అన్వేషించండి

Presidential Election 2022: ద్రౌపది ముర్ము ఎంపికకు, గుజరాత్ ఎన్నికలకు లింక్ ఉందా? భాజపా అసలు ప్లాన్ ఏంటి?

గుజరాత్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ద్రౌపది ముర్ముని భాజపా రంగంలోకి దింపినట్టు రాజకీయంగా చర్చ నడుస్తోంది.

టార్గెట్ గుజరాత్..కేంద్రం వ్యూహమిదేనా..? 

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ప్రకటించినప్పటి నుంచి ఎవరీ వ్యక్తి..? భాజపా ఆమెనే ఎందుకు ఎంపిక చేసుకుంది అన్న ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అధిష్ఠానం ఎంతో వ్యూహాత్మకంగా ఆలోచించి ఆమెను బరిలో నిలిపిందని, విపక్షాలు ఆశలు గల్లంతవటం తప్పదని భాజపా వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఝార్ఖండ్ గవర్నర్‌గా పని చేసిన ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందిన వారు. 

మరో ఆసక్తికర అంశం ఏంటంటే..గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. 
గుజరాత్‌లో 15% గిరిజన జనాభా ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలోనే కాదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఝార్ఖండ్‌లోనూ గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ అన్ని రాష్ట్రాల్లోనూ కోటి మందికిపైగా గిరిజనులున్నారు. సాధారణజనాభాతో పోల్చి చూస్తే..అత్యధిక ఎస్‌టీ జనాభా ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్‌. అన్ని రాష్ట్రాల కన్నాఅత్యధికంగా ఛత్తీసగఢ్‌లో 31%,ఝార్ఖండ్‌లో 26%, ఒడిశాలో 23% గిరిజనులున్నారు. అయితే వీటన్నింటిలోనూ గుజరాత్‌పైనే ఎక్కువగా దృష్టి సారించింది కేంద్రం. ప్రధాని మోదీ సహా హోం మంత్రి అమిత్‌షా ఈ రాష్ట్రానికే చెందిన వారు కావటం వల్ల ప్రాధాన్యత పెరిగింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన వర్గాన్ని ఆకట్టుకునేందుకూ ద్రౌపది ముర్ముని బరిలోకి దింపినట్టు చర్చ జరుగుతోంది. గుజరాత్‌లో భాజపా ట్రాక్ రికార్డ్ చూస్తే ఎందుకంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. 2004లో 14 సీట్లు గెలుచుకున్న భాజపా, 47% ఓట్లు రాబట్టుకుంది. తరవాత 2009లో 15 సీట్లు సాధించి 46.5% ఓట్లు గెలుచుకుంది. 2014లో 26 సీట్లు, 2019లో 26 సీట్లు సాధించింది. 2019 నాటికి భాజపా ఓటు శాతం 63%కి పెరిగింది. 

image.png

ఎస్‌టీ నియోజకవర్గాల్లోనూ గట్టిగా నిలబడాలని..

ఓటు శాతం బాగానే ఉన్నా, గిరిజన నియోజకవర్గాల్లో మాత్రం వెనకబడుతూ వస్తోంది భాజపా. 2007, 2012, 2017 ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగింది. అందుకే ఈ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి తమ జెండా పాతాలని చూస్తోంది భాజపా. ఈశాన్య రాష్ట్రాల్లోనూ భాజపా బలం పెంచుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్‌ లాంటి రాష్ట్రాల్లో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ మద్దతు కూడగట్టవచ్చని ప్లాన్ చేసింది భాజపా.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
Embed widget