అన్వేషించండి

Money heist: రెండు కంటెయినర్ల నిండా నోట్ల కట్టలు - అడవిలో లూఠీ చేసిన ముఠా - ఇది సినిమా కథ కాదు నిజం !

Karnataka Money heist:మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన రూ. 400 కోట్ల నగదు చోరీ, దానికి సంబంధించిన కిడ్నాప్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అవన్నీ రద్దయిన రూ.2000 నోట్లు.

Rs 400 cr robbery :  రెండు కంటెయినర్లలో డబ్బులు కట్టలు రవాణా చేస్తూంటారు. మధ్యలో ఓ ముఠా ఆ నోట్లను దోపిడీ చేస్తారు. ఇలాంటివి సినిమాల్లో చూస్తాం. కానీ నిజంగా కూడా జరిగింది. అయితే ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఈ మొత్తం ఉదంతం 2025, అక్టోబర్ 16న ప్రారంభమైంది. కర్ణాటక నుండి గుజరాత్‌కు వెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కులు మహారాష్ట్ర-కర్ణాటక-గోవా సరిహద్దుల్లోని దట్టమైన చోర్లా ఘాట్ అడవుల్లో అదృశ్యమయ్యాయి. ఈ ట్రక్కుల్లో రద్దు చేసిన రూ. 2,000 నోట్లు సుమారు రూ. 400 కోట్ల విలువైనవి ఉన్నట్లు సమాచారం. ఆ నగదును వేరే కరెన్సీలోకి మార్చేందుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో సాయుధ ముఠా ఆ కంటైనర్లను హైజాక్ చేసి నగదును దోచుకుంది.   

ఈ భారీ దోపిడీ వెలుగులోకి రావడానికి ఒక కిడ్నాప్ కేసు కారణమైంది. ఇగత్‌పురికి చెందిన సందీప్ పాటిల్ అనే వ్యక్తిని కిషోర్ షేత్ అనే వ్యక్తి అనుచరులు తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. కంటైనర్ల చోరీకి సందీప్ పాటిల్ కారణమని ఆరోపిస్తూ, అతడిని నెల రోజులకు పైగా బంధించి, రూ. 400 కోట్లు చెల్లించాలని శారీరక, మానసిక హింసకు గురిచేశారు. అయితే, సందీప్ పాటిల్ వారి నుండి తప్పించుకుని నాసిక్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దోపిడీ వ్యవహారం బయటపడింది.

ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసింది. వీరిలో జయేష్ కడమ్, విశాల్ నాయుడు, సునీల్ ధుమాల్ వంటి వారు ఉన్నారు. విచారణలో భాగంగా థానేకు చెందిన ఒక బిల్డర్ , అహ్మదాబాద్‌కు చెందిన ఒక హవాలా ఆపరేటర్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ నగదును హవాలా మార్గాల ద్వారా మార్పిడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.            

ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక , గోవా పోలీసులు సమన్వయంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రద్దు చేసిన రూ. 2,000 నోట్లు ఇంత భారీ మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ఉధృతం చేస్తూనే, ఆ నగదును ఎక్కడికి తరలించారనే దానిపై క్లూస్ సేకరిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Hero Xoom 125 VX vs ZX - ₹8,000 తేడాతో ఏ ఫీచర్లు మారాయి?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget