అన్వేషించండి

Amit Shah In Lok Sabha: ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం, వారిది పాకిస్తానే: అమిత్ షా

అమిత్ షా: బైసారన్ దాడికి పాల్పడిన ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు సులేమాన్, అఫ్ఘాన్, జిబ్రాన్లను ఆపరేషన్ మహాదేవ్ లో మట్టుబెట్టారు. శ్రీనగర్ లో వారి మృతదేహాలను గుర్తించారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాదులు ముగ్గురిని భారత ఆర్మీ హతం చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు జరుగుతున్న ప్రత్యేక చర్చలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాం అన్నారు. పహల్గాంలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఈ నెల 22న శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ద్వారా పహల్గాం ఉగ్రవాదుల ఆచూకీ తెలిసింది. ఆపరేషన్ మహదేవ్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుపెట్టిందని వివరించారు.

వాళ్లు పాకిస్తాన్ ఉగ్రవాదులే.. అమిత్ షా

"జమ్మూకాశ్మీర్ శ్రీనగర్‌లో చేపట్టిన ఆపరేషన్ మహదేవ్‌లో భాగంగా జరిగిన ఎన్ కౌంటర్‌లో సులేమాన్, అఫ్ఘాన్, జిబ్రన్ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరికి ఆహారం సరఫరా చేసిన వారిని, ఆశ్రయం కల్పించిన వారిని ముందే అదుపులోకి తీసుకున్నాం. ఈ ఉగ్రవాదుల మృతదేహాలను శ్రీనగర్‌కు తీసుకువచ్చిన తరువాత స్వాధీనం చేసుకున్నాం. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిందే ఆపరేషన్ మహదేవ్’ అని షా సభలో వెల్లడించారు. నిందితుల వద్ద పాకిస్తాన్ చాక్లెట్లు లభించాయని, వారిది పాకిస్తానే అని స్పష్టం చేశారు.

పాక్ డీజీఎంకు సమాచారం ఇచ్చాం..

"ఆపరేషన్ సిందూర్ తర్వాత, మా DGMO పాక్ డిజిఎంఓకు సమాచారం అందించింది. భారతదేశం ఆత్మరక్షణలో భాగంగా వారి భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిందని తెలిపాం. మే 7న రాత్రి అర్ధరాత్రి 1.04 నుంచి 1.24 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ జరిగింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత బలగాలు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేశాయి. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులు వచ్చి మమ్మల్ని చంపిన తర్వాత ఏ చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారతదేశాన్ని రక్తసిక్తం చేసిన ఉగ్రవాదులను మోదీ హయాంలో మేం హతం చేశాం. పాక్ లోకి వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అమిత్ షా

అంతకుముందు అమిత్ షా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆపరేషన్ మహదేవ్ గురించి వివరించారు. "ఆపరేషన్ మహాదేవ్ సులేమాన్ అలియాస్ ఫైజల్, అఫ్ఘాన్, జిబ్రన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో మట్టుపెట్టారు. సులేమాన్ లష్కరే తోయిబాకు చెందిన ఎ-కేటగిరీ కమాండర్. అఫ్ఘాన్, జిబ్రన్‌లు సైతం లష్కరే తోయిబాకు చెందిన ఎ-కేటగిరీకి చెందిన ఉగ్రవాదులు. బైసరన్ లోయ పహల్గాంలో కాల్పులు జరిపి అమాయక పౌరులను హతమార్చిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు" అని ఆయన పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Bigg Boss Telugu Day 87 Promo : టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
Crime News: ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు.. ఇంత దారుణమా!
ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు..
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Embed widget