అన్వేషించండి

PM Modi : మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ - ఆ దేశంలో 56 ఏళ్ల తర్వాత తొలి భారత ప్రైమ్ మినిస్టర్ పర్యటన

Modi : నవంబర్ 16 వతేదీ నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. గయానా దేశంలోనూ మోదీ పర్యటన ఉండనుంది. ఓ భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించి 56 ఏళ్లు అవుతోంది.

Prime Minister Modi will visit three countries from November 16: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  నవంబర్‌ 16 నుంచి 21 వరకూ మూడు దేశాల్లో పర్యటించనున్నారు.  నైజీరియా, బ్రెజిల్తో పాటు గయానా దేశాల్లో పర్యటిస్తారు.  నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్‌ టినుబు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్తున్నారు.    16 – 17 తేదీల్లో నైజీరియాలో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.  పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. నైజీరిలో భారతీయులు పలు రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపారాల్లోనూ ఉన్నారు. 

రియో డి జనీరోలో జీ 20 సమావేశానికి హాజరు కానున్న ప్రధాని మోదీ 

నైజీరియా పర్యటన తర్వాత బ్రెజిల్ వెళ్తారు. నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనీరో నగరంలో   జీ-20 సదస్సు జరుగుతుంది. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొంటారు. జీ 20 సదస్సును భారత్ గత ఏడాది ఘనంగా నిర్వహించింది. అప్పుడే ఈ ఏడాది నిర్వహించే అవకాశాన్ని బ్రెజిల్ కు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇచ్చారు.  బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో నిర్వహించే G20 సమ్మిట్‌ కు ప్రపంచ దేశాలకు చెందిన కీలక నేతలు హాజరవుతున్నారు.     

 

Also Read: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా ?

జీ 20 సమ్మిట్‌లో పలు దేశాలతో కీలక సమావేశాలు                             

జీ 20 సమ్మిట్ లో పలు దేశాలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ఇందు కోసం విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. జీ 20 సమావేశం తర్వాత రియో నుంచి ప్రధాని మోదీ గయానాకు వెళ్తారు.  తమ దేశంలో పర్యటించాలని గయానా అధ్యక్షుడు మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ  చాలా కాలంగా ఆహ్వానిస్తున్నారు. వెస్టిండీస్ దీవుల్లో ఒకటి అయిన గయానాలో భారత ప్రధానమంత్రి ఎవరూ గత యాభై ఆరు ఏళ్లలో పర్యటించలేదు. ప్రధాని మోదీ గయానా పార్లమెంట్‌లోనూ ప్రసంగిస్తారు.  భారతీయ ప్రవాసుల సమావేశంలోనూ మోదీ ప్రసంగిస్తారు.  రెండవ CARICOM-ఇండియా సమ్మిట్‌లో కూడా మోదీ పాల్గొంటారు. 

Also Read: గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్

ప్రధాని మోదీ ప్రపంచంతో భారత్ సంబంధాల మెరుగుదల కోసం నిరంతరం శ్రమిస్తూంటారు. ఆయన అనేక దేశాల్లో తరచూ పర్యటిస్తూంటారు. ఆయా దేశాల్లో ప్రవాస భారతీయులతో సమావేశం అవుతూ ఉంటారు. గయానా వంటి దేశాలకూ వెళ్తున్న ఆయన..  తన పదవీ కాలంలో భారత ప్రధానిగా అత్యధిక దేశాల్లో పర్యటించిన రికార్డు సృష్టించే అవకాశం ఉంది.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget