అన్వేషించండి

Chandrababu Naidu: రాయలసీమలోనూ చంద్రబాబు వదల్లేదుగా- వైసీపీని కుదేలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ

Rayalaseema Election Result 2024: గతంలో రాయలసీమలో తమ పార్టీకి జరిగిన పరాభవానికి చంద్రబాబు తగిన ప్రతీకారం తీర్చుకున్నారని రాయలసీమ ఫలితాలు చూసిన విశ్లేషకులు చెబుతున్నారు.

Rayalaseema Assmbly Elction Result 2024: ఈ ఎన్నికల్లో ఏపీ లోని మిగతా ప్రాంతాల్లో ఎన్ని సీట్లొచ్చాయన్న విషయం కన్నా రాయలసీమలో జగన్, చంద్రబాబు ప్రాభవంపైనే పెద్దగా చర్చ జరుగుతోంది. గతంలో రాయలసీమలో తమ పార్టీకి జరిగిన పరాభవానికి చంద్రబాబు తగిన ప్రతీకారం తీర్చుకున్నారని రాయలసీమ ఫలితాలు చూసిన విశ్లేషకులు చెబుతున్నారు.  

2019లో రాయలసీమ నుంచి తెదేపా గెలిచిన సీట్లు కేవలం మూడు. మరి ఇప్పుడు..? 52 నియోజకవర్గాలకు గానూ 10 సీట్లలో మాత్రమే వైకాపా అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. అంటే మిగిలిన 42 సీట్లలోనూ కూటమి అభ్యర్థులే విజయ కేతనం దిశగా దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ని మినహాయిస్తే కేవలం తొమ్మిది మందికి మాత్రమే ప్రస్తుతం విజయావకాశాలున్నాయి. 

తెదేపా 2019 ఎన్నికల్లో రాయల సీమ నుంచి ఉరవకొండ, కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధిచింది. ప్రస్తుతం 42 సీట్లలో కూటమి గెలవబోతోంది. 

రాయలసీమలో వైకాాపా లీడింగ్ లో ఉన్న 10 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ పోటీ చేసిన కడప జిల్లా  పులివెందుల ఒకటి. ఇక్కడ 17 రౌండ్ల కౌంటింగ్ పూర్తవ్వగా సీఎం జగన్ తన సమీప తెదేపా అభ్యర్థి బీటెక్ రవిపై 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయన విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 

 ఆ తరువాతి స్థానంలో కడప జిల్లాకే చెందిన బద్వేల్ నియోజక వర్గంలో దాసరి సుధ తన సమీప తెదేపా అభ్యర్థి బొజ్జా రోషణ్ణపై ప్రస్తుతానికి 16 వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. మరో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపూ మిగిలి ఉన్న నేపథ్యంలో ఈమె విజయం కూడా దాదాపు ఖరారైనట్లే.

మంత్రాలయంలో బాలనాగిరెడ్డి 11 వేల ఓట్ల మెజారిటీ,  తంబాళపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి 9500 ఓట్ల మెజారిటీ, రాజంపేటలో అమర్ నాథ్ రెడ్డి 8300 ఓట్ల మెజారిటీ, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6600 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. 

ధర్మవరం వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి  తన సమీప అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పై  కేవలం 115 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అలాగే సత్యవేడులో వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేశ్ సమీప తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలంపై 133 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంకా చాలా రౌండ్ల కౌంటింగ్ బాకీ ఉంది కాబట్టీ.. ఏదైనా జరగొచ్చు.  ఇకపోతే.. రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షిసైతం నాలుగు వేల లోపు మెజారిటీతోనే కొనసాగుతున్నారు. ఇంకా అయిదు రౌండ్లకు పైగా కౌంటింగ్ మిగిలి ఉండటంతో ఇక్కడా ఫలితాలు తారుమారయ్యే అవకాశముంది.  

ఇలా చూస్తూ రాయలసీమలో పది లోపే స్థానలతో ఈ సారి వైకాపా సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Director Shankar : డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
Embed widget