అన్వేషించండి
Khairatabad Ganesh Photos: ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర, నిమజ్జనం ఫోటోలు.. ఇదే చివరిసారి చూడండి!

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం
1/11

ఖైరతాబాద్లో ఈ ఏడాది ప్రతిష్ఠించిన మహా రుద్రగణపతి విగ్రహ నిమజ్జనం పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో భారీ విగ్రహాన్ని క్రేన్ల సాయంతో నిమజ్జనం చేశారు.
2/11

క్రేన్ నెంబరు 4 వద్ద మహా గణపతి నిమజ్జనం జరిగింది. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ట్యాంక్ బండ్కు పోటెత్తారు.
3/11

ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం జరుగుతుండగా పక్కనే ఉన్న భక్తులు పోటీ పడుతూ గణపయ్యతో సెల్ఫీలు దిగారు. ఈ భారీ గణపతి విగ్రహ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా వేలాది మంది భక్తులు కళ్లార్పకుండా తిలకించారు.
4/11

పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఆదివారం ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైంది.
5/11

భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర సందడిగా సాగింది. ట్యాంక్ బండ్పై తుది పూజల అనంతరం మహా గణపతి నిమజ్జనం కోసం తరలింది.
6/11

చివరి రోజు మహా గణపతి దర్శనం కోసం ట్యాంక్ బండ్కు భారీగా భక్తులు తరలివచ్చారు.
7/11

9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చిన సంగతి తెలిసిందే.
8/11

ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని వచ్చే ఏడాది నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని భాగ్య నగర్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
9/11

వచ్చే ఏడాది నుండి పూర్తిగా మట్టి వినాయకుడినే తయారు చేయించాలని కూడా కమిటీ నిర్ణయం తీసుకుంది.
10/11

వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని తయారు చేయాలని.. విగ్రహాన్ని అదే స్థానంలో నీటిని వేగంతో చిమ్ముతూ అక్కడికక్కడే నిమజ్జనం చేయాలని చూస్తున్నారు.
11/11

ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ ఒక్కసారికి అనుమతులు తెచ్చుకుంది.
Published at : 19 Sep 2021 05:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
జాబ్స్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion