అన్వేషించండి

Debate On Operation Sindoor: పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో ప్రత్యేక చర్చ- టీడీపీ ఎంపీలకు ఛాన్స్

Parliament Monsoon Session | భారత పార్లమెంటు ఉభయ సభలలో సిందూర్‌ ఆపరేషన్‌పై చర్చ జరగనుంది. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వంపై మంత్రులు, ప్రతిపక్షాలు చర్చించనున్నాయి.

operation sindoor Discussion in Lok Sabha and Rajya Sabha | న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడితో పాటు భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'పై లోక్‌సభలో సోమవారం నాడు ప్రత్యేక చర్చ జరగనుంది. జాతీయ భద్రత, విదేశాంగ విధానాలు అంశాలపై చర్చలో భాగంగా  లోక్ సభలో సోమవారం మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 మధ్య చర్చ ప్రారంభం కానుంది.  వార్తా సంస్థ PTI ప్రకారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ 16 గంటల పాటు జరిగే చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.

అవసరమైతే చర్చలో ప్రధాని మోదీ సైతం

పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై మూడు రోజుల పాటు చర్చ కొనసాగే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటనలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, సుప్రియా సులే  సహా ప్రతిపక్షాలకి చెందిన ఇతర నాయకులు సభలో ప్రశ్నలు లేవనెత్తనున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపింది తానేనని, ఇరు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ పేర్కొనడం సైతం రెండు సభలలో హాట్ టాపిక్ కానుంది. 

కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ

పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చలకు జూలై 30 వరకు సభలో హాజరు కావాలని కాంగ్రెస్ తన లోక్‌సభ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సుప్రియా సులే  సహా ప్రతిపక్షాలకి చెందిన ఇతర నాయకులు సభలో మాట్లాడతారు. లోక్‌సభలో చర్చ కోసం ప్రతిపక్షాలు ఆదివారం వ్యూహరచన చేశాయి. పార్లమెంట్‌లో ఉదయం 10 గంటలకు ఇండియా బ్లాక్ ఫ్లోర్ లీడర్ల సమావేశం కానున్నారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు ప్రతిపక్షం ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి  సన్నాహాలు చేస్తుంది. 

లోక్‌సభలో ప్రతిపక్షాల నుండి మాట్లాడే సభ్యులు అంచనా: రాహుల్ గాంధీ (మంగళవారం మాట్లాడతారు), గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ, దీపేందర్ హుడా, కేసీ వేణుగోపాల్, రాజా బ్రార్ లేదా పంజాబ్ కు చెందిన ఓ కాంగ్రెస్ ఎంపీ చర్చలో పాల్గొని ప్రశ్నించనున్నారు. కాంగ్రెస్ స్పీకర్లలో శశి థరూర్ పేరు ఇంకా చేర్చలేదని సమాచారం. సమాజ్‌వాదీ పార్టీ ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, రాజీవ్ రాయ్. తృణముల్ కాంగ్రెస్ (TMC) నుండి: అభిషేక్ బెనర్జీ, డిఎంకె నుంచి కనిమొళి, ఎన్సిపి (ఎస్పీ) నుంచి సుప్రియా సులే, శివసేన (యుబిటి) నుంచి అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, ఆర్జెడి నుంచి అభయ్ కుష్వాహా, మిసా భారతి చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.
ఎన్టీఏ నుంచి నుంచి శ్రీకాంత్ షిండే (శివసేన), జేడీయూ నుంచి రాజీవ్ రంజన్ (లాలన్ సింగ్),  టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, హరీష్ బాలయోగి తదితరులు చర్చలో పాల్గొంటారని సమాచారం.

రాజ్యసభలో మంగళవారం పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చ ప్రారంభమవుతుంది. రెండు సభలలో దాదాపు 16 గంటల పాటు చర్చ జరగుంది. 

 

పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి వారం

పార్లమెంటు మొదటి వారంలో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేశారు. రాజ్యసభలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన నోటీసును ప్రస్తావించిన కొద్ది గంటలకే ఆయన రాజీనామా చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని ప్రతిపక్షం వర్షాకాల సమావేశాల మొదటి రోజున డిమాండ్ చేసింది, అందుకు ప్రభుత్వం అంగీకరించింది. బిహార్‌లో ఓటర్ల జాబితాలను ప్రత్యేకంగా సవరించడంపై ప్రతిపక్షం పార్లమెంటులోని రెండు సభల కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఓటర్ల జాబితాల సవరణ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో అధికార ఎన్డీఏ కూటమికి దోహదం చేస్తుందని ప్రతిపక్షం ఆరోపించింది. 

ఆపరేషన్ సిందూర్‌‌కు భారత్ శ్రీకారం

పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని బైసరన్ లోయలో పహల్గాంలో జరిపిన కాల్పుల్లో ఓ నేపాలీ సహా 26 మంది పౌరులు చనిపోయారు. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దాని ఫలితంగా 2 దేశాల మధ్య నాలుగు రోజుల పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య పరస్పరం అంగీకారంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే తాను మధ్యవర్తిత్వం చేశానని, ఇది తన క్రెడిట్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రస్తావించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

NDA Chief Ministers Meeting Delhi 2026: బుధవారం సీఎంలు, డిప్యుటీ సీఎంలతో ప్రధాని మోదీ భేటీ - చంద్రబాబు, పవన్ హాజరు - సంచలన నిర్ణయాలుంటాయా?
బుధవారం సీఎంలు, డిప్యుటీ సీఎంలతో ప్రధాని మోదీ భేటీ - చంద్రబాబు, పవన్ హాజరు - సంచలన నిర్ణయాలుంటాయా?
Breaking News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
YouTuber Maridhas Detained: అప్పుడే యూట్యూబర్లను అరెస్టు చేస్తున్న టీవీకే సర్కార్ - ఇతర పార్టీలు ఊరుకుంటాయా?
అప్పుడే యూట్యూబర్లను అరెస్టు చేస్తున్న టీవీకే సర్కార్ - ఇతర పార్టీలు ఊరుకుంటాయా?
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Afghanistan Test Highlights: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
YouTuber Maridhas Detained: అప్పుడే యూట్యూబర్లను అరెస్టు చేస్తున్న టీవీకే సర్కార్ - ఇతర పార్టీలు ఊరుకుంటాయా?
అప్పుడే యూట్యూబర్లను అరెస్టు చేస్తున్న టీవీకే సర్కార్ - ఇతర పార్టీలు ఊరుకుంటాయా?
Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Embed widget