Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Yamuna river: యమునా నదిలో పడవ గల్లంతు కావడంతో పది మంది చనిపోయారు. మరో పదిహేను మంది గల్లంతయ్యారు. ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

Boat capsized in the Yamuna river: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్లో యమునా నదిపై శుక్రవారం ఘోర పడవ ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళ్తున్న ఒక భారీ స్టీమర్ పడవ కేసీ ఘాట్ సమీపంలో నదిపై ఉన్న తాత్కాలిక వంతెనను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 10 మంది యాత్రికులు మృతి చెందగా, మరికొందరు గల్లంతైనట్లు సమాచారం.
సామర్థ్యానికి మించి ప్రయాణికులు?
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్లోని ముక్త్సర్ ప్రాంతానికి చెందిన యాత్రికులు బృందావన దర్శనం కోసం వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యారు. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండటం, దానికి తోడు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పడవ నియంత్రణ తప్పి వంతెనను ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పడవ బోల్తా పడగానే యాత్రికులు ఒక్కసారిగా నీటిలో పడిపోవడంతో అక్కడ ఆర్తనాదాలు మిన్నంటాయి.
मथुरा से बड़ा हादसा
— Journalist Deepika singh (@Deepikasingh043) April 10, 2026
श्रद्धालुओं से भरी नाव यमुना में पलटी
हादसे में 10 लोगों की मौत
सीएम योगी ने लिया हादसे का संज्ञान
राहत-बचाव कार्य में तेजी लाने के निर्देश दिए@mathurapolice @Uppolice #BREAKINGNEWS #HADSA #NAV #YAMUNA pic.twitter.com/xLM83x2IMc
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ప్రమాద వార్త తెలియగానే స్థానిక పోలీసులు, మత్స్యకారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 15 మందిని సురక్షితంగా వెలికితీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. గల్లంతైన వారి కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నదిలో గాలింపు చర్యలను వేగవంతం చేసేందుకు గజ ఈతగాళ్లను కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ధృవీకరించారు.
Massive tragedy in Mathura as a steamer boat carrying 30 devotees capsizes in the Yamuna river after hitting a pontoon bridge near Vrindavan. 🛥️💔 Heartbreaking reports of at least 6-9 deaths. Rescue operations are currently underway. Praying for the families. 🙏 #Mathura #Yamuna… pic.twitter.com/EjPVVxlQqk
— Dipak (@Rohit51388267) April 10, 2026
విషాదంలో మునిగిన ఘాట్లు
ఈ ఘోర ప్రమాదంతో పవిత్ర బృందావన ఘాట్ల వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఘటనపై స్పందిస్తూ, బాధితులకు తక్షణ సహాయం అందించాలని మరియు గాలింపు చర్యలను పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. పడవ నడిపిన వ్యక్తి నిర్లక్ష్యంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. గల్లంతైన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















