అన్వేషించండి

PM Modi Security Breach: ప్రధాని భద్రతా లోపాలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు.. 3 రోజుల్లో నివేదిక

ఫిరోజ్‌పుర్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ఎదురైన భద్రతా లోపాలపై దర్యాప్తు చేసి నివేదికను సమర్పించేందుకు పంజాబ్ సర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్‌పుర్‌ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ABP న్యూస్ సమాచారం మేరకు ఈ కమిటీ మూడు రోజుల్లోనే తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

ఈ కమిటీలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిటైర్డ్ జస్టిస్ మెహ్‌తబ్ సింగ్ గిల్, జస్టిస్ అనురాగ్ వర్మ సభ్యులుగా ఉన్నారు.

సుప్రీం కోర్టు..

ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ వేశారు సీనియర్​ అడ్వకేట్​ మనిందర్​ సింగ్​. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పిటిషన్​ కాపీలను కేంద్రంతో పాటు పంజాబ్​ ప్రభుత్వాలకు గురువారమే పంపించాలని న్యాయవాదికి సూచించింది సుప్రీం కోర్టు. పిటిషన్​పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఏం జరిగింది?

పంజాబ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు భఠిండా విమానాశ్రయానికి బుధవారం ఉదయం మోదీ చేరుకున్నారు. అక్కడి నుంచి హుస్సేనీవాలాలోని స్వాతంత్య్ర సమర యోధుల స్మారకం వద్ద నివాళి అర్పించేందుకు హెలికాప్టర్​లో వెళ్లాలనుకున్నారు. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల 20 నిమిషాలపాటు మోదీ ఎదురు చూడాల్సి వచ్చింది.

పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల రోడ్డు మార్గంలో మోదీ కాన్వాయ్​ బయలుదేరింది. గమ్యస్థానానికి మరో 30 కిలోమీటర్ల దూరం ఉండగా ఆయన కాన్వాయ్​ను ఫ్లైఓవర్​పై కొంతమమంది నిరసనకారులు అడ్డుకున్నారు. ఫ్లైఓవర్​పై 15 నుంచి 20 నిమిషాలపాటు మోదీ కాన్వాయ్​ ఉండిపోయింది. ఇది భద్రతాపరమైన సమస్యలకు కారణమైంది. దీంతో ప్రధాని మోదీ తిరిగి భఠిండా విమానాశ్రయానికి వెళ్లారు. అటు నుంచి దిల్లీకి పయనమయ్యారు.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అయితే భద్రతా వైఫల్యాల వల్లే ప్రధాని పర్యటన రద్దయిందనే వాదనను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. అసలు ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తున్నారనే సమాచారమే తమకు అందలేదన్నారు. ప్రధాని పర్యటన రద్దు కావడంపై చింతిస్తున్నామన్నారు.

Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP and Telangana Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
Home Minister Anita: డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో భారీగా నామినేషన్లు- పోటీ మాత్రం ముగ్గురు మధ్యే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో భారీగా నామినేషన్లు- పోటీ మాత్రం ముగ్గురు మధ్యే!
8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకారం HRA, ప్రాథమిక వేతనంలో ఎంత పెరుగుదల ఉండవచ్చు?
8వ వేతన సంఘం ప్రకారం HRA, ప్రాథమిక వేతనంలో ఎంత పెరుగుదల ఉండవచ్చు?
Advertisement

వీడియోలు

6 Ball Over Behind Story | 6 బాల్ ఓవర్ కోసం ఇంగ్లండ్-ఆసీస్ మధ్య దశాబ్దాల ఫైట్‌ జరిగిందా? | ABP Desam
గంభీర్-గిల్ వల్లే అంతా! ఇలా అయితే సిరీస్ కూడా కష్టమే!
స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ సింగ్.. ఇద్దరికీ ఎంత తేడా?
ఇండియా మ్యాచ్.. రూ.60కే టికెట్
గంభీర్ వల్లే టీమిండియా ఓడింది: అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP and Telangana Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
Home Minister Anita: డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో భారీగా నామినేషన్లు- పోటీ మాత్రం ముగ్గురు మధ్యే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో భారీగా నామినేషన్లు- పోటీ మాత్రం ముగ్గురు మధ్యే!
8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకారం HRA, ప్రాథమిక వేతనంలో ఎంత పెరుగుదల ఉండవచ్చు?
8వ వేతన సంఘం ప్రకారం HRA, ప్రాథమిక వేతనంలో ఎంత పెరుగుదల ఉండవచ్చు?
Case On  Ola CEO: జీతాలు, అలవెన్స్‌ల చెల్లింపుల్లో వేధింపులు -  ఇంజినీర్ ఆత్మహత్య - ఓలా సీఈవోపై కేసు
జీతాలు, అలవెన్స్‌ల చెల్లింపుల్లో వేధింపులు - ఇంజినీర్ ఆత్మహత్య - ఓలా సీఈవోపై కేసు
Nizamabad Riyaz Encounter News: నిజామాబాద్‌లో ఊహించినట్లే జరిగిందా? ఇజ్జత్ కోసమే రియాజ్‌ను లేపేశారా? మానవ హక్కుల సంఘానికి ఏం చెబుతారు?
నిజామాబాద్‌లో ఊహించినట్లే జరిగిందా? ఇజ్జత్ కోసమే రియాజ్‌ను లేపేశారా? మానవ హక్కుల సంఘానికి ఏం చెబుతారు?
Crime News: భార్యతో తండ్రి అక్రమ సంబంధం - కుమారుడి మృతి- తండ్రి ఎవరో కాదు..మాజీ డీజీపీ !
భార్యతో తండ్రి అక్రమ సంబంధం - కుమారుడి మృతి- తండ్రి ఎవరో కాదు..మాజీ డీజీపీ !
Bhimavaram DSP: డీఎస్సీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్ - జనసేనకు క్లోజే - మరేం జరిగింది ?
డీఎస్సీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్ - జనసేనకు క్లోజే - మరేం జరిగింది ?
Embed widget