అన్వేషించండి

Viral News: క్లాస్‌లో పాఠాలు చెప్పకుండా క్యాండీ క్రష్ ఆడుతూ కూర్చున్న టీచర్‌, సస్పెండ్ చేసిన అధికారులు

Candy Crush: యూపీలోని ఓ స్కూల్‌ టీచర్‌ పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఫోన్‌లో మునిగిపోయాడు. గంటల కొద్దీ క్యాండీ క్రష్‌ ఆడి సస్పెన్షన్‌కి గురయ్యాడు.

Teacher Played Candy Crush in Class: క్లాస్‌లో పాఠాలు చెప్పాల్సిన టీచర్‌ ఫోన్‌లో మునిగిపోయాడు. పిల్లల్ని పట్టించుకోకుండా మొబైల్ పట్టుకుని కూర్చున్నాడు. చివరకు సస్పెండ్ అయ్యాడు. యూపీలో జరిగిందీ ఘటన. ఓ గవర్నమెంట్‌ స్కూల్‌లో టీచర్‌ పాఠాలు చెప్పకుండా మొబైల్‌లో క్యాండీ క్రష్‌ ఆడుకుంటూ కూర్చున్నాడు. గంటల కొద్దీ అంతే కాలక్షేపం చేశాడు. సరిగ్గా అదే సమయంలో జిల్లా మెజిస్ట్రేట్ స్కూల్‌లో ఇన్‌స్పెక్షన్‌కి వెళ్లారు. విద్యార్థుల నోట్స్‌ చెక్ చేశారు. ఎక్కడ చూసినా తప్పుల తడకలే కనిపించాయి. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. ఆ తరవాత అనుమానం వచ్చి టీచర్ మొబైల్ చెక్ చేశారు. అందులో ఓ ఫీచర్ ఉంది. ఏ యాప్‌ ఎంత సేపు వాడామని అందులో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ లెక్కలన్నీ తీస్తే క్యాండీ క్రష్‌ని గంటల కొద్దీ ఆడినట్టు తేలింది. పని వేళల్లోనే ఎక్కువ సేపు ఆడుతున్నట్టు గమనించారు అధికారులు. ఒక్కోసారి స్కూల్‌లోనే కూర్చుని రెండు గంటల పాటు గేమ్ ఆడుతున్నట్టు గుర్తించారు. ఆ టీచర్‌ని తీవ్రంగా మందలించారు. ఆ తరవాత సస్పెండ్ చేశారు. టీచర్‌లు విద్యార్థులకు పాఠాలు చెప్పడంపైనే దృష్టి పెట్టాలని, వాళ్ల బుక్స్‌ రెగ్యులర్‌గా చెక్ చేయాలని ఆదేశించారు. 

"విద్యార్థుల క్లాస్‌వర్క్‌, హోమ్ వర్క్ నోట్స్‌లను తరచూ చెక్ చేయాలి. వాళ్లకు సరైన విధంగా అర్థమవుతోందా అన్నది గమనించాలి. మొబైల్ వాడడం తప్పు కాదు. కానీ స్కూల్ అవర్స్‌లో ఇలా విద్యార్థులను గాలికి వదిలేసి గంటల కొద్ది పర్సనల్‌ పనుల కోసం మొబైల్ వాడడం మాత్రం కచ్చితంగా తప్పే"

- అధికారులు

కొందరి విద్యార్థుల బుక్స్‌లో చాలా తప్పులు కనిపించడం అధికారులను అసహనానికి గురి చేసింది. టీచర్ మొబైల్‌లో  Digital Well-being ఫీచర్‌ ఉండడం వల్ల అధికారులు అంతా ట్రాక్ చేశారు. ఐదున్నర గంటల పని వేళల్లో దాదాపు రెండు గంటల పాటు గేమ్స్ ఆడుతున్నట్టు గుర్తించారు. రోజూ అరగంట ఫోన్ కాల్స్ మాట్లాడడంతోనే టైమ్‌పాస్ చేస్తున్నాడు. ఇలాంటి తప్పుల్ని అసలు క్షమించమని జిల్లా మెజిస్ట్రేట్ హెచ్చరించారు. స్కూల్స్‌లో టీచర్లు ఫోన్‌లు వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్న వాదన ఉంది. కొన్ని చోట్ల స్ట్రిక్ట్‌గా రూల్స్ పెడుతున్నా మరి కొన్ని చోట్ల మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటు విద్యార్థులు కూడా స్కూల్స్‌కి మొబైల్స్ పట్టుకొస్తున్న ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. అందుకే మొబైల్ వినియోగంపై అంతా అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా వాడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ మధ్య కర్ణాటకలో ఓ స్కూల్‌లో పిల్లలు మొబైల్స్ పట్టుకొచ్చి నానా రచ్చ చేశారు. స్కూల్ యాజమాన్యం అందరినీ చెక్ చేసి వాటిని సీజ్ చేసింది. ఆ తరవాత తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపింది. అప్పట్లో ఈ ఘటన మిగతా స్కూల్స్‌పైనా ఫోకస్ పెట్టేలా చేసింది. 

Also Read: Japan Laugh Rule: రోజుకోసారైనా చచ్చినట్టు నవ్వాల్సిందే, ఆ దేశంలో వింత చట్టం - కారణమదే

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Embed widget