అన్వేషించండి

AP government vs Employees : మళ్లీ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం - ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీ రిస్క్ తీసుకుంటోందా ?

ఏపీలో మళ్లీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులుప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉద్యోగులుఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వంఎన్నికలకు ముందు అధికార పార్టీ రిస్క్ తీసుకుంటోందా ?

 

AP government vs Employees :   ఆంధ్రప్రదేశ్‌లో  ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అనే వాతావరణం మళ్లీ ఏర్పడుతోంది.  ఉద్యోగ  సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు,కేఆర్ సూర్యనారాయణ సీఎస్‌కు తమ  ఉద్యమ షెడ్యూల్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మమూలుగా కదిలేది కాదని.. ఈ సారి సమ్మెకు అయినా వెళ్తాం కానీ డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని అంటున్నారు. గతంలో పీఆర్సీ ఉద్యమ సమయంలో సమ్మె వరకూ వెళ్లారు. కానీపెద్దగా ఏమీ సాధించకుండానే ఉద్యమం విరమించారు. అయితే  అప్పటి  హామీలు ఇంకా నెరవేరలేదని పైగా ఇంకా మోసం చేస్తున్నారని..  ఉద్యోగులు అంటున్నారు. ఒక్క డీఏ ఇవ్వడంలేదని..  జీపీఎఫ్ సొమ్ములు సహా తాము దాచుకున్నవేవీ ఇవ్వడం లేదని అంటున్నారు. అన్నీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 

ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్న విమర్శలు ! 

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు  ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయి. పీఆర్సీ విషయంలో  రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం సాగింది. చివరకు ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ సంతృప్తి కలిగించలేదంటూ ఛలో విజయవాడ పేరుతో భారీ ప్రదర్శన జరిగింది.  ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు, పీఆర్సీ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయులు అసహనంతో కనిపిస్తున్నారు. దానికి తోడుగా వేతనాలు సకాలంలో జమకాకపోవడం మరింత సమస్యగా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన జమ అవుతాయనే దీమా ప్రస్తుతం కనిపించడం లేదు. ఒక్కో నెల ఒక్కో రీతిన ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు అందుతున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి నిధులు దారి మళ్లించారని, ఉద్యోగులు తమ అవసరాల్లో వాటిని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండడం లేదనే విమర్శలు కూడా పదే పదే వినిపిస్తున్నాయి. నెలల తరబడి జీపీఎఫ్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘం నేతలపై ఒత్తిడి ! 

ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కనిపిస్తున్న అసంతృప్తి ఆయా సంఘాల నాయకుల మీద ఒత్తిడి పెంచుతోంది. దాంతో ప్రభుత్వంతో పీఆర్సీ సహా వివిధ ఒప్పందాల విషయంలో సానుకూలంగా వ్యవహరించిన నేతలు కూడా ఇటీవల తమ స్వరం పెంచుతున్నారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం సంచలనం అయింది.  జీపీఎఫ్ సహా వివిధ సమస్యలపై జోక్యం చేసుకోవాలని సూర్యనారాయణ గవర్నర్ ను కోరారు.  

ఉద్యోగుల్ోల ప్రభుత్వంపై వ్యతిరేకత !

జీపీఎఫ్ బిల్లులు, డీఏ చెల్లింపు వంటి విషయంలో జరుగుతున్న ఆలస్యం చాలామందిని వేధిస్తోంది. సామాజిక పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీన అందిస్తున్న ప్రభుత్వం   ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల విషయంలో కాలయాపన చేస్తూ వేధిస్తోందని ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. సీపీఎస్ వంటి సమస్యల నుంచి ప్రతీ విషయంలోనూ ప్రభుత్వ వైఖరి మోసపూరితంగా ఉందంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న పరిస్థితులు ఉండటంతో ఉద్యోగులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తాము చేయాల్సిందంతా చేస్తున్నామనే వాదనతో ఉంది. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరగడంతో ... ఉద్యోగులు ప్రభుత్వంఇక తమను లెక్క పెట్టడం లేదనే అభిప్రాయానికి వచ్చారు. 

ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కితే.. వారికి ప్రజా మద్దతు లభిస్తే.. ప్రభుత్వంపై వ్యతిరేక భావం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగుల ఆందోళనలను ఎలా అణిచి  వేయాలో ప్రభుత్వానికి బాగా తెలుసని.. వారివి గొంతెమ్మ కోరికలన్న అభిప్రాయంతో పెద్దలున్నారని అంటున్నారు. ఈ కారణంగానే ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే్ అవకాశాలు కనిపిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Rajya Sabha Seat: చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
KS Bharat Announces Retirement:  ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
Embed widget