అన్వేషించండి

BRS Bform : ఇంకా పెండింగ్‌లో పది మందికిపైగా బీఫామ్స్ - వారిపై కేసీఆర్ పునరాలోచన చేస్తున్నారా ?

బీ ఫామ్స్ పెండింగ్ లో ఉన్న వారిపై కేసీఆర్ పునరాలోచన చేస్తున్నారా? ఆలంపూర్ అభ్యర్థికి షాక్ తప్పదా ?


BRS Bform : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఒకే సారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే వారికి  బీఫామ్స్ కూడా పంపిణీ చేశారు.్ మూడు రోజులుగా పంపిణీ జరుగుతోంది. అయితే అయితే ఇప్పటి వరకూ 105 మందికి మాత్రమే బీఫామ్స్ పంపిణీ చేసినట్లుగా  బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ పది మందికిపైగా బీఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు.  ఈ నెల 15న 69 మందికి, ఆ మరుసటి రోజు 28 మందికి కేసీఆర్​బీఫాంలు ఇచ్చారు.  పెండింగ్‌లో ఉన్న వాటిలో ఇందులో ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించని నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలు కూడా ఉన్నాయి. వీరిలో కొంత మందికి మార్పు తప్పదన్న వాదన వినిపిస్తోంది. 

ఆలంపూర్ అబ్రహం మార్పు ఖాయం

జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వంపై గులాబీ బాస్ నిర్ణయం మార్చుకున్నారని చెబుతున్నారు.  అభ్యర్థిగా అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ  ఇప్పటికీ  బీఫామ్ ఇవ్వలేదు. అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపే యోచనలో అధిష్టానం ఉంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నిశితంగా పరిశీలన చేసి మరో నేతను బరిలోకి దింపాలని రిపోర్టు ఇచ్చారని అంటున్నారు.  స్థానిక నేత విజయుడి పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా స్వయంగా కేసీఆరే ప్రకటించబోతున్నారని తెలిసింది. దీంతో బీఫామ్‌లు దక్కని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. బీఫామ్‌ చేతికొచ్చేవరకూ తాను అభ్యర్థిని, పోటీచేస్తున్నాననే విషయం మరిచిపోవాలని తమ అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో నేతలు చెబుతున్న పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో నెలకొంది.

ఆలస్యమైనా తమకే టిక్కెట్ ఇస్తారని నేతల భావన

కేసీఆర్ అందరికీ ఒకే సారి కాకుండా విడతల వారీగా ఇస్తున్నారు. స్టేషన్ ఘన్  పూర్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించినా మూడు రోజుల పాటు బీఫాం ఇవ్వలేదు. గురువారం ప్రగతి భ వన్ లో కడియం శ్రీహరికి బీఫాం ఇచ్చారు. అక్కడ తానే అభ్యర్థిగా ఉంటానంటూ రాజయ్య చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి కొన్ని  నియోజకవర్గాల్లో బీఫాం కేసీఆర్ ఇవ్వలేదంటున్నారు. అయితే ఖచ్చితంగా అభ్యర్థిని మారుస్తారు అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పడం లేదు . ఒక్క ఆలంపూర్ అబ్రహం పేరును మాత్రం మారుస్తారని అంటున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని.. కొంత మంది ఆశావహులు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కొత్తగా చేరే వారికి ఇతర పదవులు ఆఫర్ ఇస్తారు కానీ టిక్కెట్ ఇచ్చే చాన్సే లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

పెండింగ్ స్థానాలపై సుదీర్ఘ కసరత్తు 

పెండింగ్ పెట్టిన  నియోజకవర్గాల్లో  నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి  స్థానాలపై కేసీఆర్ ఇంకా నిర్ణయం తీుకోలేదు. గోషామహల్, నాంపల్లి..మజ్లిస్ చాయిస్ .  నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి  మజ్లిస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అక్కడ హిందూ  అభ్యర్థిని.. మజ్లిస్ చాయిస్ మీదనే నిలబెట్టే అవకాశం ఉంది. గోషామహల్ బీఆర్ఎస్ తరపున ఎవర్ని నిలబెట్టినా పూర్తి బాధ్యత మజ్లిస్ తీసుకునే అవకాశం ఉంది.  పెండింగ్ పెట్టిన జనగామకు పల్లాను అభ్యర్థిగా ఖరారు చేసి బీఫాం కూడా ఇచ్చారు. ఇక నర్సాపూర్ ఒక్కటే  పెండింగ్ లో ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తానే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు.  కాస్త ఆలస్యమైనా ఆమెకే ప్రకటిస్తారంటున్నారు. మదన్ రెడ్డిని బుజ్జగించేప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆయన తాను  పోటీలో ఉంటానటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
Tamil Nadu Assembly Elections 2026: విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget