అన్వేషించండి

Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతుల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు మండలి (SEIAA) సమావేశంలో ఈ ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 4,200 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే గత నెలలో కాలుష్య నియంత్రణ మండలి,  నీటిపారుదల శాఖలు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలను పర్యావరణ ప్రభావ మదింపు మండలికి అందజేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతులపై ఉత్తర్వులు వస్తాయని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని ఊట్కూరు, మద్దూర్, కొడంగల్, కోస్గి, మక్తల్, బొంరాస్‌పేట లాంటి 10 మండలాల పరిధిలో సుమారు 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. భూసేకరణలో భాగంగా రైతులకు ఎకరాకు గరిష్టంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని అధికారులు తమ నివేదికలో సూచించారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సుమారు 4,425 చెట్లను తొలగించాల్సి వస్తుందని, దానికి ప్రత్యామ్నాయంగా కాలువలు, చెరువు కట్టల వెంబడి అంతకు పదింతల మొక్కలను నాటి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

సీఎం నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగునీరు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాంతో పాటు ఉమ్మడి పాలమూరులోని పలు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. దాదాపు రూ.4,885 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 209 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భవిస్తోంది. ఇప్పటికే మొదటి దశ, రెండో దశ పంపుహౌస్‌లు, ప్రెజర్ మెయిన్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ నిర్వహించి, కాంట్రాక్ట్ సంస్థలకు పనులు కూడా అప్పగించారు. పర్యావరణ అనుమతులు మంజూరైతే ఉత్తర్వులు జారీ అయితే భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. 

ప్రాజెక్టు ప్రాముఖ్యత, ప్రత్యేకత ఇదే..
ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వెనుకబడిన ప్రాంతాలకు ఈ పథకం ప్రాణవాయువు లాంటిది. భూ సేకరణో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అనేది ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఇచ్చిన అత్యుత్తమ ధరలలో ఒకటి. ఇది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేలా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో అత్యాధునిక 'ప్రెజర్ మెయిన్' పైపులైన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు, దీనివల్ల నీటి వృధా తగ్గి నేరుగా పొలాలకు నీరు చేరుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Advertisement

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
Embed widget