అన్వేషించండి

Delhi Election Rally: 'మీ అడ్రస్ చెప్పండి, లేఖ పంపిస్తాను' - జనం మధ్యలో తన చిత్రపటం గుర్తించిన ప్రధాని మోదీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Delhi Elections: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు తలమునకలయ్యాయి. ఆర్కే పురం ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారం సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. జనం మధ్యలో తన చిత్రపటాన్ని గుర్తించి లేఖ రాస్తానన్నారు.

Delhi Election : ఢిల్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆర్కే పురం ప్రాంతంలో పర్యటించారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా, పార్టీ అభ్యర్థులు, నేతలు పర్వేష్ వర్మ, కైలాష్ గెహ్లాట్, రమేష్ బిధూరి తదితరులు పాల్గొన్నారు. అయితే తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, మోదీ.. జనాల మధ్య ఉన్న తన చిత్రపటాన్ని గుర్తించారు. తన భద్రత కోసం మోహరించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బందిని పిలిచి, తన వద్దకు ఆ పోర్ట్రెయిట్ తీసుకురావాలని కోరారు. పోర్ట్రెయిట్‌పై అడ్రస్ రాయమని ఆ ఆర్టిస్ట్‌ను కోరడమే కాకుండా, త్వరలో అతనికి లేఖ రాస్తానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

బడ్జెట్ ప్రసంగంపై మోదీ ఏమన్నారంటే.. 

బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ, నెహ్రూ కాలంలో ఒక వ్యక్తి రూ.12 లక్షలు సంపాదిస్తే, నాలుగో వంతు పన్ను వసూలు చేసే వారని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. “జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో ఎవరికైనా జీతం రూ.12 లక్షలు ఉంటే అందులో నాలుగో వంతు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వంలో రూ.12 లక్షల జీతముంటే రూ.10 లక్షలు పన్నుకే పోయేది" అని మోదీ చెప్పారు. ఆ తర్వాత 10 -12 ఏళ్ల వరకు కూడా అంటే కాంగ్రెస్ టైంలో మీకు రూ.12 లక్షల జీతం ఉంటే రూ.2,60,000 పన్ను చెల్లించేవారు. నిన్నా, మొన్నా వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు రూ.12 లక్షలు సంపాదిస్తున్నా వారు కనీసం ఒక్క రూపాయి కూడా పన్ను కింద చెల్లించనక్కర్లేదు’’ అని తెలిపారు. ఇది మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని కొనియాడారు. 'వికసిత్ భారత్' కలను నెరవేర్చడానికి భారతదేశంలో నాలుగు స్తంభాలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చానన్న మోదీ.. ఆ నాలుగు స్తంభాలు రైతులు, మహిళలు, యువత, పేదలని చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం

దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీని హేళన చేస్తూ, గత పదకొండేళ్లలో ఆప్ నగరాన్ని నాశనం చేసిందని అన్నారు. ఆప్ నేతలపై ప్రజలు కోపంగా ఉన్నారని, తమ పార్టీని కూడా ప్రజలు ద్వేషిస్తున్నారని వారికి తెలుసునని చెప్పారు. వసంత పంచమితో వాతావరణంలో మార్పు మొదలవుతుందని, అలాగే ఫిబ్రవరి 5న మూడు రోజుల తర్వాత ఢిల్లీలో అభివృద్ధి అనే కొత్త వసంతం రాబోతుందని చెప్పారు. ఈ ఏడాది ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Also Read : Kejriwal: ప్రజలకు డబ్బు ఆశ చూపుతున్నారు.. నేను రాత్రంతా నిద్రపోలేదు: కేజ్రీవాల్​

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Nikhil Maliyakkal - Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
Donald Trump: ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మూడో ప్రపంచ యుద్ధం రావడం కన్ఫామ్: డొనాల్డ్ ట్రంప్
AP News: ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Embed widget