
ఏపీల్లో హిందూ కార్డుతో కూటమి వ్యూహం - కత్తిమీద సాములా జగన్ రాజకీయం !
Telangana Budget: పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి నగదు బదిలీ - బడ్జెట్ లెక్కల్లో కాంగ్రెస్‌ సర్కార్‌కు ఇవే పెద్ద సమస్యలు - పరిష్కరించగలరా?
పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి నగదు బదిలీ - బడ్జెట్ లెక్కల్లో కాంగ్రెస్‌ సర్కార్‌కు ఇవే పెద్ద సమస్యలు - పరిష్కరించగలరా?
Tamil Nadu Assembly Elections 2026: డీఎంకేకు కలసి వస్తున్న అన్నాడీఎంకే రాజకీయాలు - శశికళ, పన్నీర్ సెల్వం కూడా స్టాలిన్ గెలుపు కోసమే !
డీఎంకేకు కలసి వస్తున్న అన్నాడీఎంకే రాజకీయాలు - శశికళ, పన్నీర్ సెల్వం కూడా స్టాలిన్ గెలుపు కోసమే !
BRS Strategy: గులాబీ దళం రీలోడెడ్ -కేసీఆర్ నిశ్శబ్ద ఆపరేషన్.. బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా కొత్త వ్యూహం
గులాబీ దళం రీలోడెడ్ -కేసీఆర్ నిశ్శబ్ద ఆపరేషన్.. బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా కొత్త వ్యూహం

వీడియోలు

Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ideas of India Summit 2026: పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
Ind vs Zim Highlights : జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
Raakaasaa Teaser: 'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
Rashmika Wedding Photos: పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
India Israel FTA: ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
Embed widget