అన్వేషించండి

Prime Minister Modi: కాంగ్రెస్‌కు విజన్, ప్రణాళకలేమీ ఉండవు -రాజ్యసభలో మోదీ విమర్శలు

MODI: భారత్ మూడో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని మోదీ అన్నారు. రాజ్యసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.

Prime Minister Modi speech in Rajya Sabha:  ఇండియా బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థలు స్థాయి నుండి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశలో వేగంగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచ క్రమం మారుతోందని, ప్రస్తుతం ప్రపంచం భారతదేశం వైపు విశ్వబంధుగా చూస్తోందని స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం ఇచ్చారు. భారతదేశం ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా మారిందని నొక్కి చెప్పారు.

విజన్ లేని కాంగ్రెస్ 
 
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వద్ద ఎటువంటి ఆలోచనలు, విజన్ లేదా ప్రణాళికలు లేవని, ఆ పార్టీ గతంలో చేసిన తప్పులను సరిదిద్దడానికే తమ శక్తి అంతా ఖర్చవుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా యూపీఏ హయాంలో జరిగిన బ్యాంకింగ్ అవకతవకలను ప్రస్తావిస్తూ, అప్పట్లో  ఫోన్ బ్యాంకింగ్ సంస్కృతి ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చేలా చేశారని ఆరోపించారు. రవ్‌నీత్ బిట్టుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. సిక్కు కాబట్టే బిట్టును రాహుల్ అవమానించారని విమర్శించారు. 

సంస్కరణలు , వాణిజ్య ఒప్పందాలు 

రిఫార్మ్, పెర్ఫార్మ్,  ట్రాన్స్‌ఫార్మ్ అనే సూత్రంతో దేశం ప్రస్తుతం  రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఉందని ప్రధాని తెలిపారు. అమెరికా,  యూరోపియన్ యూనియన్ తో జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలను ఆయన ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశ స్థిరత్వానికి , భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. గతంలో రక్షణ ఒప్పందాలు అంటే  బోఫోర్స్ వంటి అవినీతి గుర్తొచ్చేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఎద్దేవా చేశారు.       

బెంగాల్ సర్కార్ పై విమర్శలు
 
పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు  గుప్పించారు. చొరబాటుదారులను రక్షించడానికి ఆ ప్రభుత్వం కోర్టులను ఆశ్రయిస్తోందని మోదీ ఆరోపించారు. ఈ చొరబాటుదారులు స్థానిక యువత ఉపాధిని, గిరిజనుల భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా చొరబాటుదారులను పంపివేస్తుంటే, ఇక్కడ మాత్రం వారిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రక్షిస్తున్నారని విమర్శించారు.

ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుండి వాకౌట్ చేశారు. అంతకుముందు లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా  సభకు హాజరు కాలేదు. మోదీపై దాడికి కాంగ్రెస్ సభ్యులు కుట్ర పన్నారని అందుకే తానే ప్రధాని మోదీని రావొద్దని సూచించానని స్పీకర్ బిర్లా తెలిపారు.             

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Israel Strike On Iran: ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Advertisement

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget