అన్వేషించండి

YSRCP Latest News : అమరావతిపై వైసీపీ వ్యూహం బెడిసికొట్టిందా? ముంపు విమర్శలు రివర్స్ అవుతున్నాయా? రైతుల ఆగ్రహం, తాజా పరిణామాలు!

YSRCP Latest News : అమరావతి విషయంలో పదే పదే వైసీపీ పొరపాటు చేస్తోందా? అమరావతికి జై కొడుతూనే చేస్తున్న ప్రచారంపై జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లారిటీ లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

YSRCP Latest News : ఎందుకో తెలియదు గాని అమరావతి విషయంలో విపక్ష వైసిపి మొదటి నుంచి రాంగ్ స్ట్రాటజీలోనే వెళుతోంది అన్న డిస్కషన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గడిచిన కొద్ది రోజుల నుంచి 'వర్షాలకు అమరావతి మునిగిపోయింది.. రాజధాని ప్రాంతం చెరువులను తలపిస్తోంది  " అంటూ వైసిపి నేతలు వారి అనుబంధ మీడియా ఛానల్స్‌లో కథనాలు వండివారుస్తున్నారు. ఇలా వస్తున్న కథనాలఫై అమరావతి ప్రాంత వాసుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం పనులు మొదలయ్యాయి. దానికోసం ఎక్కడికక్కడ గుంతలు తీసి ఉంచారు. మరికొన్నిచోట్ల పునాదుల కోసం  నేలను తవ్వారు. వర్షాలు వల్ల వాటిలోకి నీరు చేరుకుంది. అలాగే రాజధాని ప్రాంతం కావడంతో భూ కేటాయింపులు జరిపిన సంస్థలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు  తమ పనులు మొదలెట్టాయి. అయితే దాని కంటే ముందు జరగాల్సిన డ్రైనేజీ పనులు అవ్వాల్సిన అంత స్పీడ్ గా కావడం లేదు అనేది వాస్తవం. దానితో కొన్ని చోట్ల నీరు నిలబడింది. ఈలోపులోనే రాజధాని ప్రాంతం మునిగిపోయింది అంటూ  ఒక్కసారిగా విపక్ష నేతలు చేస్తున్న ప్రచారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

29 గ్రామాలు.. 32 వేల ఎకరాలు.. అమరావతి రైతుల సాహసం

అమరావతి రాజధాని అనే ప్రాంతం 29 గ్రామాల పరిధిలోని ముప్పై రెండువేల ఎకరాల స్థలంలో రాబోతోంది. 2014-19 మధ్యకాలంలో రైతులతో ప్రభుత్వం చర్చలు, ఆ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులలో నెలకొన్న అనుమానాలు భయాలు, ధర్నాలు నిరసనలు,ఒప్పందాలు వంటి సంఘటనలతోనే గడిచిపోయింది. నిజానికి అప్పటికి అమరావతిపై రాష్ట్రవ్యాప్తంగా ఏమీ ఏకాభిప్రాయం లేదు. 2019-24 మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన వైసిపి అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లు తెరపైకి తేవడంతో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కారు. నచ్చ చెప్పాల్సింది పోయి వారితో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా విమర్శల పాలైంది. దానితో 2024 ఎన్నికల సమయానికి అమరావతిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తెలియకుండానే ఒక సమ్మతి వచ్చేసింది. దాని ప్రభావం ఆ ఎన్నికల ఫలితాలలో కనపడింది కూడా. ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పెద్ద బూస్ట్‌నే ఇవ్వడంతో అమరావతి పనులు ఈ టైంలో కొంతమేరైనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేగంగా పనులు చేస్తున్నారు.

అయితే రాజధాని ప్రాంతంలో నుంచి వర్షపు నీరు బయటకు పోయేలా చేయాల్సిన ఏర్పాట్లపై మాత్రం మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై రాజకీయ విశ్లేషకులు, అనుభవజ్ఞుల నుంచి విమర్శలు వెలువడుతున్న మాట వాస్తవం. అయితే సరిగ్గా ఇక్కడే  విపక్ష వైసిపి పొరపాటు చేస్తుంది అన్న వాదన పొలిటికల్ సర్కిల్స్‌లో వినబడుతోంది. రాజధాని రైతుల నుంచి ఎలాంటి విమర్శలు వినిపించని ప్రస్తుత తరుణంలో " అమరావతి మునిగిపోతుంది.. అక్కడ చేపలు తిరుగుతున్నాయంటూ చేస్తున్న విమర్శలు " నేతలకి బూమ్ రాంగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది.

