అన్వేషించండి

North Andhra Ysrcp Politics : మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు - స్పీకర్ జాక్ పాట్ కొట్టబోతున్నారా ?

ఏపీ మంత్రివర్గం మరోసారి పునర్‌వ్యవస్థీకరణకేబినెట్‌లోకి దూకుడుగా ఉండే ఎమ్మెల్యేలుతమ్మినేని సీతారాంకు కేబినెట్ మినిస్టర్ పోస్ట్ ?ధర్మానను స్పీకర్‌గా పంపిస్తారా?3వ తేదీన క్లారిటీ ఇవ్వనున్న సీఎం జగన్

North Andhra Ysrcp Politics :   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో మార్పు చేర్పులపై సీరియస్‌గా దృష్టి పెట్టి కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ పరాజయం తర్వాత అక్కడ పరిస్థితుల్ని మార్చాలని జగన్ అనుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రులందర్నీ మార్చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం క్యాంప్ ఆఫీసుకు అత్యవసరంగా మంత్రి సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాంను పిలిపించి చర్చలు జరిపారు. అలాగే ధర్మాన ప్రసాదరావుతోనూ తాజా పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త సమీకరణాలను సీఎం జగన్ వర్కవుట్ చేసినట్లుగా చెబుతున్నారు. 

తమ్మినేని సీతారాం మంత్రి కాబోతున్నారా?

స్పీకర్ గా ఉంటూ తమ్మినేని సీతారాం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సహజంగా స్పీకర్ గా ఉండేవారు సొంత పార్టీతో సంబంధాలు లేనట్లుగా ఉంటారు.కానీ తమ్మినేని సీతారాం అలాంటి మొహమాటాలేం పెట్టుకోలేదు. నేరుగా తాను వైసీపీ సభ్యుడినేనని చెబుతున్నారు. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్పీకర్‌గా విధులు నిర్వహించేటప్పుడు కూడా అధికార పార్టీని మా పార్టీ.. ఇతరుల్ని విపక్షాలు అనే అంటున్నారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. మంత్రిగా అయితే ఇలాంటి దూకుడు మరింతగా చూపిస్తారని.. ప్రస్తుతం ఇదే కావాలని సీఎం జగన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ్మినేని సీతారాంకు మరోసారి మంత్రిగా బాధ్యతలు  చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలోనే చాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు జగన్ పిలిచి అవకాశం ఇస్తానంటే ఆయన కాదనే అవకాశాలే లేవంటున్నారు. 

తమ్మినేని మంత్రి అయితే  మరి స్పీకర్ ఎవరు ?

ఉమ్మడి సిక్కోలు నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారిలో ఒకరు సీదిరి అప్పలరాజు. మరొకరు ధర్మాన ప్రసాదరావు. అంతకు ముందు ధర్మాన కృష్ణదాసు మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు స్పీకర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్నది కూడా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ పదవిని ఒకటి, రెండు సార్లు గెలిచిన వారికి ఇవ్వలేరు. సీనియర్ కావాలి.  అందులోనూ మంచి విషయ పరిజ్ఞానం, సభా వ్యవహారాలపై పట్టు ఉన్న వారికి ఇవ్వాలి. అలాంటి నేతలు కొంత మంది ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సమీకరణాల రీత్యా ఈ సారి కూడా శ్రీకాకుళం జిల్లాకే స్పీకర్ పదవి వస్తుందంటున్నారు. ధర్మాన ప్రసాదరావును మంత్రి పదవి నుంచి తప్పించి స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ధర్మానకు ఏడాది కిందటే మంత్రి పదవి ఇచ్చారు.  మరి ఆయన అంగీకరిస్తారా లేదా అన్నది కూడా కీలకమే. జగన్ ఆదేశిస్తే తప్పనిసరిగా అంగీకరించాల్సిందే. 

మంత్రి బొత్స కూ ఉద్వాసన తప్పదా ?

మంత్రి బొత్స సత్యనారాయణ తీరుపైనా సీఎం  జగన్ అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స అనుకున్నట్లుగా కష్టపడలేదని సీఎం జగన్ భావిస్తున్నారంటున్నారు.  అయితే బొత్స లాంటి సీనియర్ మంత్రిని తప్పించే అవకాశం ఉండదని మరికొందరు భావిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి సీఎం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని ద్వితీయ శ్రేణి నేతలు అంచనా వేస్తున్నారు. 

కేబినెట్‌లో సమూల మార్పులు ఉంటాయా ?

కారణం ఏదైనా కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించిన తర్వాత మంత్రుల్లో దూకుడు తగ్గిపోయింది. దూకుడుగా ఉన్న నేతలకు ఉద్వాసన చెప్పడం.. కొత్తగా మంత్రి అయిన  పార్టీ ఆదేశాలు వస్తే తప్ప నోరు తెరిచే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం. అందుకే మళ్లీ సీఎం జగన్ పాత కేబినెట్‌లో దూకుడుగా ఉన్న మంత్రులను మళ్లీ తీసుకోవాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మూడో తేదీన ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Embed widget