అన్వేషించండి

AP government vs Employees : మళ్లీ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం - ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీ రిస్క్ తీసుకుంటోందా ?

ఏపీలో మళ్లీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులుప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉద్యోగులుఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వంఎన్నికలకు ముందు అధికార పార్టీ రిస్క్ తీసుకుంటోందా ?

 

AP government vs Employees :   ఆంధ్రప్రదేశ్‌లో  ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అనే వాతావరణం మళ్లీ ఏర్పడుతోంది.  ఉద్యోగ  సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు,కేఆర్ సూర్యనారాయణ సీఎస్‌కు తమ  ఉద్యమ షెడ్యూల్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మమూలుగా కదిలేది కాదని.. ఈ సారి సమ్మెకు అయినా వెళ్తాం కానీ డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని అంటున్నారు. గతంలో పీఆర్సీ ఉద్యమ సమయంలో సమ్మె వరకూ వెళ్లారు. కానీపెద్దగా ఏమీ సాధించకుండానే ఉద్యమం విరమించారు. అయితే  అప్పటి  హామీలు ఇంకా నెరవేరలేదని పైగా ఇంకా మోసం చేస్తున్నారని..  ఉద్యోగులు అంటున్నారు. ఒక్క డీఏ ఇవ్వడంలేదని..  జీపీఎఫ్ సొమ్ములు సహా తాము దాచుకున్నవేవీ ఇవ్వడం లేదని అంటున్నారు. అన్నీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 

ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్న విమర్శలు ! 

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు  ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయి. పీఆర్సీ విషయంలో  రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం సాగింది. చివరకు ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ సంతృప్తి కలిగించలేదంటూ ఛలో విజయవాడ పేరుతో భారీ ప్రదర్శన జరిగింది.  ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు, పీఆర్సీ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయులు అసహనంతో కనిపిస్తున్నారు. దానికి తోడుగా వేతనాలు సకాలంలో జమకాకపోవడం మరింత సమస్యగా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన జమ అవుతాయనే దీమా ప్రస్తుతం కనిపించడం లేదు. ఒక్కో నెల ఒక్కో రీతిన ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు అందుతున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి నిధులు దారి మళ్లించారని, ఉద్యోగులు తమ అవసరాల్లో వాటిని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండడం లేదనే విమర్శలు కూడా పదే పదే వినిపిస్తున్నాయి. నెలల తరబడి జీపీఎఫ్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘం నేతలపై ఒత్తిడి ! 

ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కనిపిస్తున్న అసంతృప్తి ఆయా సంఘాల నాయకుల మీద ఒత్తిడి పెంచుతోంది. దాంతో ప్రభుత్వంతో పీఆర్సీ సహా వివిధ ఒప్పందాల విషయంలో సానుకూలంగా వ్యవహరించిన నేతలు కూడా ఇటీవల తమ స్వరం పెంచుతున్నారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం సంచలనం అయింది.  జీపీఎఫ్ సహా వివిధ సమస్యలపై జోక్యం చేసుకోవాలని సూర్యనారాయణ గవర్నర్ ను కోరారు.  

ఉద్యోగుల్ోల ప్రభుత్వంపై వ్యతిరేకత !

జీపీఎఫ్ బిల్లులు, డీఏ చెల్లింపు వంటి విషయంలో జరుగుతున్న ఆలస్యం చాలామందిని వేధిస్తోంది. సామాజిక పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీన అందిస్తున్న ప్రభుత్వం   ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల విషయంలో కాలయాపన చేస్తూ వేధిస్తోందని ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. సీపీఎస్ వంటి సమస్యల నుంచి ప్రతీ విషయంలోనూ ప్రభుత్వ వైఖరి మోసపూరితంగా ఉందంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న పరిస్థితులు ఉండటంతో ఉద్యోగులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తాము చేయాల్సిందంతా చేస్తున్నామనే వాదనతో ఉంది. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరగడంతో ... ఉద్యోగులు ప్రభుత్వంఇక తమను లెక్క పెట్టడం లేదనే అభిప్రాయానికి వచ్చారు. 

ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కితే.. వారికి ప్రజా మద్దతు లభిస్తే.. ప్రభుత్వంపై వ్యతిరేక భావం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగుల ఆందోళనలను ఎలా అణిచి  వేయాలో ప్రభుత్వానికి బాగా తెలుసని.. వారివి గొంతెమ్మ కోరికలన్న అభిప్రాయంతో పెద్దలున్నారని అంటున్నారు. ఈ కారణంగానే ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే్ అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget