అన్వేషించండి

Trump Warns Iran: అణు పరీక్షలు ఆపాలి, మాట వినకపోతే మళ్లీ బాంబు దాడులు - ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్

Iran Israel Conflict | యురేనియం ఉత్పత్తి కొనసాగిస్తే చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తేల్చిచెప్పారు. ఖమేనీ వార్నింగ్ తరువాత ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు.

Donald Trump Warns Iran: మధ్యప్రాచ్యంలో మంటలు ఇంకా చల్లారలేదు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాదాపు 12 రోజుల ఉద్రిక్తతల తరువాత కాల్పుల విరమణ జరిగింది. కాల్పుల విరమణ ప్రకటన తరువాత సైతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్ కనుక యురేనియం ఉత్పత్తిని కొనసాగిస్తే, అమెరికా తప్పకుండా మళ్లీ బాంబు దాడులు చేస్తుందని స్పష్టం చేశారు. 

ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీని తాము భయంకరమైన చావు నుంచి కాపాడామని ట్రంప్ అన్నారు. కానీ ఖమేనీ తన బుద్ధి చూపిస్తున్నారని, ఇది సరికాదంటూ మండిపడ్డారు. ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం చేయడం ఖమేనీ ప్రాణాలను కాపాడిందన్నారు. 

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహా

వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు తన అణు కార్యక్రమాన్ని తిరిగి చేపట్టకూడదన్నారు. ఇరాన్ అణు పరీక్షలు తిరిగి ప్రారంభించకుండా అంతర్జాతీయ తనిఖీ కోసం సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చారు. ఇరాన్‌తో చర్చల సమయంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లేదా మరే ఇతర సంస్థనైనా తనిఖీ చేయడానికి ఇరాన్ సహకరించాలని ట్రంప్ అన్నారు.

అమెరికాను హెచ్చరించిన ఖమేనీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికాను హెచ్చరించిన మరుసటిరోజు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలకు ఇరాన్ సులువుగా చేరుకోగలదని, అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. శత్రువు దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఖమేనీ అన్నారు.

ఖమేనీ మాట్లాడుతూ, "మేము వారి అల్-ఉదీద్ ఎయిర్ బేస్‌పై దాడి చేసి నష్టం కలిగించాం. ఇది ఈ ప్రాంతంలోని అమెరికా ప్రధాన స్థావరాలలో ఒకటి. ఇది అమెరికాకు చెంపదెబ్బ లాంటిది" అని అన్నారు.

అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్

ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ ద్వారా, అమెరికా జూన్ 22, 2025న ఇరాన్ కు చెందిన 3 అణు స్థావరాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్లపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ మిషన్‌లో 125 కంటే ఎక్కువ విమానాలు, B-2 స్టీల్త్ బాంబర్లు, 30 కంటే ఎక్కువ టోమాహాక్ మిసైల్స్ ను అమెరికా ప్రయోగించింది. అమెరికా దాడులకు ఇరాన్ తెలివిగా ప్రతీకారం తీర్చుకుంది. ఖతార్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్‌బేస్‌పై 6 మిస్సైల్స్ ను ప్రయోగించింది. ఇరాన్ ప్రతీకారంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత బాగా పెరిగింది.

ఓవైపు ఇజ్రాయెల్‌తో తలపడుతున్న ఇరాన్ సైన్యం, అమెరికా రంగంలోకి దిగడంతో అగ్రరాజ్యంతోనే పోరాటం చేయాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఆపన్న హస్తం అందించి ఇరాన్ కు వ్యతిరేకంగా పావులు కదిపింది. సీజ్ ఫైర్ ప్రకటన తరువాత సైతం ఇరాన్ తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు. ఈ యుద్ధంలో స్నేహధర్మం పాటించిన అమెరికాకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget