అన్వేషించండి

CM Chandrababu: 15 మంది ఎమ్మెల్యే లకు చంద్రబాబు వార్నింగ్, ఇలాగైతే సీటు గల్లంతే అంటూ అసహనం

Andhra Pradesh News | టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇలాగైతే సీటు గలంతే అంటూ అసహనం వ్యక్తం చేశారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా  ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.  వారే కాకుండా  పార్టీకి సంబంధించిన వివిధ పదవుల్లో ఉన్న ఆహ్వానితులు  మరో 41 మంది కూడా ఏకంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి  రాలేదు.  "మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు" అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  వారిలో కొంతమంది  దైవ కార్యక్రమాల్లో ఉన్నామనీ మరి కొంతమంది విదేశాల్లో ఉన్నామని తెలపడంతో  ఇంత పెద్ద పార్టీ కార్యక్రమం ఉండగా  వేరే ప్రోగ్రామ్స్ ఎలాగ ఫిక్స్ చేసుకుంటారంటూ  చంద్రబాబు ప్రశ్నించారు.  ప్రజలకు జవాబుదారీగా ఉండాలని  నియోజకవర్గ ప్రజలకు  అందుబాటులో ఉండకుండా ఇవి ఇతర కార్యక్రమాలు ఏంటి అంటూ  ఆయన గట్టిగానే అడిగారు. 


విదేశాల్లోనే ఉండిపోండి :  ఎమ్మెల్యే లపై చంద్రబాబు ఫైర్ 

 విదేశాల్లో ఉన్న కొన్ని తెలుగు సంఘాలు ఏర్పాటు చేసిన  కార్యక్రమాల్లో పాల్గొనడానికి  ఈ 15 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది  వెళ్లినట్టు తెలియడంతో  "ప్రజలు, పార్టీ కంటే విదేశీ టూర్లు ఎక్కువైతే మీరు అక్కడే ఉండిపోండి " అంటూ  చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.  

ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ 

 అలాగే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకు  కూడా చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. జనాల్లో ఉండమని తాను చెబుతుంటే  ఈ ఎమ్మెల్యేలు తనకే సలహాలు ఇస్తున్నారు అంటూ  సెటైర్స్ వేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో  ఎవరెవరు ఎంతెంత సేపు ఉన్నారో తనకు తెలుసని ఆయన అన్నారు. 15 మంది ఎమ్మెల్యేలతో కలిపి  ఏకంగా 56 మంది ఆహ్వానితులు  ఏకంగా తన కార్యక్రమానికే  డుమ్మా కొట్టడంతో ఆయన కోపం కట్టలు తెంచుకుంది. ఇలాగైతే 2029 ఎన్నికల్లో  పార్టీ టికెట్ లభించదనీ అంతేకాకుండా పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అవుతుందని  హెచ్చరించారు.


 అభివృద్ధి పనులను ఇంటింటి కీ తిరిగి ప్రచారం చేయండి : నారా లోకేష్

 “సుపరిపాలనలో- తొలి అడుగు” పేరుతో ఈ ఏడాది లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని నెల రోజుల పాటు ఇంటింటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 94 శాతం సీట్లను ప్రజలు తమను గెలిపించారనీ దీనికి ప్రధాన కారణం గత పాలకులకు ఉన్న అహంకారం, వారి పని విధానం. అందుకే మనల్ని పెద్దఎత్తున ఆశీర్వదించారనీ అన్నారు.ఈ గెలుపు వెనుక కార్యకర్తల కష్టం చాలా ఉందన్న లోకేష్  దీనిని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.  164 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది మొదటిసారి గెలిచినవారు ఉన్నారనీ మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో 17 మంది మొదటిసారి గెలిచినవారు ఉన్నారనీ ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది ప్రతిపక్షంలో ఉండగా వేధింపులకు గురైనవారు,జైలుకు వెళ్లిన వారు అక్రమ కేసులు నమోదైన వారు ఉన్నారనీ వారితో పాటు కష్టపడిన కార్యకర్తలను మరువద్దని కోరుతున్నా అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. 

పార్టీనే సుప్రీమ్ అనీ, దేశం మొత్తం తిరిగినా, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికే అన్న లోకేష్ జాతీయ స్థాయిలో బీజేపీకి,, టీడీపీ కి తప్ప ఇంత పెద్ద కార్యాలయం మరే పార్టీకి లేదని అన్నారు సీనియర్ల అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటినీ జోడించాల్సిన అవసరం ఉందన్న లోకేష్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని లీడర్ల ను ఆదేశించారు. కుటుంబ సాధికార సారథి నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరూ నెల రోజుల పాటు రోడ్డెక్కాలని. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. డోర్ టూ డోర్ వెళ్లినప్పుడు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ను యాప్ లో నమోదు చేయాలనీ " మై టీడీపీ యాప్ "ద్వారా తాము చేసిన పనులు పార్టీకి తెలియజేయాలనీ నెల రోజుల పాటు తూచా తప్పకుండా అందరూ డోర్ టూ డోర్ ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.  అయితే ఏకంగా చంద్రబాబు కార్యక్రమానికే డుమ్మా కొట్టిన ఈ నేతలు ఎవరూ అంటూ ప్రస్తుతం నెటిజెన్స్  సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget