అన్వేషించండి

Telangana Politics: కాళేశ్వరం విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ ఆరోపణల్ని నిరూపించలేకపోయిందా?

Kaleshwaram :జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్‌ను సంతోషపరిచింది. కాంగ్రెస్ ను డిఫెన్స్‌ లోకి నెట్టేసింది. తర్వాత ఏం జరగబోతోంది?

BRS claims victory in Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీసింది. ఈ పరిణామం అటు అధికార కాంగ్రెస్‌కు సవాలుగా, ఇటు విపక్ష బీఆర్ఎస్‌కు అందివచ్చిన అస్త్రంగా మారింది.  

బీఆర్ఎస్ నైతిక విజయం 

హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ శ్రేణులు తమకు లభించిన క్లీన్ చిట్ గా అభివర్ణిస్తూ రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవానికి కోర్టు చెప్పింది కేవలం  సహజ న్యాయసూత్రాల  ఉల్లంఘన గురించి మాత్రమే అయినప్పటికీ, కేసీఆర్, హరీష్ రావులపై తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించడాన్ని గులాబీ దళం ఒక భారీ విజయంగా ప్రచారం చేస్తోంది. గత పది నెలలుగా ఆత్మరక్షణలో ఉన్న పార్టీకి, ఈ తీర్పు కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఒక బలమైన సాకుగా దొరికింది. వరుస ప్రెస్ మీట్లు, ప్రకటనలతో తాము నిర్దోషులమనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపిస్తున్నారు.

 కాంగ్రెస్ ఆత్మరక్షణ - క్లారిటీ లేని కౌంటర్

ప్రభుత్వ పక్షాన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఇది క్లీన్ చిట్ కాదని, కేవలం సాంకేతిక కారణాలతో వచ్చిన స్టే మాత్రమేనని చెబుతున్నా, అది బీఆర్ఎస్ చేస్తున్న హడావుడి ముందు వెలవెలబోతోంది. ప్రధానంగా కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఎన్నికల ముందు గొంతెత్తి చాటిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. లీగల్ ప్రాసెస్ లోని లోపాలను సవరించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఇప్పుడు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.

చర్యలు తీసుకోవాలంటే ఎన్నో మార్గాలు

నిజానికి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికతో సంబంధం లేకుండానే, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం కేవలం కమిషన్ నివేదికపైనే ఆధారపడటం వల్ల ఇప్పుడు అది న్యాయపరమైన చిక్కుల్లో పడింది. నిందితులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినడం అనేది చట్టబద్ధమైన ప్రక్రియ. ఈ చిన్న సాంకేతిక అంశాన్ని విస్మరించడం వల్ల ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి విచారణను పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రభుత్వ కాలయాపనకు అద్దం పడుతోంది.

 సీబీఐ విచారణ - స్తబ్ధతకు కారణమేంటి?

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిఫారసు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.  క్షేత్రస్థాయిలో సీబీఐ నుంచి ఎటువంటి కదలిక లేదు. సాంకేతికంగా కేసు నమోదు మినహా, లోతైన దర్యాప్తు ప్రారంభం కాకపోవడం బీఆర్ఎస్‌కు మరింత అడ్వాంటేజ్ గా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని పదేపదే చెబుతున్నారు. అయితే, ఇప్పటికే ప్రభుత్వ హయాంలో గణనీయమైన సమయం ముగిసిపోయింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా న్యాయపరమైన చిక్కులతో కాలం గడిస్తే, కాళేశ్వరం అవినీతి అనేది కేవలం ఒక ఎన్నికల నినాదంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమైతే, అది కాంగ్రెస్ విశ్వసనీయతపై దెబ్బతీసే అవకాశం ఉంది. వచ్చే రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపైనే రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయి.

ఇప్పటికైతే ఈ న్యాయపోరాటంలో బీఆర్ఎస్  అడ్వాంటేజ్  పొందినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తన దూకుడును కేవలం మాటలకే పరిమితం చేయకుండా, న్యాయపరమైన లోపాలను సరిదిద్ది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్లకపోతే, కాళేశ్వరం అస్త్రం రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Protest Modi House: బీజేపీ గేమ్‌లో పావుగా మారిన కాంగ్రెస్ - కాక్రోచ్‌లకు అడ్డుగా రాహుల్ - ఇదే మాస్టర్ క్లాస్ రాజకీయం?
బీజేపీ గేమ్‌లో పావుగా మారిన కాంగ్రెస్ - కాక్రోచ్‌లకు అడ్డుగా రాహుల్ - ఇదే మాస్టర్ క్లాస్ రాజకీయం?
Revanth Reddy About Rahul Gandhi Arrest: దేశం కోసం రక్తం చిందించడం, పదవులు త్యాగం రాహుల్ గాంధీ కుటుంబానికి కొత్త కాదు: రేవంత్ రెడ్డి
దేశం కోసం రక్తం చిందించడం, పదవులు త్యాగం రాహుల్ గాంధీ కుటుంబానికి కొత్త కాదు: రేవంత్ రెడ్డి
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget