అన్వేషించండి

Ratna Bhandar: పూరీ రత్న భాండాగారంలో అన్ని ఆభరణాలున్నాయా, 70 రోజులు లెక్కించినా తేలని సంపద విలువ!

Ratna Bhandar Opening: రత్న భాండాగారాన్ని తొలిసారి 1978లో తెరిచారు. అప్పుడు దాదాపు 70 రోజుల పాటు లెక్కించి కొన్ని ఆభరణాల జాబితాని వెల్లడించారు. మొత్తం సంపద విలువను మాత్రం తేల్చలేదు.

Puri Ratna Bhandar Opening: పూరీ జగన్నాథుని ఆలయంలోని రత్న భాండాగారంపై (Ratna Bhandar) దేశవ్యాప్తంగా ఆసక్తికర కథలు వినిపిస్తున్నాయి. లోపల ఎవరూ ఊహించనంత సంపద ఉందని, ఆ నిధులకు విష సర్పాలు కాపలా కాస్తున్నాయని కొందరు చెబుతున్నారు. అందుకే అధికారులు గదిని తెరిచేందుకు భయపడుతున్నారు. అయితే...ఈ భాండాగారాన్ని (Puri Jagannath Temple) తెరిచేందుకు ఓ SOPని అనుసరించాలని నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. మరి 46 ఏళ్ల క్రితం ఈ భాండాగారాన్ని తెరిచినప్పుడు ఏం జరిగింది..? లోపల ఏముంది..? అందరూ అనుకుంటున్నట్టుగానే విష సర్పాలు కనిపించాయా..? వజ్రాలు వైఢుర్యాలు ఉన్నాయా..? ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఈ భాండాగారంపై ఎన్నో ఏళ్లుగా ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నాయి. దీని గురించి తెలుసుకోడానికే 1978లో తొలిసారి తెరిచారు. అప్పుడే ఆ భాండాగారంలో (Ratna Bhandar Opening) ఏమున్నాయో గుర్తించారు. సంపదను లెక్కించే ప్రయత్నం (Ratna Bhandar Mystery) చేశారు. ఈ గది లోపల బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలతో పాటు రకరకాల ఆభరణాలు కనిపించాయి. 1978 మే 13వ తేదీన మొదలైన లెక్కింపు ప్రక్రియ జులై 23వ తేదీ వరకూ కొనసాగింది. దాదాపు 70 రోజుల పాటు శ్రమించిన సిబ్బంది చివరకు లెక్క తేల్చారు. 

ఇదీ జాబితా..

స్టోర్‌ హౌజ్‌లో 367 రకాల బంగారు ఆభరణాలున్నాయి. వాటి బరువు 4,360 గ్రాములు. వీటితో పాటు 14,828 గ్రాముల బరువైన 231 వెండి వస్తువులను గుర్తించారు. మరో స్టోర్‌హౌజ్‌లో 87 రకాల బంగారు ఆభరణాలు కనిపించాయి. వీటి బరువు 8,740 గ్రాములు. రెండో స్టోర్‌హౌజ్‌లో బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులూ (What is inside Ratna Bhandar) పెద్ద ఎత్తున కనిపించాయి. 7,321 గ్రాముల బరువైన 62 వెండి వస్తువులున్నట్టు లెక్క తేల్చారు. మొత్తంగా చూస్తే రత్న భాండార్‌లో  12,831 గ్రాముల బంగారం, 22,153 గ్రాముల వెండి ఉందని లెక్క తేలింది. ఇదే విషయాన్ని 2021లో న్యాయ శాఖా మంత్రి ప్రతాప్ జేనా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. అయితే...ఈ మొత్తం సంపద విలువ ఎంత అన్నది మాత్రం తేలలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వమూ వెల్లడించలేదు. రహస్య గదిని తెరిచి ఈ ఆభరణాలను గుర్తించారు. అయితే...ఇప్పుడు మరోసారి తెరిచి పూర్తిస్థాయిలో మిస్టరీని ఛేదించాలని భావిస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఇన్నాళ్లూ ఈ భాండాగారంపై వస్తున్న వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 

తాళం చెవిపైనా వివాదం..

2018లో రత్న భాండాగారం తాళం చెవి (Ratna Bhandar Key Missing) కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఈ తాళానికి డూప్లికేట్ మాత్రమే ఉంది. దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపింది. జ్యుడీషియల్ కమిషన్‌ ఏర్పాటై దీనిపై విచారణ చేపట్టింది. అప్పటి నుంచి ఈ తాళం చెవి గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ తాళం గురించి ప్రస్తావించడం వల్ల మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఆరేళ్లుగా తాళం కనిపించకుండా పోయినా ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదని విమర్శించారు. తమిళనాడుకి ఈ తాళాన్ని పంపించారంటూ ఆరోపించారు. ఈలోగా ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆలయ సంస్కరణలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రత్న భాండాగారాన్ని తెరిపిస్తోంది. 

Also Read: Puri Ratna Bhandar: పూరీ రత్న భండార్‌పై పెరుగుతున్న ఉత్కంఠ, ఎలా తెరవాలో ప్లాన్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

 

టాప్ హెడ్ లైన్స్

 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Dada Sourav Ganguly Comments: గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై సంచలన కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై Hot కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget