అన్వేషించండి

KTR: '4 నెలల్లోనే ఈ దుస్థితి ఊహించలేదు' - సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Telangana News: ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎర్రటి ఎండల్లో ప్రజల్లో తిరిగితే.. సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

KTR Comments on CM Revanth Reddy:  తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఈ దుస్థితి ఊహించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సిరిసిల్ల (Siricilla) పట్టణంలోని తెలంగాణ భవన్ లో రైతు దీక్షలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రటి ఎండలో ప్రజల్లోకి తిరిగితే.. సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ఆవేదన చెందుతున్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని అడిగితే ఎన్నికల కోడ్ ఉందని అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలి. మేము కూడా ఉత్తరం రాస్తాం. కరువు వస్తే మమ్మల్ని తిడుతారా.? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. మేడిగడ్డలో పిల్లర్లు కుంగితే రిపేర్ చేయకుండా కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

'రైతుబంధు డబ్బులు ఎక్కడ.?'

'అప్పుడు వర్షాలు పడి పంటలు మునిగిపోయాయని మంత్రి శ్రీధర్ బాబు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వర్షాలు పడలేదని అంటున్నారు. ఎన్నికల ముందు రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు సిద్ధంగా పెట్టాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ డబ్బులు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఆపింది. ఇప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలి. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావరిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 300 పిల్లర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు.' అంటూ మండిపడ్డారు.

'ఆ హామీలు నెరవేర్చాలి'

'డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదు. ఎన్నికల్లో ఓడిపోయామని రైతుల తరఫున కొట్లాడకుండా ఆగుతామా?. వారికి అండగా నిలబడేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సిద్ధంగా ఉండాలి. రైతు భరోసా, రూ.4 వేల పెన్షన్, రూ.2 లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్లు కాంగ్రెస్ కు ఓటెయ్యండి. రాని వాళ్లు మాకు ఓటెయ్యండి. హామీలను నెరవేర్చకుంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారన్న భయం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కొరత ఉంది. మిషన్  భగీరథ నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. హామీలపై సర్కారును నిలదీద్దాం. 420 కాంగ్రెస్ హామీలను ప్రతి ఒక్కరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.  30 వేల ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. మీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. నేతన్నల కోసం టీఆర్ఎస్ పార్టీ దీక్షలు చేస్తోంది. ప్రభుత్వం నేతన్నలను ఆదుకునే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.' అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read: Harish Rao: 'కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే వారికి నిద్ర పట్టడం లేదు' - మంత్రుల వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GHMC Meeting: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం, బడ్జెట్ పేపర్లు చింపి మేయర్ పై విసిరేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
GHMC Meeting: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం, బడ్జెట్ పేపర్లు చింపి మేయర్ పై విసిరేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
Airplane Crash: గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - అందులో 64 మంది ప్రయాణికులు!
గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - అందులో 64 మంది ప్రయాణికులు!
Pothugadda Review - 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP DesamMaha Kumbh 2025 Prayag Raj Drone VisualsMaha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Meeting: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం, బడ్జెట్ పేపర్లు చింపి మేయర్ పై విసిరేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
GHMC Meeting: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం, బడ్జెట్ పేపర్లు చింపి మేయర్ పై విసిరేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
Airplane Crash: గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - అందులో 64 మంది ప్రయాణికులు!
గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - అందులో 64 మంది ప్రయాణికులు!
Pothugadda Review - 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
No Income Tax: ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్ - ఈ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్‌
ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్ - ఈ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్‌
Deepseek: మీ వ్యక్తిగత వివరాలు చైనాకు చేరవేత? డీప్‌సీక్‌ వాడుతున్న వాళ్లు జర భద్రం!
చైనా వాళ్లు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లాగేస్తున్నారా...? Deepseek తో అంత డేంజరా...?
Crime News: ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం, బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి
Crime News: ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం, బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి
Vijay Deverakonda: నేనూ తెలంగాణ వాడినే... 'కోల్డ్ ప్లే' ర్యాపర్ క్రిస్ మార్టిన్ కామెంట్స్‌కు విజయ్ దేవరకొండ రిక్వెస్ట్, ఏమిటో తెల్సా?
నేనూ తెలంగాణ వాడినే... 'కోల్డ్ ప్లే' ర్యాపర్ క్రిస్ మార్టిన్ కామెంట్స్‌కు విజయ్ దేవరకొండ రిక్వెస్ట్, ఏమిటో తెల్సా?
Embed widget