అన్వేషించండి

Jagan Ministers : జగన్‌పై తీవ్ర ఒత్తిడి - మెజార్టీ పాత మంత్రులకే మళ్లీ చాన్స్ !?

రాజీనామా చేసిన మంత్రుల్లో కొనసాగించే వారి సంఖ్య అంతకంతకూపెరుగుతోంది. మొదట ఒకరిద్దరు అని ప్రచారం జరిగినా ఇప్పుడది పది, పన్నెండు మందికి చేరుకుంది. సీనియర్ల అసంతృప్తి సమాచారమే దీనికి కారణం.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై చర్చ జోరుగా సాగుతోంది. మంత్రులంతా రాజీనామాలు చేశారు. ఆ పత్రాలు సీఎం జగన్ తీసుకున్నారు. కొత్త మంత్రులను ఖరారు చేసుకునే విషయంలో సీఎం జగన్‌పై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటగా మంత్రులందర్నీ తీసేసి కొత్త వారిని తీసుకోవాలనుకున్నారు. అది సాధ్యం కాదని భావించి... కొంత మందిని ఉంచి మిగతా వారిని మారుస్తామని చెప్పారు. చివరికి ఇద్దరు, ముగ్గుర్ని మాత్రమే ఉంచాలని అనుకున్నారు. అది మంత్రివర్గ సమావేశం పూర్తయ్యే సరికి ఐదారుగురు అయింది. 
ఇప్పది పది నుంచి పన్నెండు మంది మంత్రుల్ని కొనసాగిస్తారని.. కొత్త వారు పది నుంచి పధ్నాలుగు మంది మాత్రమే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. 

మంత్రి పదవుల్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు !

మంత్రి పదవుల్ని కాపాడుకునేందుకు రాజీనామా లేఖలు ఇచ్చిన ప్రస్తుత మంత్రులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వీరు వివిధ పద్దతుల్లో తమ పదవి కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అలా రాజీనామాలు ఇచ్చిన వెంటనే ఇలా తన చాంబర్‌లో బొత్స సత్యనారాయణ నలుగురు మంత్రులతో సమావేశం కావడం కలకలం రేపింది. ఇతర మంత్రులు ముభావంగా వెళ్లిపోయారు. వీరి అసంతృప్తి కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉండటంతో సీఎం జగన్ కొత్త మంత్రుల విషయంలో మరోసారి కసరత్తు చేస్తున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. 

జగన్‌తో సజ్జల చర్చలు

ప్రభుత్వంతో పాటు పార్టీ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించి సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం  జగన్ ను కలిశారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీనియర్లను.. అత్యంత విధేయత ప్రదర్శించిన వారిని కంటిన్యూ చేయాలని... అందర్నీ కొత్త వారిని తీసుకుంటే కుదురుకోకుంటే మొదటికే మోసం- వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి సీఎం జగన్ మనసు విశాలం చేసుకున్నారని పది నుంచి పన్నెండు మంది మంత్రులను కొనసాగించవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. ఈ లోపు ఈ కౌంట్ ఎంత పెరుగుతుందో చెప్పడం కష్టమని.. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నార. జగన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.  

కొత్త మంత్రుల ప్రమాణానికి అసెంబ్లీ పార్కింగ్ ప్లేస్‌లో ఏర్పాట్లు 

 కొత్త మంత్రుల ప్రమాణస్వీకార వేదికపై అధికారులు ఓ క్లారిటీకి వచ్చారు. సచివాలయంలోని అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు.  ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు ఫోటో దిగడానికి కూడా ఏర్పాట్లు చేయనున్నారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Embed widget