అన్వేషించండి

PM Modi Security Breach: ప్రధాని భద్రతా లోపాలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు.. 3 రోజుల్లో నివేదిక

ఫిరోజ్‌పుర్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ఎదురైన భద్రతా లోపాలపై దర్యాప్తు చేసి నివేదికను సమర్పించేందుకు పంజాబ్ సర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్‌పుర్‌ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ABP న్యూస్ సమాచారం మేరకు ఈ కమిటీ మూడు రోజుల్లోనే తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

ఈ కమిటీలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిటైర్డ్ జస్టిస్ మెహ్‌తబ్ సింగ్ గిల్, జస్టిస్ అనురాగ్ వర్మ సభ్యులుగా ఉన్నారు.

సుప్రీం కోర్టు..

ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ వేశారు సీనియర్​ అడ్వకేట్​ మనిందర్​ సింగ్​. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పిటిషన్​ కాపీలను కేంద్రంతో పాటు పంజాబ్​ ప్రభుత్వాలకు గురువారమే పంపించాలని న్యాయవాదికి సూచించింది సుప్రీం కోర్టు. పిటిషన్​పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఏం జరిగింది?

పంజాబ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు భఠిండా విమానాశ్రయానికి బుధవారం ఉదయం మోదీ చేరుకున్నారు. అక్కడి నుంచి హుస్సేనీవాలాలోని స్వాతంత్య్ర సమర యోధుల స్మారకం వద్ద నివాళి అర్పించేందుకు హెలికాప్టర్​లో వెళ్లాలనుకున్నారు. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల 20 నిమిషాలపాటు మోదీ ఎదురు చూడాల్సి వచ్చింది.

పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల రోడ్డు మార్గంలో మోదీ కాన్వాయ్​ బయలుదేరింది. గమ్యస్థానానికి మరో 30 కిలోమీటర్ల దూరం ఉండగా ఆయన కాన్వాయ్​ను ఫ్లైఓవర్​పై కొంతమమంది నిరసనకారులు అడ్డుకున్నారు. ఫ్లైఓవర్​పై 15 నుంచి 20 నిమిషాలపాటు మోదీ కాన్వాయ్​ ఉండిపోయింది. ఇది భద్రతాపరమైన సమస్యలకు కారణమైంది. దీంతో ప్రధాని మోదీ తిరిగి భఠిండా విమానాశ్రయానికి వెళ్లారు. అటు నుంచి దిల్లీకి పయనమయ్యారు.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అయితే భద్రతా వైఫల్యాల వల్లే ప్రధాని పర్యటన రద్దయిందనే వాదనను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. అసలు ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తున్నారనే సమాచారమే తమకు అందలేదన్నారు. ప్రధాని పర్యటన రద్దు కావడంపై చింతిస్తున్నామన్నారు.

Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రెటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రెటీలు ఇక సేఫ్..!
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
TTD Board Decisions : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రెటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రెటీలు ఇక సేఫ్..!
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
TTD Board Decisions : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
NTR: జపాన్‌లో ఎన్టీఆర్ సందడి - అభిమానితో 'దేవర' స్టెప్పులు, మాస్ జాతర మామూలుగా లేదంతే..!
జపాన్‌లో ఎన్టీఆర్ సందడి - అభిమానితో 'దేవర' స్టెప్పులు, మాస్ జాతర మామూలుగా లేదంతే..!
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
Viral News: సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి కోట్లు సంపాదించాడు కానీ భార్య చేతిలో నలిగిపోతున్న ప్రసన్న - ఇలాంటి భార్యలుంటారా?
సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి కోట్లు సంపాదించాడు కానీ భార్య చేతిలో నలిగిపోతున్న ప్రసన్న - ఇలాంటి భార్యలుంటారా?
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
Embed widget