అన్వేషించండి

KTR: '4 నెలల్లోనే ఈ దుస్థితి ఊహించలేదు' - సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Telangana News: ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎర్రటి ఎండల్లో ప్రజల్లో తిరిగితే.. సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

KTR Comments on CM Revanth Reddy:  తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఈ దుస్థితి ఊహించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సిరిసిల్ల (Siricilla) పట్టణంలోని తెలంగాణ భవన్ లో రైతు దీక్షలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లోకి తిరిగితే.. సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ఆవేదన చెందుతున్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని అడిగితే ఎన్నికల కోడ్ ఉందని అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలి. మేము కూడా ఉత్తరం రాస్తాం. కరువు వస్తే మమ్మల్ని తిడుతారా.? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. మేడిగడ్డలో పిల్లర్లు కుంగితే రిపేర్ చేయకుండా కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

'రైతుబంధు డబ్బులు ఎక్కడ.?'

'అప్పుడు వర్షాలు పడి పంటలు మునిగిపోయాయని మంత్రి శ్రీధర్ బాబు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వర్షాలు పడలేదని అంటున్నారు. ఎన్నికల ముందు రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు సిద్ధంగా పెట్టాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ డబ్బులు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఆపింది. ఇప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలి. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావరిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 300 పిల్లర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు.' అంటూ మండిపడ్డారు.

'ఆ హామీలు నెరవేర్చాలి'

'డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదు. ఎన్నికల్లో ఓడిపోయామని రైతుల తరఫున కొట్లాడకుండా ఆగుతామా?. వారికి అండగా నిలబడేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సిద్ధంగా ఉండాలి. రైతు భరోసా, రూ.4 వేల పెన్షన్, రూ.2 లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్లు కాంగ్రెస్ కు ఓటెయ్యండి. రాని వాళ్లు మాకు ఓటెయ్యండి. హామీలను నెరవేర్చకుంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారన్న భయం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కొరత ఉంది. మిషన్  భగీరథ నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. హామీలపై సర్కారును నిలదీద్దాం. 420 కాంగ్రెస్ హామీలను ప్రతి ఒక్కరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.  30 వేల ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. మీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. నేతన్నల కోసం టీఆర్ఎస్ పార్టీ దీక్షలు చేస్తోంది. ప్రభుత్వం నేతన్నలను ఆదుకునే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.' అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read: Harish Rao: 'కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే వారికి నిద్ర పట్టడం లేదు' - మంత్రుల వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Manifestos of Tamil parties: ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?
ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Aryaman Birla : రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Embed widget