అన్వేషించండి

Andhra Cricket Association : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో పట్టు కోల్పోయిన వైసీపీ - టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి అధ్యక్షుడు అవుతారా ?

Vizag : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో కొత్త కార్యవర్గం ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ వైసీపీ పెద్దల గుప్పిట్లో ఏపీఏ ఉంది. ఇక నుంచి టీడీపీ నేతల పెత్తనం ఉండే అవకాశం ఉంది.

New Executive Committee in Andhra Cricket Association : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం రాజీనామాలు సమర్పించింది. ప్రస్తుతం  ఏసీఏ అధ్యక్షులుగా అరబిందో గ్రూప్‌నకు చెందిన పి శరత్‌ చంద్రారెడ్డి ఉన్నారు. ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటి నిందితునిగా ఉన్నారు. తర్వాత అప్రూవర్ గా మారారు.  ఉపాధ్యక్షులు ఆయన సోదరుడు పి రోహిత్‌రెడ్డి ఉన్నారు. రోహిత్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు. ఇక ఏసీే  కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి, సహాయ కార్యదర్శి రాకేష్, కోశాధికారి ఎవి చలం, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు పురుషోత్తంలు ఉన్నారు. వీరంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లో పని చేస్తారని చెబుతూంటారు. ఇప్పుడు వీరంతా రాజీనామా చేశారు. క్రికెట్‌ అసోసియేన్‌లో మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నకల్లో గెలిచిన వారు మూడేళ్లు అసోసియేషన్‌ పాలకవర్గంగా ఉంటారు. ప్రస్తుత పాలక వర్గానికి ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది. అయినా వీరంతా రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు.కొత్త కార్యవర్గం ఎంపిక ప్రక్రియను  ప్రారంభించారు.   

క్రికెట్‌లో చొరబడిన రాజకీయాలు

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రభుత్వానికి సంబంధం లేదు. బీసీసీఐ నియంత్రణలో ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి ఒక్క రూపాయి నిధులు. ప్రభుత్వ కార్యక్రమాలేవీ ఏసీఏ చేపట్టదు. ఏసీఏ కిందట రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అసోసియేషన్‌లు, 31 పట్టణాల్లో క్రికెట్‌ క్లబ్సులు ఉన్నాయి. వీరిలో అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు, క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు, మరికొందరు సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఇంటర్నేషనల్‌ ప్లేయర్లకు ఓట్లు ఉంటాయి. గతంలో గోకరాజు గంగరాజు వంటి పారిశ్రామికవేత్తలు, చాముండేశ్వరి నాథ్ వంటి మాజీ క్రికెటర్లు ఏసీఏను నడిపించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. పాత వాళ్లు పట్టించకోవడం మానేశారు. 

నిర్మాణాత్మక చర్చలతో ప్రజాస్వామ్య కళ - తెలంగాణ అసెంబ్లీ మారిపోయిందా ?

గత ఐదేళ్ల కాలంలో పలు వివాదాలు

ఏసీఏలో గత ఐదేళ్లలో అనేక వివాదాల ువచ్చాయి. ముఖ్యంగా  హనుమ విహారి ఉదంతంతో పెద్ద రచ్చ జరిగింది.  హనుమ విహారి కెప్టెన్సీలో ఆంధ్ర జట్టు మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో 17 నంబర్ ఆటగాడిగా ఉన్న ఓ వైసీపీ నేత కుమారుడ్ని దూషించారని ఆయన కెప్టెన్సీని తీసేశారు. బయట రాష్ట్రాల్లో ఆడకుండా ఎన్వోసీ కూడా ఇవ్వలేదు. దీనిపై రచ్చ  జరగడంతో చివరికి  ఎన్నికల  ఫలితాలు వచ్చిన రోజున వైసీపీ ఓడిపోవడంతో ఆఘమేఘాల మీద ఎన్వోసీ ఇచ్చారు. తర్వాత విహారి .. అమరావతిలో లోకేష్, పవన్ కల్యాణ్‌లను కలిశారు. వారు మళ్లీ ఏపీ టీముకే ఆడాలని కోరారు. దానికి విహారీ అంగీకరించారు.  ఏసీఏను రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆర్థిక పరమైన అవకతవకలకు  పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి మధ్య కార్యకవర్గం రాజీనామా చేసింది. 

ఏపీలో ఎక్సైజ్ పాలసీలో సమగ్ర మార్పులు ఖాయమా ? మళ్లీ దుకాణాల వేలం పాట ఉండబోతోందా ?

కొత్త ఏసీఏ చీఫ్ ఎవరు ?

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాల్లో పరోక్షంగా కీలకంగా వ్యవహరిస్తున్నట్లగా చెబుతున్నారు.  పలువురు ఆశావహులు ఎవరి స్థాయిలో వారు ఏసీఏ పీఠం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అల్లుడితో పాటు, తూర్పు గోదావరికి చెందిన ఓ నాయకుడు కూడా ఏసీఏ పీఠంపై కూర్చోవాలని బలంగా పావులు కదుపుతున్నారు.  మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్‌ రెడ్డిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ రెడ్డి ధోనీకి అదే సమయంలో విరాట్ కోహ్లీతో పాటు ధోనీతోనూ మంచి సంబంధాలున్నాయి.  ఇటీవలి ఎన్నికల్లో జేసీ పవన్ రెడ్డి పోటీ చేయలేదు. అందుకే ఆయన ఏసీఏ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ క్రికెటర్లనే ఎంచుకోవాలనుకుంటే.. ఎమ్మెస్కే ప్రసాద్ పేరును పరిసీశిలించే అవకాశం ఉంది. ఎవరికి ఏసీఏ చీఫ్ గా అవకాశం లభిస్తుందన్నదానిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget