అన్వేషించండి

Telangana Politics: కాళేశ్వరం విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ ఆరోపణల్ని నిరూపించలేకపోయిందా?

Kaleshwaram :జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్‌ను సంతోషపరిచింది. కాంగ్రెస్ ను డిఫెన్స్‌ లోకి నెట్టేసింది. తర్వాత ఏం జరగబోతోంది?

BRS claims victory in Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీసింది. ఈ పరిణామం అటు అధికార కాంగ్రెస్‌కు సవాలుగా, ఇటు విపక్ష బీఆర్ఎస్‌కు అందివచ్చిన అస్త్రంగా మారింది.  

బీఆర్ఎస్ నైతిక విజయం 

హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ శ్రేణులు తమకు లభించిన క్లీన్ చిట్ గా అభివర్ణిస్తూ రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవానికి కోర్టు చెప్పింది కేవలం  సహజ న్యాయసూత్రాల  ఉల్లంఘన గురించి మాత్రమే అయినప్పటికీ, కేసీఆర్, హరీష్ రావులపై తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించడాన్ని గులాబీ దళం ఒక భారీ విజయంగా ప్రచారం చేస్తోంది. గత పది నెలలుగా ఆత్మరక్షణలో ఉన్న పార్టీకి, ఈ తీర్పు కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఒక బలమైన సాకుగా దొరికింది. వరుస ప్రెస్ మీట్లు, ప్రకటనలతో తాము నిర్దోషులమనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపిస్తున్నారు.

 కాంగ్రెస్ ఆత్మరక్షణ - క్లారిటీ లేని కౌంటర్

ప్రభుత్వ పక్షాన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఇది క్లీన్ చిట్ కాదని, కేవలం సాంకేతిక కారణాలతో వచ్చిన స్టే మాత్రమేనని చెబుతున్నా, అది బీఆర్ఎస్ చేస్తున్న హడావుడి ముందు వెలవెలబోతోంది. ప్రధానంగా కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఎన్నికల ముందు గొంతెత్తి చాటిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. లీగల్ ప్రాసెస్ లోని లోపాలను సవరించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఇప్పుడు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.

చర్యలు తీసుకోవాలంటే ఎన్నో మార్గాలు

నిజానికి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికతో సంబంధం లేకుండానే, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం కేవలం కమిషన్ నివేదికపైనే ఆధారపడటం వల్ల ఇప్పుడు అది న్యాయపరమైన చిక్కుల్లో పడింది. నిందితులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినడం అనేది చట్టబద్ధమైన ప్రక్రియ. ఈ చిన్న సాంకేతిక అంశాన్ని విస్మరించడం వల్ల ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి విచారణను పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రభుత్వ కాలయాపనకు అద్దం పడుతోంది.

 సీబీఐ విచారణ - స్తబ్ధతకు కారణమేంటి?

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిఫారసు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.  క్షేత్రస్థాయిలో సీబీఐ నుంచి ఎటువంటి కదలిక లేదు. సాంకేతికంగా కేసు నమోదు మినహా, లోతైన దర్యాప్తు ప్రారంభం కాకపోవడం బీఆర్ఎస్‌కు మరింత అడ్వాంటేజ్ గా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని పదేపదే చెబుతున్నారు. అయితే, ఇప్పటికే ప్రభుత్వ హయాంలో గణనీయమైన సమయం ముగిసిపోయింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా న్యాయపరమైన చిక్కులతో కాలం గడిస్తే, కాళేశ్వరం అవినీతి అనేది కేవలం ఒక ఎన్నికల నినాదంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమైతే, అది కాంగ్రెస్ విశ్వసనీయతపై దెబ్బతీసే అవకాశం ఉంది. వచ్చే రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపైనే రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయి.

ఇప్పటికైతే ఈ న్యాయపోరాటంలో బీఆర్ఎస్  అడ్వాంటేజ్  పొందినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తన దూకుడును కేవలం మాటలకే పరిమితం చేయకుండా, న్యాయపరమైన లోపాలను సరిదిద్ది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్లకపోతే, కాళేశ్వరం అస్త్రం రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
West Bengal Politics: బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
Local Body Elections AP 2026: పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?
పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?
Congress Political Mind Games: గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?
గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget