తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్లో 75వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాజ్ భవన్లోని చారిత్రక దర్బార్ హాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆదివారం ఉదయం ఎగురవేశారు. అనంతరం ఆమె గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్లో పనిచేసే సిబ్బందికి, అధికారులు, పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బందికి, వారి పిల్లలకు స్వీట్లు పంచారు. పూజలు నిర్వహించిన అనంతరం పుదుచ్చేరికి తమిళిసై బయలుదేరారు.
తెలంగాణ అభివృద్ధి పథకంలో మరింత ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ వేడుకలో గవర్నర్ తమిళిసై సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
KCR Chadar To Ajmer Dargah: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధిలో అంజనీ పుత్రుడు, వారాహికి ప్రత్యేక పూజలు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!