ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
మంగళగిరిలో గెలిచి నారా లోకేశ్ తన సత్తా చాటుకున్నారు. తన తల్లికి ముద్దు పెట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నారా లోకేశ్ తన భార్య బ్రహ్మాణి, కుమారుడు దేవాన్ష్తో కలిసి తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
గతంలో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినా.. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు.
నారా భువనేశ్వరితో పాటు.. బాలయ్య వైఫ్ వసుంధరా దేవి కూడా ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు.
నారా లోకేశ యువగళం అనే పేరుతో చేసిన యాత్ర తెలుగుదేశం పార్టీకి బాగా కలిసివచ్చిందనే చెప్పాలి.
కూటమి పేరుతో జనసేన, భాజపాతో పొత్తు పెట్టుకుని.. ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధించింది.
ఈ సందర్భంగా.. నారా ఫ్యామిలీ చేసుకున్న సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కూటమి శ్రేణులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. తమ అభిమాన నాయకులకు విషెష్ చెప్తున్నారు.
74 ఏళ్ల వయసులో కూడా టీడీపీని గెలిపించేందుకు చంద్రబాబు చేసిన కృషి అంతా ఇంతా కాదు.
Thanks for Reading.
UP NEXT
ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
View next story