అన్వేషించండి

దేశ సంపదంతా ముస్లింలకే దోచి పెడతారు, ప్రతిపక్షాలపై ప్రధాని వ్యాఖ్యల దుమారం

PM Modi: ప్రతిపక్షాలు దేశ సంపదనంతా ముస్లింలకే దోచిపెడతాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

PM Modi Banswara Rally: రాజస్థాన్‌లోని బన్‌స్వరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. ముస్లింలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్‌పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. I.N.D.I.A కూటమిపై విమర్శలు చేసే క్రమంలో ప్రతిపక్ష నేతలు అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకే దోచిపెడతారని అన్నారు మోదీ. అంతే కాదు. ఆ నేతలకు అర్బన్ నక్సల్ మైండ్‌సెట్ అంటూ తీవ్రంగా విమర్శించారు. మంగళసూత్రాలను కూడా వదలకుండా దోచుకుంటారని, వాళ్లు ఆ స్థాయికి దిగజారిపోతారని అన్నారు. ఒకప్పుడు మన్మోహన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ దేశ ఆస్తులపై ముస్లింలకే ప్రాథమిక హక్కు ఉందని కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తు చేశారు. దీనిపైనే కూటమి మండి పడుతోంది. అసలు సమస్యల్ని పక్కదోవ పట్టించి అనవసరమైన వ్యాఖ్యలు చేయడమేంటని అసహనం వ్యక్తం చేస్తోంది. 

"ప్రతిపక్ష కూటమి నేతల తీరు ఎలాంటిది అంటే వాళ్లు మన తల్లుల, చెల్లెళ్ల మంగళసూత్రాలు కూడా వదలకుండా దోచుకుంటారు. ఆ స్థాయికి దిగజారిపోగలరు. బంగారం ఎంతుందో లెక్కించి దాన్ని అందరికీ పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఆ బంగారాన్ని ఎవరికి దోచి పెడతారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశ ఆస్తులపై ముస్లింలకే ప్రాథమిక హక్కు ఉందని కాంగ్రెస్ చెప్పింది. అంటే వాళ్లు ఎవరికి ఆస్తులన్నీ పంచి పెడతారో అర్థమవుతోందిగా. ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకే ఇవన్నీ దోచి పెడతారు. ఆ చొరబాటుదారులకు దేశ ఆస్తుల్ని దోచి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా"

- ప్రధాని మోదీ 

 

ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. మొదటి విడత ఓటింగ్‌లోనే బీజేపీకి వ్యతిరేక ఓట్లు పడ్డాయని అర్థమైందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఊహించని స్పందన వస్తోందని తేల్చి చెప్పారు.

AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు. ముస్లింలను చొరబాటుదారులు అనడంపై మండి పడ్డారు. 2002 నుంచి ఇప్పటి వరకూ బీజేపీ అజెండా ముస్లింలను వేధించడమే అని విమర్శించారు. దేశ సంపదనంతా స్నేహితులకు దోచి పెడుతున్న మోదీ దేశ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. హిందువులు ముస్లింలను భయపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. X వేదికగా వరుస పోస్ట్‌లు పెట్టారు అసదుద్దీన్. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget