Where is Khamenei: యుద్ధం ముగిసినా బయటకు రాని ఇరాన్ సుప్రీం లీడర్ - సజీవంగా ఉన్నారా ?
Iran: యుద్ధం ముగిసింది. ఇజ్రాయెల్ ప్రధాని బయటకు వస్తున్నారు. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ మాత్రం కనిపించడం లేదు. దాంతో ఆయన బతికి ఉన్నారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Iran Supreme Leader absent: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి పరిష్కారం అంటూ ఎక్కువగా వినిపించిన పేరు ఖమేనీని హతం చేయడం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అయతుల్లా అలీ ఖమెనీని చంపేస్తే యుద్ధం అయిపోతుదంన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే చెప్పారు. కానీ ఖమేనీని చంపడం తమ లక్ష్యం కాదన్నారు. యుద్ధం ముగిసింది కానీ.. ఖమేనీ మాత్రం బయటకు రావడం లేదు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనీ దాదాపు వారం రోజులుగా ప్రజలకు కనిపించలేదు. ఇది ఇరాన్లో ఆందోళన , ఊహాగానాలకు దారితీస్తోంది. ఇరాన్లోని మూడు ప్రధాన అణు స్థావరాలు ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికా దాడులు చేసింది. అంతకు ముందు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అనేక మంది ఇరాన్ సైనిక అధికారులు , అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఇరాన్ ప్రతీకారంగా ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణి దాడులు చేసింది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖమెనీ హత్య ద్వారా సంఘర్షణను ముగించవచ్చని ప్రకటించారు. దాంతో ఖమెనీ ఒక రహస్య భూగర్భ బంకర్లో ఉన్నారు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను నిలిపివేశారు. ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. సుప్రీం లీడర్ను రివల్యూషనరీ గార్డ్స్ యొక్క వాలీ-యే అమర్ స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ భద్రత కల్పిస్తోంది. ఖమెనీ సాధారణంగా టెహ్రాన్లోని "బీత్ రహ్బరీ" (లీడర్స్ హౌస్) అనే అత్యంత భద్రమైన సముదాయంలో నివసిస్తారు. ఆయన చాలా అరుదుగా బయటకు వస్తారు.
Jerusalem Post just published a story quoting some supporters of Khamenei, stating that their leader hasn't been seen publicly or made any appearances in nearly a week, a significant disappearance that needs to be closely watched,raises questions about current situation in Iran pic.twitter.com/gp1rz5WgIG
— Ahdeya Ahmed AlSayed (@AhdeyaAhmed) June 26, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను "అన్కండిషనల్ సరెండర్" చేయాలని డిమాండ్ చేశారు, అయితే ఖమెనీ హత్య ప్రతిపాదనను నిరాకరించారు. తర్వాత ఖమెనీ ఇరాన్ అణు స్థావరాలపై దాడులు పెద్దగా నష్టం కలిగించలేదని, ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఖమెనీ ఖతార్లోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడులను "గొప్ప విజయం"గా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ఖమెనీ రెండు సంవత్సరాల క్రితం తన వారసుడిని ఎంపిక చేయడానికి ఒక ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు, ఈ కమిటీ ఇప్పుడు తన ప్రణాళికలను వేగవంతం చేసింది.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, సుప్రీం లీడర్ మరణించినప్పుడు, 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది, ఈ ప్రక్రియ అత్యంత రహస్యంగా ఉంటుంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ ఉన్నత సైనిక నాయకత్వాన్ని దెబ్బతీశాయి, ఇందులో 11 మంది సీనియర్ జనరల్స్ , 14 మంది అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఆయన బయటకు కనిపించేవరకూ ఈ ఊహాగానాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.



















