By: ABP Desam | Updated at : 08 Apr 2022 07:46 PM (IST)
మంత్రిపదవుల కోసం జగన్పై ఒత్తిడి
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై చర్చ జోరుగా సాగుతోంది. మంత్రులంతా రాజీనామాలు చేశారు. ఆ పత్రాలు సీఎం జగన్ తీసుకున్నారు. కొత్త మంత్రులను ఖరారు చేసుకునే విషయంలో సీఎం జగన్పై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటగా మంత్రులందర్నీ తీసేసి కొత్త వారిని తీసుకోవాలనుకున్నారు. అది సాధ్యం కాదని భావించి... కొంత మందిని ఉంచి మిగతా వారిని మారుస్తామని చెప్పారు. చివరికి ఇద్దరు, ముగ్గుర్ని మాత్రమే ఉంచాలని అనుకున్నారు. అది మంత్రివర్గ సమావేశం పూర్తయ్యే సరికి ఐదారుగురు అయింది.
ఇప్పది పది నుంచి పన్నెండు మంది మంత్రుల్ని కొనసాగిస్తారని.. కొత్త వారు పది నుంచి పధ్నాలుగు మంది మాత్రమే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
మంత్రి పదవుల్ని కాపాడుకునేందుకు రాజీనామా లేఖలు ఇచ్చిన ప్రస్తుత మంత్రులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వీరు వివిధ పద్దతుల్లో తమ పదవి కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అలా రాజీనామాలు ఇచ్చిన వెంటనే ఇలా తన చాంబర్లో బొత్స సత్యనారాయణ నలుగురు మంత్రులతో సమావేశం కావడం కలకలం రేపింది. ఇతర మంత్రులు ముభావంగా వెళ్లిపోయారు. వీరి అసంతృప్తి కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉండటంతో సీఎం జగన్ కొత్త మంత్రుల విషయంలో మరోసారి కసరత్తు చేస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వంతో పాటు పార్టీ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ను కలిశారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీనియర్లను.. అత్యంత విధేయత ప్రదర్శించిన వారిని కంటిన్యూ చేయాలని... అందర్నీ కొత్త వారిని తీసుకుంటే కుదురుకోకుంటే మొదటికే మోసం- వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి సీఎం జగన్ మనసు విశాలం చేసుకున్నారని పది నుంచి పన్నెండు మంది మంత్రులను కొనసాగించవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. ఈ లోపు ఈ కౌంట్ ఎంత పెరుగుతుందో చెప్పడం కష్టమని.. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నార. జగన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
కొత్త మంత్రుల ప్రమాణస్వీకార వేదికపై అధికారులు ఓ క్లారిటీకి వచ్చారు. సచివాలయంలోని అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు ఫోటో దిగడానికి కూడా ఏర్పాట్లు చేయనున్నారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? అంచనాలు ఆయన అందుకుంటారా?
Telangana Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ప్రమాణం
Kaleswaram What Next : కాళేశ్వరం అవినీతిపై విచారణ సరే ప్రాజెక్ట్ భవితవ్యం ఏమిటి ? సీఎం నిర్ణయం ఎలా ఉంటుంది ?
Free Bus Travel: నేటి నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం- మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
Who is Lucky Ministers : శాఖల పంపకం - మిగిలిన పదవుల భర్తీ ! రేవంత్కు మొదటి టాస్క్
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
KTR Comments O Praja Darbar: ప్రజా దర్బార్ పై కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్
Sonia Gandhi Birthday Celebrations: 'తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ' - ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana Assembly meeting: 'ఒప్పందం ప్రకారమే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్' - దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ, అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ
/body>