అన్వేషించండి

Viral news: తండ్రి, కుమార్తెల మధ్య ఆస్తి వివాదం - దేవుడికి కూడా కోర్టుకు లాగేస్తున్నారు !

Tamil Nadu: తమిళనాడులో ఓ తండ్రి తన ఆస్తిని ఆలయానికి రాసిచ్చేశారు. కానీ ఆయన కుమార్తెలు కోర్టుకెళ్లారు.

Tamil Nadu man drops Rs 4 crore documents in hundi: తండ్రికి కోపం వచ్చినా సరే ఆస్తులు ఇవ్వకుండా ఉండలేరని అనుకుంటారేమో కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తనకు నచ్చని పని చేశారని కూతుళ్లకు కాకుండా ఆలయానికి ఆస్తులు రాసిచ్చేశాడు ఓ తండ్రి. ఇప్పుడా తండ్రి కుమార్తెలు మా ఆస్తి మాకివ్వాలని ఆలయ పెద్దల్ని అడుగుతున్నారు. విషయం కోర్టుకు చేరింది.                

తమిళనాడులోని తిరువణ్ణామలై లో  ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి తన కుమార్తెలతో ఆస్తి వివాదం కారణంగా రూ. 4 కోట్ల విలువైన ఆస్తి డాక్యుమెంట్లను ఆలయ హుండీలో వేశారు.  ఎస్. విజయన్ అనే  రిటైర్డ్ ఆర్మీ అధికారి. తన భార్య నుండి విడిపోయి, ఒంటరిగా జీవిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు చెన్నై, వేలూరులో నివసిస్తున్నారు . కుమార్తెలకు ఆస్తులు ఇవ్వకూడదనుకున్న ఆయన  రూ. 3 కోట్ల విలువైన   రెండు అంతస్తుల భవనం, రూ. 1 కోటి విలువైన మరో 1,500 చదరపు అడుగుల స్థలాలకు చెందిన  డాక్యుమెంట్లను అరుళ్మిగు రేణుగాంబాళ్ అమ్మన్ ఆలయంలోని ఒక హుండీలో వేశారు.             

డాక్యుమెంట్లతో పాటు, విజయన్ ఒక  లేఖను కూడా హుండీలో వేశారు, ఇందులో తన ఆస్తిని ఆలయానికి స్వచ్ఛందంగా విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. "నా పిల్లలు నా రోజువారీ అవసరాల కోసం కూడా నన్ను పట్టించుకోలేదు" అని ఆ లేఖలో రాశారు. ఆలయంలో 11 హుండీలు ఉన్నాయి. ప్రతి రెండు నెలలకు ఒకసారి భక్తుల విరాళాలను లెక్కించడం సంప్రదాయం. జూన్ 24, 2025న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో, ఒక హుండీని తెరిచినప్పుడు, ఆలయ సిబ్బంది ఈ ఆస్తి డాక్యుమెంట్లను కనుగొన్నారు.                     

 ఇద్దరు కుమార్తెలు తన ఆస్తిని తమకు బదిలీ చేయమని విజయన్ పై ఒత్తిడి చేశారు. అయితే తాను నిర్ణయాన్ని తిరిగి తీసుకోను. నేను ఆలయ అధికారులతో మాట్లాడి, చట్టప్రకారం ఈ ఆస్తులను ఆలయం పేరిట రిజిస్టర్ చేస్తానని విజయన్ చెబుతున్నారు. డాక్యుమెంట్లు హుండీలో వేసినంత మాత్రాన ఆ ఆస్తులు ఆలయపరం కావు.  విజయన్ కుమార్తెలు ఈ విరాళాన్ని వ్యతిరేకిస్తున్నారు . ఆస్తి డాక్యుమెంట్లను తిరిగి పొందేందుకు కోర్టుకెళ్లారు. 

హుండీలో డాక్యుమెంట్లను వేయడం వల్ల ఆస్తి ఆలయ ఆధీనంలోకి   రాదని హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్ (HR&CE) అధికారులు స్పష్టం చేశారు. ఆస్తిని చట్టప్రకారం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లను విజయన్‌కు తిరిగి ఇవ్వలేమని ఆలయ అధికారులు చెబుతున్నారు.  విజయన్ ఆస్తిపై ఏకైక యజమాని అయితే, ఈ విరాళం చట్టపరంగా చెల్లుబాటు కావచ్చని న్యాయ నిపుణులు 
చెబుతున్నారు. కానీ కుమార్తెలు కోర్టుకు వెళ్తున్నారు.       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Embed widget