అన్వేషించండి

దేశ సంపదంతా ముస్లింలకే దోచి పెడతారు, ప్రతిపక్షాలపై ప్రధాని వ్యాఖ్యల దుమారం

PM Modi: ప్రతిపక్షాలు దేశ సంపదనంతా ముస్లింలకే దోచిపెడతాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

PM Modi Banswara Rally: రాజస్థాన్‌లోని బన్‌స్వరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. ముస్లింలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్‌పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. I.N.D.I.A కూటమిపై విమర్శలు చేసే క్రమంలో ప్రతిపక్ష నేతలు అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకే దోచిపెడతారని అన్నారు మోదీ. అంతే కాదు. ఆ నేతలకు అర్బన్ నక్సల్ మైండ్‌సెట్ అంటూ తీవ్రంగా విమర్శించారు. మంగళసూత్రాలను కూడా వదలకుండా దోచుకుంటారని, వాళ్లు ఆ స్థాయికి దిగజారిపోతారని అన్నారు. ఒకప్పుడు మన్మోహన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ దేశ ఆస్తులపై ముస్లింలకే ప్రాథమిక హక్కు ఉందని కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తు చేశారు. దీనిపైనే కూటమి మండి పడుతోంది. అసలు సమస్యల్ని పక్కదోవ పట్టించి అనవసరమైన వ్యాఖ్యలు చేయడమేంటని అసహనం వ్యక్తం చేస్తోంది. 

"ప్రతిపక్ష కూటమి నేతల తీరు ఎలాంటిది అంటే వాళ్లు మన తల్లుల, చెల్లెళ్ల మంగళసూత్రాలు కూడా వదలకుండా దోచుకుంటారు. ఆ స్థాయికి దిగజారిపోగలరు. బంగారం ఎంతుందో లెక్కించి దాన్ని అందరికీ పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఆ బంగారాన్ని ఎవరికి దోచి పెడతారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశ ఆస్తులపై ముస్లింలకే ప్రాథమిక హక్కు ఉందని కాంగ్రెస్ చెప్పింది. అంటే వాళ్లు ఎవరికి ఆస్తులన్నీ పంచి పెడతారో అర్థమవుతోందిగా. ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకే ఇవన్నీ దోచి పెడతారు. ఆ చొరబాటుదారులకు దేశ ఆస్తుల్ని దోచి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా"

- ప్రధాని మోదీ 

 

ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. మొదటి విడత ఓటింగ్‌లోనే బీజేపీకి వ్యతిరేక ఓట్లు పడ్డాయని అర్థమైందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఊహించని స్పందన వస్తోందని తేల్చి చెప్పారు.

AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు. ముస్లింలను చొరబాటుదారులు అనడంపై మండి పడ్డారు. 2002 నుంచి ఇప్పటి వరకూ బీజేపీ అజెండా ముస్లింలను వేధించడమే అని విమర్శించారు. దేశ సంపదనంతా స్నేహితులకు దోచి పెడుతున్న మోదీ దేశ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. హిందువులు ముస్లింలను భయపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. X వేదికగా వరుస పోస్ట్‌లు పెట్టారు అసదుద్దీన్. 

 

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Japan Illegal Mosque Inauguration: జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!
జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget