అన్వేషించండి

Loksabha Rahul Speech: ఇందిరకున్న ధైర్యంలో సగం కూడా మోదీకి లేదు - ఉంటే ట్రంప్ ప్రకటనలు ఖండించండి - లోక్ సభలో రాహుల్ సవాల్

Rahul Gandhi : ఆపరేషన్ సిందూర్ పై చర్చలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై కీలకమైన ప్రశ్నలు సంధించారు. ట్రంప్ ప్రకటనలను ఖండించాలని డిమాండ్ చేశారు.

Rahul Gandhi Speech in the Lok Sabha on Operation Sindoor: యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పినవన్నీ అబద్దాలేనని ప్రధాని మోదీ లోక్ సభలో ప్రకటించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను సవాల్ చేశారు. ఆపరేషన్ సిందూర్ పై చర్చలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.  ట్రంప్ 26 సార్లు భారత్-పాకిస్థాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన వాణిజ్య ఒత్తిడి ద్వారా శాంతి ఒప్పందం కుదిరిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఈ వాదనను ఖండిస్తూ, ప్రధాని మోదీ లోక్‌సభలో నిలబడి "ట్రంప్ అబద్ధాలు చెప్పాడు, మేము ఎటువంటి విమానాలు కోల్పోలేదు" అని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు   శాంతి ఒప్పందం ప్రకటన భారత్ నుంచి కాకుండా ట్రంప్ నుంచి రావడం దౌత్యపరమైన వైఫల్యమని ఆయన విమర్శించారు. 

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం విమానాలను కోల్పోయిందని ఆరోపించారు. ఈ నష్టం రాజకీయ నాయకత్వం విధించిన పరిమితుల వల్ల జరిగిందన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ సైనిక స్థావరాలు లేదా వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడి చేయవద్దని ఆదేశించడం వల్ల  భారత్ జెట్ ఫైటర్లను కోల్పోయిందన్నారు.  "విమానాలు కోల్పోయాయి ఎందుకంటే రాజకీయ నాయకత్వం సైనిక స్థావరాలు మరియు రక్షణ వ్యవస్థపై దాడి చేయవద్దని పరిమితులు విధించింది," అని ఆయన  రాహుల్ గాంధీ ఆరోపించారు.  భారత సైన్యం సమర్థవంతంగా విధులు నిర్వహించాలంటే  100 శాతం రాజకీయ ప్రమేయం లేకుండా  పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ అవసరమన్నారు.   

ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రభుత్వం పైలట్‌లకు పాకిస్థాన్   వైమానిక రక్షణ వ్యవస్థ (Air Defence System)పై దాడి చేయవద్దని ఆదేశించిందని, దీనివల్ల వారి చేతులు కట్టివేసినట్లయిందన్నారు. పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడి చేయవద్దు, వెళ్లి దాడి చేయండి కానీ వారి రక్షణ వ్యవస్థను ఎదుర్కోండని చెప్పారన్నారు.  ఆపరేషన్ సిందూర్ ప్రారంభంలోనే భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చిందని, ఇది ఒక "నేరం" అని ఆరోపించారు. ఆపరేషన్ ప్రారంభంలో భారత్ పాకిస్థాన్‌కు సందేశం పంపి, తాము ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలపై దాడి చేయమని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారని గుర్తు చేశారు. 

"మీరు పాకిస్థాన్‌కు చెప్పారు, మేము మీ సైనిక స్థావరాలపై దాడి చేయము, ఇది మీ బలహీనతను చూపించింది," అని  రాహుల్ మండిపడ్డారు.   ఆపరేషన్ సిందూర్ 1:05 AMకి ప్రారంభమై, 22 నిమిషాలు కొనసాగిందని, 1:35 AM నాటికి భారత DGMO పాకిస్థాన్‌కు సందేశం పంపి, యుద్ధాన్ని విస్తరించకూడదని చెప్పిందని రాహుల్ ఆరోపించారు. ఇది "30 నిమిషాల్లో లొంగిపోవడం" అని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్‌కు మద్దతు తెలిపారు.  ఆయన ఎటువంటి వ్యూహాత్మక తప్పు చేయలేదని, తప్పు రాజకీయ నాయకత్వం చేసిందని అన్నారు.  వైమానిక దళాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిందించరాదని, వారు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించారని ఆయన స్పష్టం చేశారు. 

రాహుల్ గాంధీ ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి సమయంలో భద్రతా వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయకపోవడం, హై అలర్ట్‌లో ఉన్నప్పటికీ సాధారణ భద్రతా ప్రోటోకాల్‌లను పాటించకపోవడంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.  ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన వెంటనే  ప్రతిపక్షం భారత సైన్యం,  ఎన్నికైన ప్రభుత్వానికి మద్దతుగా  నిలబడిందని రాహుల్ పేర్కొన్నారు  కొందరు నాయకుల నుంచి వ్యంగ్య వ్యాఖ్యలు వచ్చినప్పటికీ, ప్రతిపక్షం ఏమీ మాట్లాడలేదని, జాతీయ ఆసక్తుల కోసం ఐక్యంగా నిలబడిందని ఆయన స్పష్టం చేశారు. 

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ చైనాతో కూడా ఎదుర్కొందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్‌ చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ రాహుల్ వ్యాఖ్యానించారు.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో చైనాను ఎందుకు ప్రస్తావించలేదని, చైనా పాకిస్థాన్‌కు ఎంత మద్దతు ఇచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.  1971 యుద్ధంలో ఇందిరా గాంధీ జనరల్ సామ్ మానెక్‌షా‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అమెరికా యుద్ధ నౌకలు రాష్ట్రంలోకి వచ్చినప్పుడు కూడా ఆమె ధైర్యంగా నిలబడ్డారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ఇందిరా గాంధీ సగం ధైర్యం ఉన్నా, లోక్‌సభలో నిలబడి ట్రంప్ వాదనలను ఖండించాలని సవాల్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Gemini and ChatGPT Pro Plans Free: ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Embed widget