అన్వేషించండి

G20 Summit 2022 : నవంబర్ 15 నుంచి రెండు రోజుల పాటు బాలిలో జీ20 సదస్సు

భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జీ20 సద్ససులో బిజీబిజీగా గడపనున్నారు. మొత్తం 45 గంటల్లో ప్రధాని మోదీ 20 సదస్సుల్లో పాల్గొంటారు.

ఇండోనేషియా లోని బాలిలో రెండు రోజుల పాటు G20 సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ సహా జీ20 అధినేతలు అంతా బాలిలో నవంబర్ 15,16 రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈసారి G20 సమావేశాలకు రష్యా గైర్హాజరు అవుతోంది. రష్యా పుతిన్ జీ20 సమ్మిట్ లో పాల్గొనటం లేదని ఆ దేశ అధికార ప్రతినిధి జీ20 సమ్మిట్ నిర్వాహకులకు సమాచారం అందించారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సమ్మిట్ లో పాల్గొంటే ప్రపంచ దేశాల అధినేతల నుంచి పుతిన్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చిరకాల మిత్రుడు భారత్ సహా అగ్రదేశాలు అమెరికా ఇంకా యూరోపియన్ యూనియన్ నుంచి రష్యాకు ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక జీ20 కు హాజరు కాకూడదని పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అగ్రదేశాల తాకిడికి పుతిన్ భయపడ్డారనే  ప్రచారం ఇంటర్నేషనల్ మీడియాలో జరుగుతోంది. 

    ఈ సదస్సులో ఆసక్తి రేపుతున్న ఇంకో అంశం చైనా-అమెరికా అధ్యక్షుల భేటీ. ప్రపంచశక్తిగా ఎదుగుతున్న చైనాను నిలువరించాలని గతంలో చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించిన అమెరికా ఇప్పుడు స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. చైనాతో ఘర్షణ పడాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఆ దేశంతో పోటీ పడాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని, ఉద్రిక్తతలు నివారించటానికి తమవైపు నుంచి సమాచార వ్యవస్థలన్నింటిని తెరిచే ఉంచుతామని కంబోడియాలో జరిగిన తూర్పు ఆసియా సదస్సులో మాట్లాడుతూ బైడెన్ మాట్లాడారు. 

ఇక భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జీ20 సద్ససులో బిజీబిజీగా గడపనున్నారు. మొత్తం 45 గంటల్లో ప్రధాని మోదీ 20 సదస్సుల్లో పాల్గొంటారు. ఇంటర్నేషనల్ ఎకనమిక్ కో ఆపరేషన్ మీద సౌత్ ఏషియన్ కంట్రీస్ వాయిస్ ను మోదీ వినిపించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఇంకో విషయం ఈ ఇయర్ జీ 20 సమావేశాలు మన దేశానికి చాలా కీలకం ఎందుకంటే ఈ సమావేశాల తర్వాత రోస్టర్ ఛైర్ ప్రకారం ఏడాది పాటు భారత ప్రధాని జీ20 కి అధ్యక్షుడిగా ఉంటారు. అంతే కాదు 2023 లో జీ20 సమావేశాలు భారత్ లోనే జరగనున్నాయి. జీ20 కు అధ్యక్షుడిగా ఉండటమే చాలా పెద్ద విషయమే అని చెప్పుకోవాలి. జీ20 లో ఉండే 20 దేశాలు చాలా శక్తివంతమైనవి. గ్లోబల్ జీడీపీ లో 85 శాతం ఈ దేశాల నుంచే వస్తోంది. ప్రపంచ వర్తక వాణిజ్యాల్లో 75 శాతం వాటా జీ20 దేశాలదే. ప్రపంచజనాభాలో మూడింట రెండొంతల జనాభా కూడా ఈ దేశాల్లోనే ఉంది. సో ఈ సమావేశాలు ఆ తర్వాత ఏడాది గ్లోబల్ ఎకనమిక్ పవర్ గా ఎదగటానికి ఇండియాకు చాలా కీలకం. సో మోదీ ఆలోచనలు, ఇండియన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందుకు అనుగుణంగానే ఉండనుంది.

టాప్ హెడ్ లైన్స్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget