అన్వేషించండి

Amit Shah In Lok Sabha: ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం, వారిది పాకిస్తానే: అమిత్ షా

అమిత్ షా: బైసారన్ దాడికి పాల్పడిన ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు సులేమాన్, అఫ్ఘాన్, జిబ్రాన్లను ఆపరేషన్ మహాదేవ్ లో మట్టుబెట్టారు. శ్రీనగర్ లో వారి మృతదేహాలను గుర్తించారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాదులు ముగ్గురిని భారత ఆర్మీ హతం చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు జరుగుతున్న ప్రత్యేక చర్చలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాం అన్నారు. పహల్గాంలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఈ నెల 22న శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ద్వారా పహల్గాం ఉగ్రవాదుల ఆచూకీ తెలిసింది. ఆపరేషన్ మహదేవ్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుపెట్టిందని వివరించారు.

వాళ్లు పాకిస్తాన్ ఉగ్రవాదులే.. అమిత్ షా

"జమ్మూకాశ్మీర్ శ్రీనగర్‌లో చేపట్టిన ఆపరేషన్ మహదేవ్‌లో భాగంగా జరిగిన ఎన్ కౌంటర్‌లో సులేమాన్, అఫ్ఘాన్, జిబ్రన్ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరికి ఆహారం సరఫరా చేసిన వారిని, ఆశ్రయం కల్పించిన వారిని ముందే అదుపులోకి తీసుకున్నాం. ఈ ఉగ్రవాదుల మృతదేహాలను శ్రీనగర్‌కు తీసుకువచ్చిన తరువాత స్వాధీనం చేసుకున్నాం. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిందే ఆపరేషన్ మహదేవ్’ అని షా సభలో వెల్లడించారు. నిందితుల వద్ద పాకిస్తాన్ చాక్లెట్లు లభించాయని, వారిది పాకిస్తానే అని స్పష్టం చేశారు.

పాక్ డీజీఎంకు సమాచారం ఇచ్చాం..

"ఆపరేషన్ సిందూర్ తర్వాత, మా DGMO పాక్ డిజిఎంఓకు సమాచారం అందించింది. భారతదేశం ఆత్మరక్షణలో భాగంగా వారి భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిందని తెలిపాం. మే 7న రాత్రి అర్ధరాత్రి 1.04 నుంచి 1.24 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ జరిగింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత బలగాలు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేశాయి. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులు వచ్చి మమ్మల్ని చంపిన తర్వాత ఏ చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారతదేశాన్ని రక్తసిక్తం చేసిన ఉగ్రవాదులను మోదీ హయాంలో మేం హతం చేశాం. పాక్ లోకి వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అమిత్ షా

అంతకుముందు అమిత్ షా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆపరేషన్ మహదేవ్ గురించి వివరించారు. "ఆపరేషన్ మహాదేవ్ సులేమాన్ అలియాస్ ఫైజల్, అఫ్ఘాన్, జిబ్రన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో మట్టుపెట్టారు. సులేమాన్ లష్కరే తోయిబాకు చెందిన ఎ-కేటగిరీ కమాండర్. అఫ్ఘాన్, జిబ్రన్‌లు సైతం లష్కరే తోయిబాకు చెందిన ఎ-కేటగిరీకి చెందిన ఉగ్రవాదులు. బైసరన్ లోయ పహల్గాంలో కాల్పులు జరిపి అమాయక పౌరులను హతమార్చిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు" అని ఆయన పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
Texas Resident Rips Indian Flag: డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Embed widget