రాజధానిపై స్పష్టత లేని వైసీపీ ఎజెండా

అమరావతిపై వైసీపీ ఎజెండా ఇప్పటికీ స్పష్టంగా కనిపించడం లేదు. అవునన్నా కాదన్నా 2024 ఎన్నికలు అమరావతి రాజధాని ఎజెండాగానే సాగాయి. ప్రజలంత స్పష్టంగా తీర్పు ఇచ్చాక అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా వైసిపి ఒప్పుకున్నట్టే కనిపించింది. దానికి తగ్గట్టే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా "అమరావతిని నాగార్జున యూనివర్సిటీ పరిధిలో పెడితే  బాగుంటుంది కదా "అని కూడా అనడం వైసీపీ తన స్టాండ్ మార్చుకుంది అన్న వాదనకు బలాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు రాజధాని మునిగిపోయింది అంటూ వైసిపి నేతలు చేస్తున్న విమర్శల అంతిమ ఫలితం ఏంటి అనేదానికి వైసీపీ దగ్గర స్పష్టత ఉందా అనేది అనుమానమే. అంటే రాజధానిని అమరావతిలో వద్దు అంటున్నారా.. లేక అమరావతి లోనే వేరే ప్రాంతానికి తరలించమంటున్నారా అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికీ అమరావతి రైతులు  జగన్ మోహన్ రెడ్డిపై కోపంతోనే ఉన్నారు. అది వారి మాటల్లోనే తెలుస్తోంది. గత పాలనలో జరిగిన పరిణామాలు వారు ఎదుర్కొన్న కేసులు వారిని అలాంటి అభిప్రాయంలోకి నెట్టివేసాయి. అలాంటి తరుణంలో తిరిగి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యాల్సిన విపక్ష పార్టీ అదే  అమరావతిపై విమర్శలు చేయడాన్ని అధికార కూటమి తనకు ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ప్రజలు ఏదైనా ఒక సమస్యపై బయటకు వస్తే వారి తరఫున విపక్షాలు పోరాటం చేస్తాయి. కానీ అమరావతిలో దీనికి  రివర్స్‌లో జరుగుతోంది. నిజానికి అమరావతి రైతులు ఆందోళన చెందుతుంది తమకు ఇస్తామన్న ఫ్లాట్లు ఇంకా ఇవ్వక పోవడం అమరావతి పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడం పట్ల. అలాగే కొత్తగా మరో 34 వేల ఎకరాలు  భూ సమీకరణ చేస్తామని చెప్పడంతో తమ పరిస్థితి ఏంటి అనే దానిపైన వారు ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై పోరాటం చేయడం ద్వారా  అమరావతి ప్రాంతానికి దగ్గరయ్యే ప్రయత్నం చేసే అవకాశం వైసీపీకి ఉంది. కానీ వైసీపీ ఎంతసేపూ వర్షాలు వస్తే "అమరావతి మునిగిపోతుంది.. భూములు చెరువుల్లాగా అయిపోతున్నాయి" అంటూ చేస్తున్న విమర్శల ద్వారా అసలు ఏం సాధించదలుచుకుంది అనే దానిపై స్పష్టత ఇవ్వలేక పోతోంది అని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Bhu Bharati Scams: ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
Iran vs America : ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Bhu Bharati Scams: ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
Iran vs America : ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
The Raja Saab Box Office Collection Day 8: బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ 'రాజా సాబ్' బోల్తా... ఇండియాలో 8 రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?
బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ 'రాజా సాబ్' బోల్తా... ఇండియాలో 8 రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?
Dog Viral Video:హనుమంతుని విగ్రహం చుట్టూ కుక్క 72 గంటలుగా ప్రదక్షిణలు! వైరల్ అవుతున్న వీడియో చూశారా?
హనుమంతుని విగ్రహం చుట్టూ కుక్క 72 గంటలుగా ప్రదక్షిణలు! వైరల్ అవుతున్న వీడియో చూశారా?
RBI jobs: పదో తరగతి క్వాలిఫికేషన్‌తో RBIలో ఉద్యోగం, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు ఆఖరు తేదీ?
పదో తరగతి క్వాలిఫికేషన్‌తో RBIలో ఉద్యోగం, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు ఆఖరు తేదీ?
BMC Results:ముంబైని కైవసం చేసుకున్న బీజేపీ, ఠాక్రే సోదరులకు షాక్; దూసుకెళ్లిన ఓవైసీ 'పతంగ్'!
ముంబైని కైవసం చేసుకున్న బీజేపీ, ఠాక్రే సోదరులకు షాక్; దూసుకెళ్లిన ఓవైసీ 'పతంగ్'!
Embed widget