Bha Bha Ba OTT : తెలుగులోనూ మలయాళ యాక్షన్ కామెడీ 'భా భా బా' - కీ రోల్లో మోహన్ లాల్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bha Bha Ba OTT Platform : మలయాళ స్టార్ దిలీప్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ 'భా భా బా'. తాజాగా తెలుగు వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Mohan Lal's Bha Bha Ba Telugu Version OTT Streaming : మలయాళ స్టార్స్ దిలీప్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ 'భా భా బా'. గతేడాది డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'భా భా బా' మలయాళ వెర్షన్ ఇప్పటికే ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 10 రోజుల తర్వాత మంగళవారం నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీకి ధనుంజయ్ శంకర్ దర్శకత్వం వహించగా... వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్, రెడిన్ కింగ్ స్లే, సాండీ మాస్టర్, బాలు వర్గీస్, సిద్ధార్థ్ భరతన్, బైజు సంతోష్, సర్న్య పొనవన్ నటించారు.
మలయాళ స్టార్స్ దిలీప్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ 'భా భా బా'. గతేడాది డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
View this post on Instagram
Also Read : అమెజాన్ ప్రైమ్ కాదు.. మరో ఓటీటీలోనూ 'డ్రైవ్' - ఆది పినిశెట్టి సైబర్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
లైంగిక ఆరోపణల కేసు నుంచి రిలీఫ్ పొందిన తర్వాత మలయాళ స్టార్ దిలీప్ 'భా భా బా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే, స్పూఫ్ కామెడీని కొందరు ఇష్టపడగా... మరికొందరిని అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్సే వచ్చినప్పటికీ ఆ తర్వాత వసూల్లు తగ్గాయి. సినిమా మొత్తం రూ.23.10 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.
స్టోరీ ఏంటంటే?
కేరళలో సీఎంగా జోసెఫ్ (బైజు సంతోష్) ఘన విజయం సాధిస్తాడు. తొలిసారిగా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా అతన్ని కిడ్నాప్ చేస్తారు. దీంతో పోలీసులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంటుంది. సీఎం కొడుకు నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్ఐఏ ఏజెంట్గా పని చేస్తుండగా... తన తండ్రి కిడ్నాప్ కేసు ఛేదించేందుకు స్వయంగా రంగంలోకి దిగుతాడు. తనతో కలిసి పని చేసేందుకు ఓ పవర్ ఫుల్ టీం సెట్ చేసుకుంటాడు.
విచారణలో భాగంగా తన తండ్రిని కిడ్నాప్ చేసింది రాడార్ (దిలీప్) అని నోబుల్కు తెలుస్తుంది. పగతోనే ఇలా చేసినట్లు గుర్తిస్తాడు. రాడార్కు ఘిల్లీ బాల (మోహన్ లాల్)తో కూడా సంబంధాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అసలు ఘిల్లీ బాల ఎవరు? రాడార్కు జోసెఫ్కు సంబంధం ఏంటి? తన తండ్రిని నోబుల్ రక్షించుకోగలిగాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















