By: Ram Manohar | Updated at : 11 Mar 2023 03:42 PM (IST)
తేజస్వీ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. (Image Credits: ANI)
Land-For-Job Case:
ఆసుపత్రిలో చికిత్స..
బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే...తేజస్వీ యాదవ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఆయన భార్య ఆసుపత్రిలో ఉన్నారు. పైగా ఆమె గర్భవతి కూడా. ఈ కారణంగానే ఆయన విచారణకు హాజరు కావడం కుదరడం లేదని సీబీఐకి తేజస్వీ యాదవ్ చెప్పినట్టు ANI రిపోర్ట్ చేసింది. 12 గంటల పాటు సీబీఐ అధికారులు విచారించిన కారణంగా ఆయన భార్య కళ్లు తిరిగి పడిపోయారని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.
"బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు కావడం లేదు. ఆయన భార్య ఆసుపత్రి పాలయ్యారు. ఈడీ సోదాలు ముగిసిన తరవాత ఆమె ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. లో బీపీ కారణంగా అస్వస్థకు గురయ్యారు. అధికారులు 12 గంటల పాటు విచారించారు"
-ANI
Bihar Deputy CM Tejashwi Yadav likely to skip CBI summons today in land-for-jobs case
— ANI Digital (@ani_digital) March 11, 2023
Read @ANI Story | https://t.co/6qiZV1G1bq#TejashwiYadav #EDSummon #landjobscam #CBI #Bihar pic.twitter.com/qhLjVoa4hw
#UPDATE | Bihar Dy CM & RJD leader Tejashwi Yadav won't appear before CBI due to his wife's health. After the ED raid, she was hospitalised yesterday at a private hospital in Delhi. She is pregnant and after twelve hours of interrogation she fainted due to BP problems: Sources
— ANI (@ANI) March 11, 2023
ఇదే కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవిని కూడా అధికారులు విచారించారు. ఇప్పటికే ఫిబ్రవరి 4వ తేదీన తేజస్వీ యాదవ్కు సమన్లు జారీ చేసిన సీబీఐ ఇప్పుడు మరోసారి ఆయనకు నోటీసులు పంపింది. అయితే మొదటి సారి సమన్లు పంపినప్పుడు ఆయన హాజరు కాలేదు. లాలూని రెండు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో తీసింది ఈడీ. ఇప్పటికే సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవితో పాటు మొత్తం 14 మంది పేర్లు చేర్చింది. లాలూ హయాంలో ఈ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా తీసుకున్నట్టు చెబుతోంది ఈడీ. 2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్టు ED అధికారులు ఆరోపిస్తున్నారు. ముంబయి, జబల్పూర్, కోల్కత్తా, జైపూర్, హాజిపూర్లలో పలువురికి గ్రూప్ D పోస్ట్లు ఇచ్చారని, అందుకు బదులుగా తమ పేరు మీద స్థలాలు రాయించుకున్నారని చెబుతున్నారు. AK Infosystems Private Limited పేరు మీద కూడా స్థలాలు రాయించారని ED వివరిస్తోంది. ఆ తరవాత ఈ కంపెనీ ఓనర్షిప్ను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల పేరుపై మార్చారన్న ఆరోపణలున్నాయి.
Also Read: Mohit Joshi: ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషి రాజీనామా, 20 ఏళ్ల ప్రయాణానికి ఫుల్స్టాప్
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
SSC CHSLE 2022 Key: ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఖాళీలు, అర్హతలివే!
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్