అన్వేషించండి

Money heist: రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !

Karnataka Money heist:మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన రూ. 400 కోట్ల నగదు చోరీ, దానికి సంబంధించిన కిడ్నాప్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అవన్నీ రద్దయిన రూ.2000 నోట్లు.

Rs 400 cr robbery :  రెండు కంటెయినర్లలో డబ్బులు కట్టలు రవాణా చేస్తూంటారు. మధ్యలో ఓ ముఠా ఆ నోట్లను దోపిడీ చేస్తారు. ఇలాంటివి సినిమాల్లో చూస్తాం. కానీ నిజంగా కూడా జరిగింది. అయితే ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఈ మొత్తం ఉదంతం 2025, అక్టోబర్ 16న ప్రారంభమైంది. కర్ణాటక నుండి గుజరాత్‌కు వెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కులు మహారాష్ట్ర-కర్ణాటక-గోవా సరిహద్దుల్లోని దట్టమైన చోర్లా ఘాట్ అడవుల్లో అదృశ్యమయ్యాయి. ఈ ట్రక్కుల్లో రద్దు చేసిన రూ. 2,000 నోట్లు సుమారు రూ. 400 కోట్ల విలువైనవి ఉన్నట్లు సమాచారం. ఆ నగదును వేరే కరెన్సీలోకి మార్చేందుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో సాయుధ ముఠా ఆ కంటైనర్లను హైజాక్ చేసి నగదును దోచుకుంది.   

ఈ భారీ దోపిడీ వెలుగులోకి రావడానికి ఒక కిడ్నాప్ కేసు కారణమైంది. ఇగత్‌పురికి చెందిన సందీప్ పాటిల్ అనే వ్యక్తిని కిషోర్ షేత్ అనే వ్యక్తి అనుచరులు తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. కంటైనర్ల చోరీకి సందీప్ పాటిల్ కారణమని ఆరోపిస్తూ, అతడిని నెల రోజులకు పైగా బంధించి, రూ. 400 కోట్లు చెల్లించాలని శారీరక, మానసిక హింసకు గురిచేశారు. అయితే, సందీప్ పాటిల్ వారి నుండి తప్పించుకుని నాసిక్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దోపిడీ వ్యవహారం బయటపడింది.

ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసింది. వీరిలో జయేష్ కడమ్, విశాల్ నాయుడు, సునీల్ ధుమాల్ వంటి వారు ఉన్నారు. విచారణలో భాగంగా థానేకు చెందిన ఒక బిల్డర్ , అహ్మదాబాద్‌కు చెందిన ఒక హవాలా ఆపరేటర్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ నగదును హవాలా మార్గాల ద్వారా మార్పిడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.            

ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక , గోవా పోలీసులు సమన్వయంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రద్దు చేసిన రూ. 2,000 నోట్లు ఇంత భారీ మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ఉధృతం చేస్తూనే, ఆ నగదును ఎక్కడికి తరలించారనే దానిపై క్లూస్ సేకరిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karnataka CM Resignation: కర్ణాటక నెక్ట్స్ సీఎం చాన్స్ కోసం ఖర్గే ప్రయత్నం - రేసులో శివకుమార్ ముందంజ - కర్ణాటకలో ఏం జరుగుతోందంటే ?
కర్ణాటక నెక్ట్స్ సీఎం చాన్స్ కోసం ఖర్గే ప్రయత్నం - రేసులో శివకుమార్ ముందంజ - కర్ణాటకలో ఏం జరుగుతోందంటే ?
Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
5 Rupee Fish Meal: బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget