అన్వేషించండి

Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు

Manmohan Singh : గురువారం మరణించిన ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఈ సందర్భంగా దేశంలోని పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

Manmohan Singh : 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని 3, మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో ఉన్న ఆయన పార్థివదేహాన్ని సందర్శనకు ఉంచారు. ఈ క్రమంలో దేశంలోని రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన ఇంటికి వెళ్లి పూలమాలతో నివాళి అర్పించారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా సింగ్ నివాసానికి చేరుకుని మాజీ ప్రధానికి నివాళులర్పించారు.

ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేసిన సింగ్

ఆర్థికాభివృద్ధికి నాంది పలికి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పేరుగాంచిన సింగ్‌కు నివాళులు అర్పిస్తూ ప్రధాని మోదీ తన సహచరుడితో కలిసి ఉన్న ఫొటోలను గురువారం పంచుకున్నారు. "భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ని కోల్పోయింది. నిరాడంబరమైన మూలాల నుండి ఎదిగి, గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు" అని X పోస్ట్‌లో మోదీ రాశారు. "ఆయన ఆర్థిక మంత్రితో పాటు వివిధ ప్రభుత్వ పదవుల్లో కూడా పనిచేశారు. అనేక సంవత్సరాలుగా మన ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. మన ప్రధానమంత్రిగా కూడా ఆయన అనేక సేవలందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేశారు” అన్నారాయన. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్‌సింగ్‌తో పరస్పర చర్చను గుర్తు చేసుకున్నారు. "పరిపాలనకు సంబంధించిన వివిధ విషయాలపై మేము విస్తృతమైన చర్చలు జరిపాం. అతని జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ఆయన మాటల్లో కనిపించేవి" అని మోదీ చెప్పారు.  

క్రీడా ప్రముఖుల నివాళులు

మాజీ ప్రధాని మరణంపై, టీమ్ ఇండియా బ్లాక్ బ్యాండ్ ధరించి మైదానంలో ఆడటానికి బయలుదేరింది. క్రీడా ప్రపంచంలోని అనేక ఇతర మాజీ ఆటగాళ్ళు సైతం సింగ్ కు నివాళులర్పించారు. వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్  యువరాజ్ సింగ్ వంటి వారు కూడా సంతాపం తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సెహ్వాగ్, "మా మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ జీ మృతికి నా హృదయపూర్వక సంతాపం" అని రాశారు. ఓం శాంతి. మాజీ ప్రధాని, పెద్దమనిషి, దార్శనికత కలిగిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణ వార్త తనకు బాధ కలిగించిందని హర్భజన్ సింగ్ రాశారు.

7 రోజులు సంతాప దినాలు

మన్మోహన్ మరణంతో కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారిక వినోదాలను నిలిపివేస్తూ ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను సగం ఎగుర వేసి, మరణించిన ఆయన ఆత్మకు ప్రముఖులు నివాళులర్పించారు. రేపు జరగనున్న అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని కేంద్రం తెలిపింది. ఇక ఆయన పార్థివదేహాన్ని శనివారం (డిసెంబర్ 28) రోజు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. రేపు రాజ్ ఘట్ సమీపంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Also Read : Manmohan Singh Death: సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆర్థికవేత్త అస్తమయం- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కన్నుమూత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Kannappa Songs: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
Embed widget