అన్వేషించండి

Operation sindoor Speech: ప్రజలను రక్షించడం మా బాధ్యత, ఆపరేషన్ సింధూర్ భారత సైనిక శక్తికి ప్రతీక- రాజ్‌నాథ్ సింగ్

Rajnath singh Speech on operation sindoor | ఆపరేషన్ సింధూర్ భారత్ సైనిక శక్తికి, నిర్ణయాత్మక నాయకత్వానికి ప్రతీక అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

operation sindoor Discussion on Parliament Monsoon Session | న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పహల్గాం దాడి అనంతరం జరిగిన పరిణామాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల సమయంలో చర్చ ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ఆత్మరక్షణ కోసమే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) తెలిపారు. లోక్‌సభలో రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ.. భారత సైనికులకు హ్యాట్యాఫ్. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత సైనిక చర్య భారతదేశ సైనిక సామర్థ్యానికి, నిర్ణయాత్మక నాయకత్వానికి ప్రతీక అని అన్నారు. 

లోక్‌సభలో రక్షణ సింగ్ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ దేశ సరిహద్దులను కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న వీర సైనికులకు నమస్కరిస్తున్నాను. అదే సమయంలో భారతదేశ ఐక్యత, సమగ్రతను చాటి చెప్పేందుకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన అమరవీరులకు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. దేశ ప్రజల తరపున సైనికులందరికీ కృతజ్ఞతలు. ఎవరైనా సైన్యం గురించి మాట్లాడితే ఆచితూచి, ఆలోచించి మాట్లాడాలని "  అన్నారు.

అందుకే ఆపరేషన్ సిందూర్..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. "భారత పౌరులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. అందుకే మే 6, 7 తేదీలలో భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో చారిత్రాత్మక సైనిక చర్యను చేపట్టింది. ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు. ఇది భారతదేశ సార్వభౌమత్వం, గుర్తింపు, దేశ పౌరుల పట్ల కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో  ఉగ్రవాదంపై భారత విధానానికి ఒక ప్రభావవంతమైన ప్రదర్శన" అని పేర్కొన్నారు. 

సైన్యం లోతుగా అధ్యయనం చేసింది..

రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ‘ఆపరేషన్ సిందూర్ నిర్వహించడానికి ముందు, భారత సైన్యం ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసింది. మాకు చాలా చాయిస్‌లు అందుబాటులో ఉన్నాయి, కాని ఉగ్రవాదులు, వారి స్థావరాలకు ఎక్కువ నష్టం కలిగించాలని నిర్ణయం తీసుకున్నాం. వఅదే సమయంలో పాకిస్తాన్ పౌరులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేలా ఉగ్రవాద శిబిరాలను ఎంపిక చేసి నాశనం చేశాం" అని అన్నారు.

"భారత సైన్యం చేసిన ఈ ఖచ్చితమైన చర్యలో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ సైనిక చర్యలో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారికి శిక్షణ ఇచ్చే వారు, ఉగ్ర స్థావరాల నిర్వాహకులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థలకు చెందినవారు ఉన్నారు. మరోవైపు వీరికి పాకిస్తాన్ సైన్యంతో పాటు ISIతో ప్రత్యక్ష సంబంధాలు, మద్దతు ఉన్నాయని" రాజ్‌నాథ్ అన్నారు.

సుదర్శన చక్రం ఎంచుకోవాలని కృష్ణుడే చెప్పారు..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, "ధర్మాన్ని కాపాడుకోవడానికి సుదర్శన చక్రాన్ని ఎంచుకోవాలని శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకున్నాము. 2006 పార్లమెంటు దాడి, 2008 ముంబై దాడులను భారత్ చూసింది. ఇప్పుడు ఇక చాలు అని చెప్పి సుదర్శన చక్రాన్ని సెలక్ట్ చేసుకున్నాం. మనతో సమానంగా ఉన్నవారిపై యుద్ధం చేయాలి. అయితే ప్రేమ, శత్రుత్వం ఒకే స్థాయిలో ఉండాలని గోస్వామి తులసీదాస్ చెప్పారు. అదే సింహం కప్పను చంపితే, అది మంచి సందేశాన్ని ఇవ్వదు. మన ఆర్మీ, సాయుధ దళాలు సింహాల్లాంటివారు..."

నేడు జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భారత ఆర్మీ ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది. ఆర్మీ ఎన్ కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఓ ప్రకటనలో తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rana: శాశ్వత నిద్రలోకి హరీష్‌ రాణా! దేశంలోనే తొలి పాసివ్‌ యుథనేసియా మరణం !
శాశ్వత నిద్రలోకి హరీష్‌ రాణా! దేశంలోనే తొలి పాసివ్‌ యుథనేసియా మరణం !
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
New Ticket Cancellation Refund Rules: రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌!
రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌!
Shankaracharya Avimukteshwarananda Saraswati హిందూ ధర్మ రక్షణకు 2 లక్షల మందితో సైన్యం! ఆధునిక ఆయుధాలు ఇస్తాం! శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ప్రకటన!
హిందూ ధర్మ రక్షణకు 2 లక్షల మందితో సైన్యం! ఆధునిక ఆయుధాలు ఇస్తాం! శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ప్రకటన!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Embed widget