అన్వేషించండి

Rajasthan Congress Crisis: రాజస్థాన్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు రానున్నాయా? హైకమాండ్ ప్లాన్ ఏంటి?

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో భారీ మార్పులు రానున్నట్టు తెలుస్తోంది.

Rajasthan Congress Crisis:


పార్టీకి సర్జరీ చేస్తారా? 

రాజస్థాన్ రాజకీయాల్లో చిచ్చు ఆరడం లేదు. అశోక్ గహ్లౌట్‌పై నిరసన వ్యక్తం చేస్తూ ఇటీవల సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేశారు. దీనిపైనా అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నో నెలలుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది హైకమాండ్. కానీ అది సాఫీగా సాగడం లేదు. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఈ సవాలు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతోంది. అందుకే...పార్టీలో భారీ మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సుఖ్‌జింద్వర్ రంధ్వా...అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించీ ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా అంతర్గత విభేదాలతో మథన పడుతున్న రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చేసేందుకు ఈ సమావేశంలోనే  చర్చించినట్టు సమాచారం. ఎన్నికల ప్రణాళికకు సిద్ధమవాల్సిన సమయంలో ఇద్దరు కీలక నేతలు ఇలా విభేదాలతో దూరం అవడం సరికాదని భావిస్తోంది. అందుకే సంస్థాగతంగా కీలక మార్పులు చేయాలని చూస్తోంది. ఇప్పటికే పైలట్‌కు వార్నింగ్ ఇచ్చింది  హైకమాండ్. కానీ ఆయన మాత్రం ఈ హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే చాలా ఓపిక పట్టామని, ఇలా చేయడం సరికాదని చెబుతున్నా లెక్క చేయడం లేదు. 

కొత్త పార్టీ పెడతారా..? 

సొంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్న సచిన్‌ పైలట్ నిరాహార దీక్ష పూర్తి చేసుకున్నారు. ఇక తరవాత ఏం చేయనున్నారన్నదే ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానాని ఝలక్ ఇచ్చే పనిలో ఉన్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లడం ఈ ఆసక్తిని మరింత పెంచింది. అధిష్ఠానంతో స్పెషల్ మీటింగ్ ఉన్నట్టు సమాచారం. సీనియర్ నేతలతో సమావేశమవుతారన్న వార్తలు వినిపిస్తున్నా...దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ వివాదంపై పెద్దగా మాట్లాడటం లేదు. తమ ప్రభుత్వం అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ నిరాహార దీక్ష చేశారు పైలట్. ఇది హైకమాండ్‌ని అసహనానికి గురి చేస్తోంది. ఈ ఎపిసోడ్‌ మొత్తంలో సైలెంట్‌గా ఉన్న సీఎం అశోక్ గహ్లోట్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయి. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...నిరాహార దీక్ష చేసిన సమయంలో పైలట్ కాంగ్రెస్ పేరుని కానీ గుర్తుని కానీ వాడుకోలేదు. సింగిల్‌గా ఓ స్టేజ్‌పై కూర్చుని దీక్ష చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు పైలట్ పరోక్షంగా సంకేతాలిచ్చారా..? అన్న సందేహమూ కలుగుతోంది. పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోట్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజేపై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. మొత్తానికి ఇక్కడి రాజకీయాలు మలుపుల మీద మలుపులు తీసుకుంటున్నాయి. 

Also Read: Karnataka Election 2023: కర్ణాటక బీజేపీలో ఏం జరుగుతోంది? వరుస పెట్టి కీలక నేతల రాజీనామాలు

టాప్ హెడ్ లైన్స్

Simon Wall Broken: సీమోన్ అజేయమైన కోటకు బెల్జియం బీటలు.. 650 నిమిషాల రికార్డ్ క్లీన్ షీట్ బ్రేక్, అయినా సెమీస్ లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
సీమోన్ అజేయమైన కోటకు బెల్జియం బీటలు.. 650 నిమిషాల రికార్డ్ క్లీన్ షీట్ బ్రేక్, అయినా సెమీస్ లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
IND VS ENG 5th T20i Preview: శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న గండం.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న ముప్పు.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
Smriti Mandhana Historic Milestone:  స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Embed widget