అన్వేషించండి

Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం

దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జ్యూరిచ్ చేరుకుంది.   

హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారుల బృందానికి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు (Telangana Diaspora) ఘనస్వాగతం పలికారు. ఇప్పటికే మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దావోస్ చేరుకోగా, నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ బృందం వరుస సమావేశాల్లో పాల్గొననుంది. పర్యటనలో భాగంగా మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.

ఈ పర్యటనలో ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్ మ్యాప్‌ను ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి పరిచయం చేయనున్నారు. గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు మరియు పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను ఆయన ప్రస్తావిస్తారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.


Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం

తెలంగాణ రైజింగ్ 2047
ఈ విజన్ డాక్యుమెంట్ 2047 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో రూపొందించారు. ఇందులో ఏఐ (AI), సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాలకు పెద్దపీట వేశారు. గత ఏడాది దావోస్ పర్యటనలో సుమారు రూ. 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. నాల్గవ పారిశ్రామిక విప్లవం (4IR) కేంద్రంగా హైదరాబాద్‌ను మార్చడంతో పాటు రీజినల్ రింగ్ రోడ్ వెంట నిర్మించ తలపెట్టిన పారిశ్రామిక క్లస్టర్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సులో వివరించే అవకాశం ఉంది.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
Telangana municipal elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
లగ్జరీ కార్ల భారీ ధర వెనుక అసలు కారణాలు ఇవే - ఇలాంటి విషయాల కోసమే డబ్బు ఖర్చు పెట్టేది
లగ్జరీ కార్లు ఎందుకు అంత ఖరీదెక్కువ? నిజంగా దేని కోసం మనం అంత డబ్బు ఖర్చు పెడతాం?
Advertisement

వీడియోలు

T20 World Cup 2026 Jasprit Bumrah, Abhishek Sharma Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
T20 World Cup 2026 Jasprit Bumrah Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
Pakistan Conditions to Play with India | భారత్‌తో మ్యాచ్ ..షరతులు పెట్టిన పాక్
Nepal vs England T20 World Cup | ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్
Sourav Ganguly slams Pakistan | పాకిస్తాన్ పై సౌరబ్ గంగూలీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
Telangana municipal elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
లగ్జరీ కార్ల భారీ ధర వెనుక అసలు కారణాలు ఇవే - ఇలాంటి విషయాల కోసమే డబ్బు ఖర్చు పెట్టేది
లగ్జరీ కార్లు ఎందుకు అంత ఖరీదెక్కువ? నిజంగా దేని కోసం మనం అంత డబ్బు ఖర్చు పెడతాం?
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ - బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెనింగ్?
హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ - బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెనింగ్?
Punjab Crime News: క్లాస్ రూంలోనే అమ్మాయిని కాల్చి చంపి, ఆపై తాను కాల్చుకుని యువకుడు ఆత్మహత్య.. పంజాబ్ లా కాలేజీలో దారుణం
క్లాస్ రూంలోనే అమ్మాయిని కాల్చి చంపి, ఆపై తాను కాల్చుకుని యువకుడు ఆత్మహత్య.. పంజాబ్ లా కాలేజీలో దారుణం
Telangana Municipal Elections 2026: కేటీఆర్ తీరుతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నష్టం.. సీఎం కూడా లైట్ తీసుకున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
కేటీఆర్ తీరుతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నష్టం.. సీఎం కూడా లైట్ తీసుకున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
India US Trade Deal: అమెరికాతో $500 బిలియన్ల వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్‌కు భారత్‌ ఏమిచ్చింది?
అమెరికాతో $500 బిలియన్ల వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్‌కు భారత్‌ ఏమిచ్చింది?
Embed widget