అన్వేషించండి

Gift To Mp's: కొత్త పార్లమెంటులోకి వెళ్లనున్న వేళ ఎంపీలకు భారత రాజ్యాంగ ప్రతి

Gift To Mp's: కొత్త పార్లమెంటులోకి వెళ్లనున్న వేళ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కానుక ఇవ్వనుంది.

నూతన పార్లమెంటు భవనం సమావేశాలక సర్వం సిద్ధమైంది. ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు కొత్త భవనంలోనే జరగనున్నాయి. కాబట్టి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్లమెంటు సభ్యులు నూతన భవనంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక కానుక ఇవ్వనుంది. వారికి భారత రాజ్యాంగ ప్రతి, పాత పార్లమెంటు, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం అందించనుంది. వీటిని జనపనారతో చేసిన బ్యాగులో అమర్చి, ఆ బ్యాగులపై ఎంపీల పేర్లను కూడా ముద్రించారు. ఈ బహుమతులకు సంబంధించిన బ్యాగుల ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాటిపై నెటిజన్ల చర్చ జరుగుతోంది. 

ప్రధాని నరేంద్ర మోదీ పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనానికి వెళ్లేప్పుడు చేతిలో రాజ్యాంగ ప్రతితో వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధాని వెంట మిగతా ఎంపీలు వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఎంపీలు కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంలోని లోక్‌సభలో సమావేశం కానున్నారు. తర్వాత 2.15 గంటలకు రాజ్యసభ ఛాంబర్‌లో సమావేశం జరగనుంది. 

ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో జరిగాయి. ఈ సమావేశంలో మోదీతో పాటు ఇతర ఎంపీలు పాత పార్లమెంటు భవనంలో తమ ఆఖరి ఉపన్యాసాలను ఇచ్చారు. మోదీ ప్రత్యేకంగా పాత పార్లమెంటు భవనానికి సంబంధించిన 75ఏళ్ల చరిత్ర గురించి మాట్లాడారు. ఈ భవనంలో జరిగిన విజయాలు, అనుభవాలు, నేర్చుకున్న అంశాలు, జ్ఞాపకాల గురించి గుర్తుచేసుకున్నారు. 

ఈ సందర్భంగా మోదీ పండిట్‌ జవరహర్‌ లాల్‌ నెహ్రూను తలుచుకున్నారు. ఆయన చేసిన చరిత్రాత్మక ప్రసంగం దేశంలో ఎన్నికైన నేతలలో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, పార్టీలు ఏర్పడతాయి, విడిపోతాయి, కానీ దేశం అలాగే ఉండాలని అని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మాట్లాడిన పార్లమెంటు ఇదే అని చెప్పారు. పార్లమెంటు భవనంపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ.. దేశం ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. అలాగే ఇటీవల విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్, G20 ప్రెసిడెన్సీని మోదీ హైలెట్‌ చెస్తూ ప్రసంగించారు.  

కొత్త పార్లమెంటులో తొలి బిల్లుగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు లోక్‌ సభ, రాజ్య సభల్లో ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ దక్కుతుంది. లోక్‌సభ, రాష్ట్రాల్లోని శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీన్ని ఈ సమావేశాల్లో క్లియర్ చేసేందుకు బీజేపీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష కూటమి సహా ఎన్డీయే నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగ్గా, I.N.D.I.A. నాయకులే కాకుండా ఎన్డీయే నేతలు కూడా మద్దతుగా నిలిచారు. దీన్ని బట్టి ఈ బిల్లు పార్లమెంట్‌లో నెగ్గడం పెద్ద కష్టం కాదన్నది స్పష్టమైంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ravindra Kaushik: అసలైన ధురంధర్ రవీంద్ర కౌశిక్‌! నాటక రంగం నుంచి గూఢచారిగా మారిన బ్లాక్‌ టైగర్‌!
అసలైన ధురంధర్ రవీంద్ర కౌశిక్‌! నాటక రంగం నుంచి గూఢచారిగా మారిన బ్లాక్‌ టైగర్‌!
Raghav Chadha: మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 
మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 
Iran War Updates: ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
America stops attacks on Iran: ఇరాన్‌పై దాడులు నిలిపివేత - ట్రంప్ సంచలన నిర్ణయం - చర్చలు జరుగుతున్నట్లు ప్రకటన
ఇరాన్‌పై దాడులు నిలిపివేత - ట్రంప్ సంచలన నిర్ణయం - చర్చలు జరుగుతున్నట్లు ప్రకటన

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget