అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Governor Vs CM: తెలంగాణలో బెంగాల్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందా? గవర్నర్‌ వర్సెస్‌ సీఎం ఎపిసోడ్‌లో ఎవరిది పైచేయి ?

సిఎం కెసిఆర్‌, గవర్నర్‌ తమిళిసై మధ్య కూడా వార్‌ పతాకస్థాయిలోనే ఉంది. రాష్ట్రపాలన వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం ఎక్కువైందన్న ప్రభుత్వ విమర్శని లెక్క చేయకుండా తమిళిసై దూసుకుపోతున్నారు.

నిన్నటి వరకు గవర్నర్లను రబ్బర్‌ స్టాంప్‌గా అభివర్ణించేవాళ్లు. అయితే ఇప్పుడు వాళ్లు కూడా మారారు. రాష్ట్రంలో సిఎంలకు సమాంతరంగా పాలిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ ఆరోపణలకు అసలు కారణం ప్రధాని మోదీనే అన్న టాక్‌ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకు అంటే…!

ఈ మధ్యన రాజకీయాల్లో నోరు పారేసుకునే వాళ్లకే ప్రాముఖ్యతనిస్తున్నారన్న వార్తలైతే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీలో అయితే ఇది మరీ ఎక్కువ. మతపరమైన విమర్శలు చేసేవారికి, నమో నమః అనని పార్టీలు, నేతలపై ఒంటికాలిపై లేస్తారు. ఇలా చేస్తేనే బీజేపీ అదేవిధంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కంటిలో పడచ్చన్న ఆశతో పార్టీలో ఫైర్‌ బ్రాండ్లుగా పేరుతెచ్చుకుంటున్నారు. అలా ఈ మధ్యన గవర్నర్లలో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తోందంటున్నరు విశ్లేషకులు. 

కాంగ్రెస్‌, ఇతర పార్టీలు పాలించే రాష్ట్రాల్లో గవర్నర్లు ఫైర్‌ బ్రాండ్లుగా ఉంటున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రులను టార్గెట్‌ చేయడానికి గవర్నర్లను వాడుకుంటోందని టీఆర్ఎస్‌తో పాటు అనేక పార్టీలు గగ్గొలు పెడుతున్నాయి. 

ఇప్పటికే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. హస్తం నేతల్లో చీలికలు తెచ్చి వారికి కాషాయం కప్పేసి అధికారాన్ని అందుకుంది. ఇక ప్రాంతీయపార్టీలున్న రాష్ట్రాల్లో చీలికలు తేవడం కాస్తంత కష్టంగానే మారిందట బీజేపీకి. అందుకే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ముప్పతిప్పలు పెట్టడానికి గవర్నర్లను ఉసిగొల్పుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఆప్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆపమన్నా ఆపడంలేదు. 

దిల్లీలో కేజ్రీవాల్‌ పాలనకు బ్రేక్‌ వేసేందుకు చేయని ప్రయత్నాలు లేవని ఆప్ నేతలు అడపాదడపా చెప్తూనే ఉన్నారు. స్వయంగా కేజ్రీవాలే ఎన్నోసార్లు ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లారు కూడా. ఆప్‌ పార్టీలోనే చీలికలు తెచ్చి ప్రభుత్వాన్ని పడకొట్టింది. కానీ ప్రజల మద్దతుతో మళ్లీ కేజ్రీవాల్‌ విజయాన్ని అందుకొని బలమైన నేతగా దిల్లీ పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ పాలనపరమైన నిర్ణయాల్లో లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ జోక్యం ఉంటూనే ఉంది. రెండురోజుల క్రితం కూడా సిఎం వర్సెస్‌ లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ వీకె సక్సెనా పోరు మీడియాలో హైలెట్‌ అయ్యింది. 

పశ్చిమబెంగాల్లోనూ సేమ్‌ సీనే. మొన్నటి వరకు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న జగదీప్‌ ధన్‌కర్‌, మమతా బెనర్జీల మధ్య ఎంతటి వార్‌ కొనసాగిందో చెప్పాల్సిన పనిలేదు. టామ్‌ అండ్‌ జెర్రీలాగా సమయం దొరికనప్పుడల్లా నువ్వా నేనా అన్నరేంజ్‌ లో ఇద్దరూ కూడా అధికారబలాన్ని చూపించారు. ఇప్పుడు ఇదే సీన్‌ తెలంగాణలోనూ కనిపిస్తోందంటున్నారు రాజకీయవిశ్లేషకులు. 

తమిళిసై సౌందరరాజన్ మందు పనిచేస్తుందా? 

సిఎం కెసిఆర్‌, గవర్నర్‌ తమిళిసై మధ్య కూడా వార్‌ పతాకస్థాయిలోనే ఉంది. రాష్ట్రపాలన వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం ఎక్కువైందన్న ప్రభుత్వ విమర్శని లెక్క చేయకుండా తమిళిసై దూసుకుపోతున్నారు. మొన్నటివరకు ఆచితూచి అడుగులేసిన తమిళిసై దిల్లీ వెళ్లొచ్చినప్పటి నుంచి దూకుడు చూపిస్తున్నారు. అత్యాచార బాధితులను పరామర్శించడం, వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించడం, కోవిడ్‌ టైమ్‌లో రాజ్‌ భవన్‌ లో ఉచిత భోజన పథకం ఏర్పాటు చేయడంతోపాటు తాజాగా ప్రజా దర్బార్ కూడా ఓపెన్ చేసి కెసిఆర్‌ ను కాస్త ఇబ్బంది పెట్టారనేది అంతా అనుకుంటున్నారు. ఇలా గవర్నర్‌ తమిళిసై చాప కిందనీరులా కెసిఆర్‌ ని ఇరుకున పెట్టడానికి కారణం మరొకటి కూడా ఉందంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఈమధ్యన పార్టీలోని ఫైర్‌ బ్రాండ్లకు బీజేపీ పట్టం కడుతోంది. బండి సంజయ్‌నే అందుకు ఉదాహరణ చూపిస్తున్నారు. అలాగే బెంగాల్లో దీదీకి చుక్కలు చూపించిన జగదీప్‌కి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యే ఛాన్స్‌ ఇచ్చింది. అందుకే తమిళిసై కూడా పార్టీలో..అధిష్ఠానం దృష్టిలో పడేందుకు ఈ రకంగా వ్యహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. రానున్న రోజుల్లో తమిళిసై కూడా ఉన్నతమైన స్థాయిలో కనిపించడం ఖాయమంటున్నారు. తమిళనాట ఎన్నికల టైమ్‌ లో బీజేపీ తమిళిసై ని అస్త్రంగా వాడుతుందని జోస్యం చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naveen Yadav is set to become Minister: కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Bihar Election Results 2025: జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naveen Yadav is set to become Minister: కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
కాబోయే మంత్రి నవీన్ యాదవ్‌.. త్వరలో తెలంగాణ కేబినెట్‌లోకి..!
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Bihar Election Results 2025: జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
Bihar Election Result 2025: బిహార్ ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన ఈ 5 పాఠాలు ఇవే
బిహార్ ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన ఈ 5 పాఠాలు ఇవే
Bihar Election Result 2025 LIVE: బిహార్‌లో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఏ,
బిహార్‌లో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎన్డీఏ,
Jubilee Hills By Election Results 2025:  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
Dude OTT: 'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
Embed widget