అన్వేషించండి

Orange Alert : హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లకు ఆరెంజ్‌ అలర్ట్‌

Orange Alert : హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను మళ్లీ భారీ వర్ష సూచన భయపెడుతోంది

Orange Alert: గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడడం వంటి ఘటనలతో అతలాకుతలమవుతున్న హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను మళ్లీ భారీ వర్ష సూచన భయపెడుతోంది. ఈ రెండు రాష్ట్రాలలో ఆగస్టు 22 నుంచి 24 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. దీంతో రెండు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. 

ఆగస్టు 21 నుంచి  24 తేదీల మధ్య సమయంలో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆగస్టు 22, 23 తేదీల్లో వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజా బులెటిన్‌లో పేర్కొంది. చంబా, మండి జిల్లాల పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఆగస్టు 26 వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడడం, నదులు, కాలువలలో నీటి మట్టాలు పెరుగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ వర్షాల కారణంగా రాష్ట్రాలలో పంటలు, పండ్ల మొక్కలలకు విపరీతంగా నష్టం కలుగుతోంది.

హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో వర్షాల కారణంగా సంభవించిన ఘటనలలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 88 కి చేరింది. సిమ్లాలో కూలిపోయిన ఆలయం శిథిలాల నుంచి మరొక మృతదేహాన్ని వెలికి తీయడంతో ఈ సంఖ్య 88 కి పెరిగింది. హిమాచల్‌కు ముందస్తు సహాయంగా కేంద్రం ఆదివారం రూ.200 కోట్లు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. రెస్క్యూ, రిలీఫ్‌ ఆపరేషన్స్‌ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి 20 బృందాలు, ఇండియన్‌ ఆర్మీకి చెందిన తొమ్మిది బృందాలు, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మూడు హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి.

అలాగే ఆగస్టు 24, 25 తేదీలలో సబ్‌-హిమాలయ్‌ వెస్ట్‌ బెంగాల్‌, సిక్కింలలో కూడా భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. బిహార్‌లో ఆగస్టు 25 వరకు భారీ వర్షాలను అంచనా వేస్తోంది. ఆగస్టు 21  నుంచి 25 తేదీల మధ్య అసోం, మేఘాలయాల, అరుణాచల్‌ ప్రదేశ్‌లలోనూ భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ భారతదేశం విషయానికొస్తే, ఆగస్టు 22 న తమిళనాడులో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడాని వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్లు కొట్టుకుపోయాయి. మునిగిన ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. రాత్రి పగలు తేడా లేకుండా అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో జరిగే ఛార్‌ధామ్‌ యాత్రను ప్రభుత్వం కొద్ది రోజులు నిలిపేసింది. సిమ్లాలోని ఫగ్లి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన కారణంగా ఓ శివాలయం ధ్వంసమైంది. ఆలయ శిథిలాల కింద చిక్కుకుని దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయి ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. కొద్ది రోజుల క్రితం కేవలం 24 గంటల్లోనే వర్షాలకు సంబంధించిన సంఘటనల కారణంగా 50 మంది చనిపోయినట్లు హిమాచల్‌ రాష్ట్ర మంత్రి వెల్లడించారు. దీంతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పేపర్‌ లీకేజీ చట్టసవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం- నిందితులపై కఠిన చర్యలు
పేపర్‌ లీకేజీ చట్టసవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం- నిందితులపై కఠిన చర్యలు
NEET Paper Leak Talks: NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget