అన్వేషించండి

PM Modi on Operation Sindoor: దాడులు ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు - పాక్ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ - లోక్‌సభలో ప్రధాని మోదీ సమాధానం

PM Modi in Loksabha: పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు ఏ దేశం ఒత్తిడి తేలేదని మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు.

PM Modi Fires On Congress: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టాం.. ఆ దేశాన్ని కోలుకోకుండా చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కాల్పులు ఆపాలని  ఏ దేశమూ చెప్పలేదన్నారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.  పాకిస్థాన్‌కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇవ్వడం దురదృష్టకరం.. ఉగ్రవాదులను హతమార్చడానికి వారాలు, తేదీలు చూడాలా అని మండిపడ్డారు.  సాయుధ దళాలకు స్వేచ్ఛా హస్తం ఇచ్చాం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకోవాలని వారికి స్పష్టం చేశాం.. ఉగ్రవాదులను శిక్షించడం పట్ల మేం గర్విస్తున్నామన్నారు.  పహల్గామ్ దాడి సూత్రధారులు ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడిపే విధంగా శిక్షకు గురయ్యారన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పహల్గాంలో పర్యాటకులపై దాడి చేశారు.. మతం అడిగి మరీ హత్య చేశారు.. పహల్గాం దాడి జరిగిన మూడు రోజులకే కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టిందని మండిపడ్డారు. 

సాయుధ దళాలు  పహల్గామ్ దాడి కి కేవలం 22 నిమిషాల్లో ప్రతీకారం తీసుకున్నాయని..  ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం వేగంగా, ఖచ్చితమైన దాడులతో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ రోజు   పాకిస్థాన్  వైమానిక స్థావరాలు ICUలో ఉన్నాయి. భారత సైన్యం పాకిస్థాన్‌లోని బహావల్పూర్, మురిద్కే వంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, ఆ దేశ రక్షణ సామర్థ్యాలను దెబ్బతీసిందని మోదీ వెల్లడించారు.  ఈ రోజు పాకిస్థాన్ ఉగ్రవాదులకు తెలుసు, వారు మాపై దాడి చేస్తే, భారత్ వారిని వెంబడిస్తుందన్నారు.  

 పాకిస్థాన్‌పై సిందూర్ నుంచి సింధు వరకు చర్యలు తీసుకున్నామన్నారు.   భారత్  స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్థాన్ ఆయుధాలను బహిర్గతం చేసిందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ యొక్క స్వదేశీ రక్షణ సాంకేతికత యొ శక్తిని ఆయన హైలైట్ చేశారు, ఇది ఆత్మనిర్భర్ భారత్ యొక్క సామర్థ్యాన్ని చాటిందని ప్రకటించారు.  "ఏ ప్రపంచ నాయకుడూ భారత్‌ను యుద్ధాన్ని ఆపమని కోరలేదు."  అని మోదీ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఎటువంటి బాహ్య ఒత్తిడికి లోనవలేదని, స్వతంత్రంగా చర్యలు తీసుకుందని మోదీ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందాన్ని కుదిర్చారని, దాన్ని వాణిజ్య చర్చలతో ముడిపెట్టారని వస్తున్న వాదనలకు మోదీ చెక్ పెట్టారు. 

"కాంగ్రెస్ పాకిస్థాన్ నుంచి సమస్యలను దిగుమతి చేసుకుంటోంది." అని రాహుల్ గాంధీ ఆరోపణలకు స్పందిస్తూ మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడి చేయడానికి రాజకీయ ఇష్టం లేనిదని, పాకిస్థాన్ ప్రభావంలో రాజకీయంగా సంబంధం కలిగి ఉందని మోదీ ఆరోపించారు.  పాకిస్థాన్ ఆరోపణలను కాంగ్రెస్ నమ్ముతోందని, దాని రిమోట్ కంట్రోల్‌లో ఉందని ఆయన విమర్శించారు.
 "మేము కాంగ్రెస్   'అమన్ కి ఆశా'  ఒకే దారిలో ఉన్న ట్రాఫిక్‌ను మూసివేశాము." గతంలో కాంగ్రెస్ పాకిస్థాన్‌తో స్నేహపూర్వక విధానాన్ని అనుసరించిందని, కానీ ఇప్పుడు భారత్ ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇస్తోందని ఆయన అన్నారు.

ఆపరేషన్ సిందూర్ మా ప్రభుత్వం భారత సాయుధ దళాలను ఎలా బలోపేతం చేసిందో ఉదాహరణ అని మోదీ అన్నారు. ఈ ఆపరేషన్‌లో సైన్యం, నౌకాదళం, వైమానిక దళం   సమన్వయం పాకిస్థాన్‌ను  కుదిపేసిందన్నారు.  మే 6-7 రాత్రి జరిగిన ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాకిస్థాన్ ,  పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, 100 మంది ఉగ్రవాదులను హతమార్చిందని గుర్తు చేశారు.   మోదీ తన ప్రసంగంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, దాడుల స్థానాలను నిర్ణయించడంలో సైన్యానికి స్వతంత్ర్యం ఉందని పేర్కొన్నారు. "భారత సైన్యం ఇంతకు ముందెన్నడూ చేరని స్థానాలకు చేరుకుంది, బహావల్పూర్, మురిద్కేలో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది," అని ఆయన అన్నారు. 
 
 పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ భారత్ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని ఊహించిందని, కానీ భారత్  వేగవంతమైన, ఖచ్చితమైన దాడులు అంచనా వేయలేకపోయిందన్నారు.   మే 8, 9, 10 తేదీలలో పాకిస్థాన్ భారత సైనిక స్థావరాలపై దాడులు చేయడానికి ప్రయత్నించింది, కానీ అవి విఫలమయ్యాయి.  మే 10 నాటికి, దౌత్యపరమైన ఒత్తిడి , భారీ నష్టాల మధ్య, పాకిస్థాన్ యుద్ధాన్ని నిలిపివేయాలని సంకేతాలు ఇచ్చింది. భారత్, అధికారిక సైనిక ఛానల్ (DGMO) ద్వారా అభ్యర్థన రావాలని పట్టుబట్టింది, ఆ విధంగానే అభ్యర్థన వచ్చిన తర్వాతనే భారత్ తదుపరి చర్యలు తీసుకుంది. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రభుత్వం పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడి చేయడానికి రాజకీయ ఇష్టం లేకపోవడం వల్ల సైన్యం చేతులు కట్టివేసినట్లయిదన్న విమర్శలపైనా స్పందించారు.  కాంగ్రెస్ పాకిస్థాన్ ఆరోపణలను నమ్ముతూ భారత్ పై అపనమ్మకం చూపడమేమిటన్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Israel Strike On Iran: ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget