జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Jogulamba Range DIG LS Chauhan | అవినీతి, అక్రమాలు, దుష్ప్రవర్తన ఆరోపణలతో జోగులాంబ డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది ప్ర

హైదరాబాద్: జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయనపై వచ్చిన పలు అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వెంటనే జోగులాంబ డీఐజీ బాధ్యతల నుంచి తప్పిస్తూ, డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సర్వీసులో చేరినప్పటి నుంచీ పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఈ అధికారిపై ఇప్పటికే ఏసీబీ నిఘా కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. విధి నిర్వహణలో ప్రదర్శించే నోటి దురుసు, ఉన్నతాధికారులపై వ్యాఖ్యలు, కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల వంటి ప్రవర్తనతో ఆయన పోలీస్ శాఖలోనే తీవ్ర అసంతృప్తికి కారణమయ్యారు.

డీఐజీగా ఉన్న సమయంలో హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఎస్సైల బదిలీలు, పోస్టింగ్లలో భారీగా డబ్బులు వసూలు చేశారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతి సర్కిల్ నుంచి నెలనెలా పెద్ద ఎత్తున మామూళ్లు వసూలు చేయడంతో పాటు, తన పర్యటనల్లో ఖరీదైన విందులు, ఆరు రకాల మాంసాహార వంటకాలతో కూడిన ప్రత్యేక ఆతిథ్యం తప్పనిసరి చేశారని సమాచారం.
అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏకరాల కొద్దీ (దాదాపు 20 ఎకరాలు) భూములు కొనుగోలు చేశారని, తన పరిధికి మించి పదుల సంఖ్యలో వాహనాలు,సిబ్బందిని వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ పరిధిలోని కిందిస్థాయి పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read: Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
ట్రెండింగ్ వార్తలు






















