అన్వేషించండి

Andhra Pradesh : కూటమి పార్టీల్లో నామినేటెడ్ పోస్టుల పంచాయతీ - పదవుల పంపకం అంత తేలిక కాదా ?

Andhra Politics : టీడీపీ బీజేపీ జనసేన మధ్య నామినేటెడ్ పోస్టుల పంచాయతీ ప్రారంభమయింది. అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో ఎవరికి ఏ పోస్టు అన్నదానిపై చర్చలు తేలడం లేదని తెలుస్తోంది.

Nominated posts War between TDP BJP JanaSena  :  ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు తమ విజయం కోసం కృషి చేసిన క్యాడర్ కు పదవులు ఇచ్చేందుకు కసరత్తులు ప్రారంభించాయి.  రెండు నెలల్లోగా విడతల వారీగా పోస్టులను క్యాడర్ కు ఇచ్చేయాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయి.  గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నానినేటెడ్ పోస్టుల భర్తీని విడతల వారీగా చేపట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, పురందేశ్వరి  ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు.  ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తల సమాచార సేకరణ దాదాపుగా పూర్తి చేశారు. 

టిక్కెట్లు దక్కని నేతలకు ప్రాధాన్యత                   

కూటమలో భాగంగా మూడు పార్టీల్లోని కీలక నేతలు పోటీ చేయలేకపోయారు. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.    ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని.. నామినేటెడ్ పోస్టుల్లో కచ్చితంగా ప్రయార్టీ లభిస్తుందని జనసేన నేతలు ఆశ పడుతున్నారు.  తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ  అంచనాలో ఉంది.   కూటమి పార్టీలకు నామినేటెడ్‌ పోస్టుల పంపిణీకి ఫార్ములాను రూపొందించారు.  టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 30 శాతం జనసేన, 10 శాతం బిజెపి కార్యకర్తలకు, బిజెపి ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో టిడిపికి 50 శాతం, బిజెపి, జన సేనలకు 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నరు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న  చోట్ల అరవై శాతం టీడీపీకి , ముఫ్పై శాతం జనసేనకు, పది శాతం బీజేపీకి ఇవ్వాలనుకుంటున్నారు. 

హరీశ్‌రావు వెనుక తొంగి తొంగి చూస్తున్న రేవంత్, 20 ఏళ్ల నాటి వీడియోతో కౌంటర్

ఆశావహుల్ని సంతృప్తి పరచడం అంత తేలిక కాదు         

 మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ, జనసేన పార్టీల్లో చాలా మందే ఉన్నారు. వీరిలో పలువురు నామినేట్ పోస్టుల కోసం పోటీపడుతున్నారు.  వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులతో పాటు  వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.  2014-19 టిడిపి అధికారంలో ఉన్న సమయంలో బిజెపికి, జనసేనకు ఎలాంటి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. టిడిపిలో నామినేటెడ్‌ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావహులు భారీగానే ఉన్నారు.

ఎస్సీ వర్గీకరణ క్రెడిట్ చంద్రబాబుదే - మంద కృష్ణ ప్రశంసలు - ఏపీ సీఎం స్పందన ఏమిటంటే

విజయం కోసం పని చేసిన వారికే !         

పార్టీ విజయం కోసం పని చేసిన వారికే మాత్రమే పదవులు ఇస్తారు.  త్యాగం చేసిన మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు కూడా నామినేటెడ్‌ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టిడిపి కార్యాలయంలో ఆశావహులు దరఖాస్తులు ఇచ్చారు.   ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా అంతర్గతంగా ర్యాంకులు  ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని  నిర్ణయించారు.  ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్క్రూటినీ చేస్తారని టిడిపి నాయకులు చెబుతున్నారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. 

మొత్తంగా కూటమి ప్రభుత్వంలో  నామినేటెడ్ పదవుల పంపకం అంత తేలికగా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వివాదం రాకుండా చూసుకోవాలని మూడు పార్టీల నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్
ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget